MP K.Laxman : కేటీఆర్ మతిభ్రమించి బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే అంటున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేటీఆర్ మతిభ్రమించి బీజేపి కాంగ్రెస్ ఒక్కటే అంటున్నారన్నారు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ డిప్రెషన్ లో ఎం మాట్లాడుతున్నారో తెలియడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలా నిర్వహించాలి అనేది.. ఎన్నికల కమిషన్ పరిధిలోని అంశమని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ఎప్పుడు నితీష్ కుమార్ పై వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు. కుల గణన పై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. తెలంగాణ, కర్ణాటక లో కాంగ్రెస్ హ్యాక్ చేసే గెలిచిందా? దిగ్విజయ్ సింగ్ చెప్పాలన్నారు లక్ష్మణ్. పార్లమెంట్ ఎన్నికల్లో జనసెనా తో పొత్తు ఉండదు…ఒంటరిగానే పోటీకి దిగుతామని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా.. పార్లమెంట్ ఎన్నికల్లో 10సీట్లు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొన్న మమత బెనర్జీ నేడు నితీష్ కుమార్ ఆ కూటమి నుంచి బయటికి వచ్చారని ఆయన అన్నారు. దేశం కోసం మోడీ పని చేస్తే.. కాంగ్రెస్ మాత్రం నెహ్రూ గాంధీల…కుటుంబాల కోసం పని చేస్తున్నాయని ఆయన వెల్లడించారు.
Also Read
- Xi Jinping: భారత్లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- CIBIL Score: మీ ‘సిబిల్’ స్కోర్ తక్కువగా ఉందా? రికవర్ చేయడానికి ఈ 5 చిట్కాలు పాటించండి..
- Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
ఎన్నికల ప్రచారంలో భాగమే రేవంత్ దావోస్ పర్యటన అని, కూటమి బీటాల పరిణామమే బీహార్ రాజకీయాలు మారుతున్నాయన్నారు. కాంగ్రెస్స్ అంటేనే అవినీతి… అవినీతి అంటేనే కాంగ్రెస్ ఇవి రెండు పర్యాయ పదాలు అని, కర్ణాటకలో కాంగ్రెస్స్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కాక ముందే అక్కడ ఆ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ కి తెలంగాణ ఏటీఎం కాబోతుందని, కాళేశ్వరం లో జరిగిన అవినీతిని దోపిడీని బయట పెడతామన్నారన్నారు. కానీ ఇవాళ వారి గొంతులు మూగబోతున్నాయని, సీఎం ఏమో మొత్తం ప్రాజెక్ట్ పై విచారణ అంటాడు.. మంత్రి ఏమో మేదిగడ్డ వరకే ఎంక్వైరీ అంటుడని, గ్యారంటీ లు అమలు చేయకుండా పార్లమెంట్ ఎన్నికల కోడ్ బూచిగా చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాహూల్ గాంధీ భారత్ జొడో న్యాయ యాత్ర కి బస్సు సైతం తెలంగాణ నుంచి ఇచ్చారని, మోడీ మూడోసారి ప్రధాని అవుతారని అక్కసుతో కాంగ్రెస్ తో పాటు .. కొన్ని ప్రాంతీయ పార్టీలు కలిసి విపక్ష కూటమి పెట్టాయన్నారు లక్ష్మణ్. మోడీ నీ ఓడించాలని అజెండా తప్పితే వారికి దేశ ప్రయోజకులు పట్టవని, ఆ కూటమి ఈరోజు బీటాలు వారుతుందన్నారు.
తాజావార్తలు
-
Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
-
Xi Jinping: భారత్లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
-
MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
-
CIBIL Score: మీ ‘సిబిల్’ స్కోర్ తక్కువగా ఉందా? రికవర్ చేయడానికి ఈ 5 చిట్కాలు పాటించండి..
-
China-India Air Connectivity: 6 ఏళ్ల తర్వాత మళ్లీ గ్వాంగ్జౌ-న్యూఢిల్లీ విమాన సర్వీసులు.. సెప్టెంబర్ 21 నుంచి రాకపోకలు
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..