MP Ram Mohan Naidu: రాష్ట్రంలో ఒక్క కుటుంబం కూడా సంతోషంగా లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం జగన్ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి గెలిచారు.. కానీ, గెలిచాక ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయలేకపోయారని టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. వైసీపీ ఇచ్చిన 730 హామీల్లో 621 హామీలు అమలు చేయలేదు.. రాష్ట్రం అతలాకుతలంగా మారింది అని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఒక్క కుటుంబం కూడా సంతోషంగా లేదు.. 99.5 శాతం హామీలు అమలు చేసామని కల్లబోల్లి కబుర్లు చెబుతున్నారు.. అధికార పార్టీ నుంచి చర్చకు రండి.. హామీలపై చర్చిద్దాం అని సవాల్ చేశారు. ప్రెస్ మీట్ కూడా పెట్ట లేని ముఖ్యమంత్రి జగన్ అని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు.
Read Also: Cocaine : హెయిర్ కండీషనర్, బాడీ వాష్ బాటిళ్లలో రూ.15 కోట్ల విలువైన కొకైన్.. మహిళా స్మగ్లర్ అరెస్ట్
Also Read
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
- Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
- Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న ముఖ్యమంత్రి.. ఒక్క నోటిఫికేషన్ సరిగ్గా చేయలేదు అని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు. జాబ్ క్యాలేండరు కూడా లేదు.. ప్రత్యేక హోదాపై ఒక్క వైసీపీ ఎంపీ కూడా నోరు మెదపడంలేదు.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై పోరాటం చేయలేని దద్దమ్మలు వైసీపీ నాయకులు.. రైల్వేజోన్ కి మేం పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో స్పష్టం చేసింది.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని.. దోచుకుందాం దాచుకుందాం అనే ధోరణిలోనే వైసీపీ వాళ్లు ఉన్నారు అని టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.
Read Also: Medigadda Project: మేడిగడ్డలో తెలంగాణ మంత్రుల పర్యటన.. మంత్రి ఉత్తమ్ ఏమన్నారంటే..
విశాఖపట్నం మొత్తం భూకబ్జాలు చేస్తున్నారు అని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా చెలరేగిపోతుంది.. ఇసుక దోరక్క కార్మికులు ఉపాది లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. మద్యపాన నిషేధం అంటూ అబద్దపు ప్రచారం చేసారు.. మద్యం రేట్లు పెరుగుతున్నాయి తప్ప.. మద్యం నిషేధం లేదు.. పేద కుటుంబాల పైనా పన్నుల భారం వేస్తున్నారు.. 4 ఏళ్లలో శ్రీకాకుళం కలెక్టరేట్ కూడా కట్టలేక పోయారు.. ఆడుదాం ఆంధ్రా అంటే మీ అందరితో ఆడుతా అంటున్నాడు జగన్.. ఆర్దిక ఉగ్రవాది జగన్ తండ్రి అధికారంలో ఉండగానే దోచుకున్నాడు.. ఇప్పుడు వదిలేస్తాడా అని ఆయన అడిగారు. మంత్రి సిదిరి అప్పల రాజు సవాల్ ని స్వీకరిస్తున్నాం.. హామీల అమలు జిల్లా అభివృద్ధిపై చర్చకు మేం సిద్దంగా ఉన్నాం.. యూట్యూబ్ లలో లైక్ ల కోసం మంత్రి సీదిరి కాంట్రవర్శి కామెంట్స్ చేస్తున్నారు అని ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు.
తాజావార్తలు
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
-
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
-
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
ట్రెండింగ్
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!