Nandigam Suresh: ఈ దేశంలో జగన్ను భయపెట్టే మగాడు పుట్టలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ ప్రభుత్వం మహిళలకు భద్రత కల్పిస్తున్నదని ఎంపీ నందిగం సురేష్ తెలిపారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ప్రభుత్వం.. వైసీపీ ప్రభుత్వం అని అన్నారు. ఒకప్పుడు ఓటు వేయడానికి మాత్రమే ఎస్సీలు ఉండేవాళ్ళు.. ఈరోజు ఎస్సీలు హోంమంత్రులుగా పనిచేసే పరిస్థితి జగనన్న ప్రభుత్వంలో వచ్చిందని పేర్కొన్నారు. కర్మ గాలి చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు నిర్వీర్యం అయిపోతారని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో మనం ఉంటే మురికి కూపాలుగా మారతాయని కోర్టుల్లో చంద్రబాబు కేసులు వేశారని అన్నారు.
PM Modi: జనవరి 22న ఇంట్లో దీపాలు వెలిగించండి.. భక్తులకు ప్రధాని విజ్ఞప్తి
Also Read
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టుకు సిట్..
- Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు కోసం వేచి చూస్తున్న ముగ్గురు మహిళలపై దూసుకెళ్లిన బొలెరో.!
- WhatsApp New Feature: వాట్సాప్లో సరికొత్త ఫీచర్.. ఇక, ఎవరి బర్త్డేలు మిస్ కారు..!
- Manmadha Re-Release: శింబు కల్ట్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ 'మన్మధ' రీ-రిలీజ్ డేట్ ఫిక్స్.!
ఎస్సీలలో నా మేనత్తలు, మేనమామలు ఉన్నారని చెప్పుకునే గొప్ప వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఎంపీ నందిగం సురేష్ తెలిపారు. చట్టాలకు దగ్గర చేయాలని, చదువులకు దగ్గర చేయాలన్న ఆలోచనతో ఎస్సీలకు హోంమంత్రి, విద్యాశాఖ మంత్రి ఇచ్చిన ఘనత సీఎం జగన్ ది అని ప్రశంసల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ తెలంగాణలో 8 చోట్ల పోటీ చేస్తే.. ఏడు చోట్ల డిపాజిట్లు కోల్పోయారని విమర్శించారు. తెలంగాణలో ఒక దళిత బిడ్డకు వచ్చిన ఓట్లు కూడా జనసేనకు రాలేదు.. ఇలాంటి వాళ్లు అందరూ కలిసి జగన్ ను ఓడిస్తారంట అని దుయ్యబట్టారు.
PM Modi: జనవరి 22న ఇంట్లో దీపాలు వెలిగించండి.. భక్తులకు ప్రధాని విజ్ఞప్తి
పొలాలు తగలబెట్టారన్న అక్రమ కేసులో చంద్రబాబు తనను జైల్లో కూర్చోబెడితే.. జగన్ తనను బయటకు తీసుకువచ్చి పార్లమెంట్ లో కూర్చోబెట్టారని ఎంపీ చెప్పారు. చంద్రబాబుకు లోకేష్ కు భయం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి చూపెట్టాడు అని పేర్కొన్నారు. కొత్తగా పవన్ కళ్యాణ్ ని తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డిని మీరేం చేయలేరని తెలిపారు. ఈ దేశంలో జగన్ ను భయపెట్టే మగాడు పుట్టలేదు.. జగన్మోహన్ రెడ్డి భయపడే వ్యక్తి కాదు, అసలు జగన్ ను చూస్తే మీరు తట్టుకోలేరని అన్నారు. రాష్ట్ర ప్రజలకు ప్రేమకు జగన్మోహన్ రెడ్డి బానిసలాగా పనిచేస్తున్నారని ఎంపీ సురేష్ తెలిపారు.
తాజావార్తలు
-
Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టుకు సిట్..
-
Mysa: నీటి అడుగున రష్మిక రిస్క్.. ‘మైసా’ నుంచి క్రేజీ అప్డేట్
-
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు కోసం వేచి చూస్తున్న ముగ్గురు మహిళలపై దూసుకెళ్లిన బొలెరో.!
-
WhatsApp New Feature: వాట్సాప్లో సరికొత్త ఫీచర్.. ఇక, ఎవరి బర్త్డేలు మిస్ కారు..!
-
The Tatas Web Series: టాటా సామ్రాజ్యం కథ వెబ్ సిరీస్గా.. నాలుగు తరాల చరిత్రతో ‘ది టాటాస్’
ట్రెండింగ్
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!