TDP: టీడీపీలో చేరిన ఎంపీ మాగుంట.. ఆయన రాకతో రాజకీయాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో చేరారు. ఆయనతో పాటు కుమారుడు రాఘవరెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, అద్దంకి వైసీపీ నేతలు బాచిన కృష్ణ చైతన్య, గరటయ్య టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు చంద్రబాబు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి.. సైకో పాలన పోవాలి ఎన్డీఏ పాలన రావాలన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మాగుంట రాకతో ప్రకాశం జిల్లా రాజకీయాలు తిరగబడింది. దర్శి అభ్యర్థిని కూడా త్వరలో ప్రకటిస్తానని చెప్పారు.
వర్మ త్యాగానికి సిద్ధపడ్డాడు: చంద్రబాబు
మరోవైపు.. చంద్రబాబుతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ భేటీ అయ్యారు. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండటంతో వర్మతో మాట్లాడేందుకు చంద్రబాబు ఇంటికి పిలిపించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం వర్మ ఎంత కృషి చేశాడని పేర్కొన్నారు. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నడంతో వర్మ ఆయనకు సహకరించాలని కోరానన్నారు. పవన్ కళ్యాణ్ గెలుపునకు సహకరిస్తానని వర్మ హామీ ఇచ్చారన్నారు. వర్మ త్యాగానికి సిద్ధపడ్డాడు.. పిఠాపురం వర్మకి మొదట విడతలో ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ను అత్యధిక మెజారిటీతో పిఠాపురం నుంచి గెలిపించాలని.. టీడీపీ కార్యకర్తలు, వర్మ అభిమానులు పవన్ కళ్యాణ్ గెలుపునకు కృషి చేయాలన్నారు. వర్మ అభ్యర్థి అయితే ఎలా పని చేస్తారో అదే ఉత్సాహంతో పవన్ కళ్యాణ్ గెలుపునకు పని చేయాలని చంద్రబాబు తెలిపారు.
Also Read
- AP Liquor Case: లిక్కర్ కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు.. కీలక వివరాలు వెల్లడి
- Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
- Pawan Kalyan : పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులతో పవన్ అత్యవసర సమీక్ష.!
- Pawan Kalyan: గోదావరి పుష్కరాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కార్యాచరణ ప్రకటన..
గెలుపు బాధ్యత మేమే తీసుకుంటాం:
పిఠాపురం టీడీపీ ఇంచార్జ్ వర్మ మాట్లాడుతూ.. పిఠాపురంలో టీడీపీ పునాదులు బలంగా ఉన్నాయని అన్నారు. తమ ఇబ్బందులను అధినేత దృష్టికి తీసుకువచ్చామన్నారు. తానేం వేరే పార్టీల వైపు చూడలేదు.. అధినేత నిర్ణయంపై కొంత మనస్థాపం చెందామని తెలిపారు. పిఠాపురం అభివృద్ధి బాధ్యత తనది అని చంద్రబాబు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. తాను ఏ పదవి కోరకపోయినా చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. పవన్ కళ్యాణ్ తనను పిలిస్తే వెళ్లి కలుస్తాను.. గెలుపు బాధ్యత తామే తీసుకుంటామని వర్మ చెప్పారు.
తాజావార్తలు
-
13 ఏళ్లకే ఐపీఎల్ ఎంట్రీ.. 23 మ్యాచ్ల్లోనే ప్రపంచ క్రికెట్ను షేక్ చేసిన Vaibhav Sooryavanshi రికార్డుల లిస్ట్ ఇదే..
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
IRAN-US DEAL: అక్షరాల రూ.28లక్షల కోట్ల భారీ డీల్.. ఇరాన్-అమెరికా యుద్ధంలో కీలక మలుపు!
-
Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
-
Suvendu Adhikari: బంగ్లాదేశ్ గుండెల్లో వణుకు పుట్టిస్తోన్న బెంగాల్ సీఎం.. అక్రమ వలసదారుల తాట తీస్తున్నాడుగా!
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..