TDP: టీడీపీలో చేరిన ఎంపీ మాగుంట.. ఆయన రాకతో రాజకీయాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో చేరారు. ఆయనతో పాటు కుమారుడు రాఘవరెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, అద్దంకి వైసీపీ నేతలు బాచిన కృష్ణ చైతన్య, గరటయ్య టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు చంద్రబాబు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి.. సైకో పాలన పోవాలి ఎన్డీఏ పాలన రావాలన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మాగుంట రాకతో ప్రకాశం జిల్లా రాజకీయాలు తిరగబడింది. దర్శి అభ్యర్థిని కూడా త్వరలో ప్రకటిస్తానని చెప్పారు.
వర్మ త్యాగానికి సిద్ధపడ్డాడు: చంద్రబాబు
మరోవైపు.. చంద్రబాబుతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ భేటీ అయ్యారు. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండటంతో వర్మతో మాట్లాడేందుకు చంద్రబాబు ఇంటికి పిలిపించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం వర్మ ఎంత కృషి చేశాడని పేర్కొన్నారు. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నడంతో వర్మ ఆయనకు సహకరించాలని కోరానన్నారు. పవన్ కళ్యాణ్ గెలుపునకు సహకరిస్తానని వర్మ హామీ ఇచ్చారన్నారు. వర్మ త్యాగానికి సిద్ధపడ్డాడు.. పిఠాపురం వర్మకి మొదట విడతలో ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ను అత్యధిక మెజారిటీతో పిఠాపురం నుంచి గెలిపించాలని.. టీడీపీ కార్యకర్తలు, వర్మ అభిమానులు పవన్ కళ్యాణ్ గెలుపునకు కృషి చేయాలన్నారు. వర్మ అభ్యర్థి అయితే ఎలా పని చేస్తారో అదే ఉత్సాహంతో పవన్ కళ్యాణ్ గెలుపునకు పని చేయాలని చంద్రబాబు తెలిపారు.
Also Read
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Deputy CM Pawan Kalyan: సీఎస్, డీజీపీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ.. పోక్సో కేసులపై కీలక సూచనలు
- AP Weather: సమ్మర్ను తలపిస్తున్న ఏపీ వాతావరణం.. 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
గెలుపు బాధ్యత మేమే తీసుకుంటాం:
పిఠాపురం టీడీపీ ఇంచార్జ్ వర్మ మాట్లాడుతూ.. పిఠాపురంలో టీడీపీ పునాదులు బలంగా ఉన్నాయని అన్నారు. తమ ఇబ్బందులను అధినేత దృష్టికి తీసుకువచ్చామన్నారు. తానేం వేరే పార్టీల వైపు చూడలేదు.. అధినేత నిర్ణయంపై కొంత మనస్థాపం చెందామని తెలిపారు. పిఠాపురం అభివృద్ధి బాధ్యత తనది అని చంద్రబాబు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. తాను ఏ పదవి కోరకపోయినా చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. పవన్ కళ్యాణ్ తనను పిలిస్తే వెళ్లి కలుస్తాను.. గెలుపు బాధ్యత తామే తీసుకుంటామని వర్మ చెప్పారు.
తాజావార్తలు
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
-
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!