TDP: టీడీపీలో చేరిన ఎంపీ మాగుంట.. ఆయన రాకతో రాజకీయాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో చేరారు. ఆయనతో పాటు కుమారుడు రాఘవరెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, అద్దంకి వైసీపీ నేతలు బాచిన కృష్ణ చైతన్య, గరటయ్య టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు చంద్రబాబు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి.. సైకో పాలన పోవాలి ఎన్డీఏ పాలన రావాలన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మాగుంట రాకతో ప్రకాశం జిల్లా రాజకీయాలు తిరగబడింది. దర్శి అభ్యర్థిని కూడా త్వరలో ప్రకటిస్తానని చెప్పారు.
వర్మ త్యాగానికి సిద్ధపడ్డాడు: చంద్రబాబు
మరోవైపు.. చంద్రబాబుతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ భేటీ అయ్యారు. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండటంతో వర్మతో మాట్లాడేందుకు చంద్రబాబు ఇంటికి పిలిపించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం వర్మ ఎంత కృషి చేశాడని పేర్కొన్నారు. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నడంతో వర్మ ఆయనకు సహకరించాలని కోరానన్నారు. పవన్ కళ్యాణ్ గెలుపునకు సహకరిస్తానని వర్మ హామీ ఇచ్చారన్నారు. వర్మ త్యాగానికి సిద్ధపడ్డాడు.. పిఠాపురం వర్మకి మొదట విడతలో ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ను అత్యధిక మెజారిటీతో పిఠాపురం నుంచి గెలిపించాలని.. టీడీపీ కార్యకర్తలు, వర్మ అభిమానులు పవన్ కళ్యాణ్ గెలుపునకు కృషి చేయాలన్నారు. వర్మ అభ్యర్థి అయితే ఎలా పని చేస్తారో అదే ఉత్సాహంతో పవన్ కళ్యాణ్ గెలుపునకు పని చేయాలని చంద్రబాబు తెలిపారు.
Also Read
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
- YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
- Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
గెలుపు బాధ్యత మేమే తీసుకుంటాం:
పిఠాపురం టీడీపీ ఇంచార్జ్ వర్మ మాట్లాడుతూ.. పిఠాపురంలో టీడీపీ పునాదులు బలంగా ఉన్నాయని అన్నారు. తమ ఇబ్బందులను అధినేత దృష్టికి తీసుకువచ్చామన్నారు. తానేం వేరే పార్టీల వైపు చూడలేదు.. అధినేత నిర్ణయంపై కొంత మనస్థాపం చెందామని తెలిపారు. పిఠాపురం అభివృద్ధి బాధ్యత తనది అని చంద్రబాబు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. తాను ఏ పదవి కోరకపోయినా చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. పవన్ కళ్యాణ్ తనను పిలిస్తే వెళ్లి కలుస్తాను.. గెలుపు బాధ్యత తామే తీసుకుంటామని వర్మ చెప్పారు.
తాజావార్తలు
-
Asim Munir: ఇరాన్ ముందు కీలక ప్రతిపాదనలు.. హార్ముజ్పై అమెరికా ఆఫర్ ఇదేనా?
-
Dr Priyanka హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను కలిసిన కుటుంబ సభ్యులు!
-
Kiss Car: బాయ్ ఫ్రెండ్ కారుకు 3,400 ముద్దులు.. షాకిచ్చిన పోలీసులు
-
CM Revanth Reddy : మూసీ ప్రాజెక్ట్పై రేవంత్ స్పీడ్.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Rafale vs J-16: రఫేల్తో చైనీస్ J-16 పోరాటం.. నిశితంగా గమనిస్తున్న భారత్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!