Etala Rajender: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సంచలన ఆరోపణలు చేసిన ఎంపీ ఈటల రాజేందర్..
- రాజ్యాంగం హక్కులను హరించే అధికారం ఎవ్వరికి లేదు
- 2021 హుజరాబాద్ ఉప ఎన్నికల్లో నా ఫోన్ టాప్ చేశారు
- నన్ను ఓడగొట్టాలని ప్రయత్నలు చేశారు
- నేను ఎవ్వరి తో మాట్లాడుతున్నానో తెలుసుకున్నారు
- బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించే అధికారం ఎవ్వరికి లేదని… 2021 హుజరాబాద్ ఉప ఎన్నికల్లో నా ఫోన్ టాప్ చేశారని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా విచారణకు హాజరయ్యారైన ఆయన సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తనను ఓడగొట్టాలని ప్రయత్నలు చేశారని.. తాను ఎవ్వరితో మాట్లాడుతున్నానో తెలుసుకున్నారన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా తన ఫోన్ టాప్ చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ తో లాలూచి పడక పోతే నిష్పక్ష పాతంగా విచారణ చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రిటైర్డ్ అయ్యాక కూడా ప్రభాకర్ రావు కు పదవి కట్టబెట్టారని.. ప్రభాకర్ రావు ను అక్రమంగా ఎస్ఐబీలో నియమించారన్నారు. ప్రణీత్ రావు, బుజంగారావు, రాదా కిషన్ రావు తిరుపతన్న వీళ్ళందరూ పైన ఉన్న అధికారులు ప్రమేయంతో పాటు నేతల ప్రమేయం కూడా ఉందని ఆరోపించారు.
READ MORE: Bhatti Vikramarka: నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పిన డిప్యూటీ సీఎం.. త్వరలో మరో 30 వేల ఉద్యోగాలు..!
Also Read
- Tamil Nadu: చంటి బిడ్డతో అసెంబ్లీకి వచ్చిన టీవీకే ఎమ్మెల్యే.. విమర్శలపై కౌంటర్
- Crispy Drumstick Fry Recipe: మునగకాయతో క్రిస్పీ స్నాక్.. రెసిపీ సింపుల్!
- Supreme Court: ఉరిశిక్షకు బదులుగా ఇంజెక్షన్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Electric Aircraft: వరల్డ్లో తొలి ఎలక్ట్రిక్ విమాన పరీక్ష విజయవంతం.. ఖర్చెంతో తెలుసా?
“ప్రణీత్రావు, ప్రభాకర్ రావు, రాధా కిషన్రావు, శ్రవణ్ రావు వీళ్లంతా కూడా ప్రైవేటు వ్యక్తుల ఫోన్ నంబర్లను కూడా ఫోన్ లను రికార్డ్ చేశారు. మరో రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేసిన ఇంద్రాసేనారెడ్డి ఫోన్ కూడా టాప్ చేశారు.. ఎమ్మెల్యేల ఫోన్స్, మంత్రుల ఫోన్స్ సినిమా రంగానికి చెందిన వాళ్ళ ఫోన్స్ జడ్జ్ ల ఫోన్ టాప్ చేశారు. రాజ్యాంగం హక్కులను కాపాడాలంటే ఇలాంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలి. చట్ట ప్రకారం వారిని శిక్షించాలి. లేకపోతే ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ తో కుమ్మక్కు అయినట్టే భావించాలి. ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే దర్యాప్తు సక్రమంగా జరిపించాలి.లేదంటే ఫోన్ టాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాలి. ఎంతటి కేసునైనా సీబీఐ పరిష్కరిస్తుంది..” అని ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
READ MORE: Chiranjeevi: మెగాస్టార్ తల్లి ఆరోగ్యంపై ఫేక్ న్యూస్.. వీడియో షేర్ చేసిన ఉపాసన!
తాజావార్తలు
-
Tamil Nadu: చంటి బిడ్డతో అసెంబ్లీకి వచ్చిన టీవీకే ఎమ్మెల్యే.. విమర్శలపై కౌంటర్
-
Crispy Drumstick Fry Recipe: మునగకాయతో క్రిస్పీ స్నాక్.. రెసిపీ సింపుల్!
-
Prabhas-Hanu Raghavapudi: ‘ఫౌజీ’తో ఆగదట.. హను రాఘవపూడితో ప్రభాస్ మరోసారి జతకట్టనున్నాడా?
-
Supreme Court: ఉరిశిక్షకు బదులుగా ఇంజెక్షన్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..
-
Electric Aircraft: వరల్డ్లో తొలి ఎలక్ట్రిక్ విమాన పరీక్ష విజయవంతం.. ఖర్చెంతో తెలుసా?
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!