MP K.Laxman : మీ పార్టీ కుటుంబ పార్టీ అని మరోసారి రుజువయ్యింది
తెలంగాణ ప్రజలకు , భారత ప్రజలకు రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. బుధవారం ఈ మేరకు ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు. మీ పార్టీ కుటుంబ పార్టీ అని మరోసారి రుజువయ్యింది. ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పించి రెండడుగుల దూరంలో ఉన్న మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు విగ్రహం మొహం చూడటానికి కూడా రాహుల్ ఇష్టపడలేదు. మీది భారత్ జోడో యాత్ర కాదు భారత్ తోడో యాత్ర చార్మినార్ దగ్గరకు వెళ్లిన రాహుల్ భాగ్యలక్ష్మి అమ్మవారిని ఎందుకు దర్శించుకోలేదు. తెలంగాణలో యాత్ర ముగిసేలోపే రాహుల్ క్షమాపణ చెప్పాలి అంటూ.. తీవ్రంగా దుయ్యబట్టారు ఎంపీ లక్ష్మణ్. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ మెప్పు కోసం చేసిన నాటకమా ఇది సమాధానం చెప్పాలని, తెలంగాణ ప్రజలను , భారతదేశ ఆర్ధిక పరిస్థితిని గతిని మార్చిన నాయకుడు కాంగ్రెస్ పార్టీ ద్వారానే దేశానికి ప్రధానిగా పని చేసిన పీవీ నర్సింహారావు విగ్రహానికి ఎందుకు నివాళుర్పించలేదో వెంటనే సమాధానం చెప్పాలన్నారు.
Also Read : Jagadish Reddy : ఐటీ దాడులపై స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి..
దేశ ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు వెంటనే రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మీ కుటుంబానికి బానిసలుగా ఉన్న వారికి మాత్రమే విలువ ఉంటుందని మరోసారి రుజువయ్యిందని, ప్రధానిగా చేసిన పీవీ నర్సింహరావుకు ఢిల్లీలో ఘాట్ ఇవ్వకుండా అంతిమసంస్కారాలు కూడా ఢిల్లీలో చేయకుండా హైదరాబాద్ పంపించి ఆనాడు అవమానించారని, ఈనాడు పీవీ విగ్రహానికి నివాళులు అర్పించ కుండా అవమానించారని లక్ష్మణ్ గుర్తు చేశారు. కొత్త కాంగ్రెస్ అద్యక్షుడు పీవీ నర్సింహరావు తో కలిసి పనిచేసిన మల్లిఖార్జున్ ఖర్గే కూడా ఈ విషయంపై స్పందించాలని డిమాండ్ చేశారు .
చార్మినార్ దగ్గరకు వెళ్లి మాట్లాడిన రాహుల్ గాంధీ పక్కనే ఉన్న చారిత్రాత్మకమైన భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లకపోవడమేంటని ప్రశ్నించారు. మీరు చేస్తున్నది భారత్ జోడో యాత్రనా లేక భారత్ తోడో యాత్ర నా అని లక్ష్మణ్ దుయ్యబట్టారు. మీ నాయకత్వమే కదా భారత్ను మత ప్రాతిపదికన పాకిస్థాన్ గా విడగొట్టి , కశ్మీర్ ను ఆగం చేసిందని, మరోసారి దేశాన్ని విభజించే కుట్ర మీ యాత్ర ద్వారా సాగుతున్నదని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ యాత్రకు పూర్తిగా అధికార టీఆర్ఎస్ పార్టీ మద్దతుందని తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల జోడో యాత్ర సాగిన విషయం ప్రజలకు చాలా స్పష్టంగా అర్ధమవుతున్నది అన్నారు. రాహుల్ గాంధీ చేస్తోన్న యాత్రతో కాంగ్రెస్ పార్టీ అసలు రంగు భయటపడిందని, యాత్ర ద్వారా ప్రయాస తప్ప ప్రజల మద్దతు లభించదని ఆయన ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Macron-Meloni Kiss: ఇటలీ ప్రధాని మెలోని బుగ్గపై ముద్దు పెట్టిన మాక్రాన్.. వీడియో వైరల్
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Story Board: మహిళా రిజర్వేషన్ బిల్లుకు మళ్లీ షాక్..! 54 ఓట్ల తేడాతో..
-
Iran: గంటలో 7 అబద్ధాలా.? ట్రంప్ వాదనలపై ఇరాన్ ఆగ్రహం..
-
IPL 2026-SRH: ఎస్ఆర్హెచ్ నుంచి కీలక అప్డేట్.. సన్రైజర్స్లోకి ముంబై ఇండియన్స్ పేసర్!
ట్రెండింగ్
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!
-
Chia Seeds : మధుమేహానికి చెక్ పెట్టే చియా సీడ్స్.. షుగర్ లెవల్స్ తగ్గాలంటే ఇలా తిని చూడండి!
-
రాత్రి పడుకునే ముందు శరీరంలోని ఈ రెండు భాగాలకు ఆవనూనెతో ఎందుకు మర్దన చేయాలి?