Mother Suicide: కొడుకు చావును చూడలేక ముందే తనువు చాలించిన తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mother Suicide in Hyderabad: ఆ బాలుడిది ఆడుతూపాడుతూ గడిపే వయసు. అంగవైకల్యం ఆ ఎనిమిదేళ్ల బాలుడి జీవితాన్ని తలకిందులు చేసింది. ఆ బాలుడి బాధను చూసి ఆ కన్న హృదయం కన్నీరుమున్నీరైంది. ఆ బాలుడి కారుణ్య మరణం కోసం దరఖాస్తు చేసుకుందామని భార్యపై బాలుడి తండ్రి ఒత్తిడి తెచ్చాడు. అంగవైకల్యంతో ఉన్న కుమారుడి మెర్సి కిల్లింగ్ కోసం ఒప్పుకోవాలని ఆమెను బాధించాడు. ఎంతైనా కన్నతల్లి కనుక ససేమిరా అంది. కానీ భర్త వేధింపులు చాలా కాలంగా ఎక్కువైంది. దీంతో కొడుకు చావును చూడలేక ముందే తనువు చాలించింది ఆ తల్లి.
భర్త వేధింపులు భరించలేక, కొడుకు చావుని చూడలేక సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్లోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కేపీహెచ్బీలోని మంజీర ట్రినిటీ హోమ్స్ 23వ అంతస్తు నుంచి దూకి సాఫ్ట్వేర్ ఇంజినీర్ స్వాతి(38) ఆత్మహత్యకు పాల్పడింది. స్వాతి భర్త శ్రీధర్ కూడా సాప్ట్ వేర్ ఉద్యోగమే చేస్తున్నాడు. ఎనిమిదేళ్ల అంగవైకల్యం వున్న కుమారుడి విషయంలో స్వాతిని ఆమె భర్త, అతని కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది. కుమారుడి కారుణ్య మరణం కోసం దరఖాస్తు చేద్దామని భర్త, అతని బంధువులు స్వాతిని ఒత్తిడి చేశారు. ఆమె ఆ ప్రతిపాదనకు చచ్చినా ఒప్పుకోనని తేల్చిచెప్పింది. కానీ భర్త, అతని కుటుంబసభ్యులు ఎలాగైనా తన కుమారుడిని.. చంపేస్తారని స్వాతి భావించింది.
Also Read
- Rahul Gandhi: రక్తం ఓడుతున్న ముఖం, ఊడిపోయిన షూ.. ప్రధాని ఇంటి ముట్టడితో మారిన రాహుల్ గాంధీ పొలిటికల్ మార్క్!
- Delhi protests: హస్తినలో ఆగని ఆందోళనలు.. 16 మెట్రో స్టేషన్లు మూసివేత.. ఆంక్షలు..
- Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ.. ఉద్యమంపై ప్రధాన న్యాయమూర్తి సంచలన వాఖ్యలు..
- Hyderabad: ACBకి చిక్కిన మరో అవినీతి అధికారి.. భారీ మొత్తంలో ఆస్తులు గుర్తింపు.!
Harassment : అత్తింట్లో దించుతానని అడవిలోకి తీసుకెళ్లి.. బాలికపై ముగ్గురు అఘాయిత్యం
ఈ నేపథ్యంలో కుమారుడి కంటే తానే చనిపోవాలని అనుకుంది. ఆ బాలుడి మరణం చూడలేక ముందే ఆమె ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతదేహం తీసుకునేందుకు కూడా భర్త శ్రీధర్, అతని కుటుంబసభ్యులు అందుబాటులో లేకుండా పోయారు. స్వాతి భర్త శ్రీధర్ , అతని కుటుంబాన్ని కఠినంగా శిక్షించాలని స్వాతి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. స్వాతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
RRB JE Recruitment 2026: రైల్వేలో 4,098 జూనియర్ ఇంజనీర్ పోస్టులు.. ఆగస్టు 14 నుంచి దరఖాస్తులు
-
Rahul Gandhi: రక్తం ఓడుతున్న ముఖం, ఊడిపోయిన షూ.. ప్రధాని ఇంటి ముట్టడితో మారిన రాహుల్ గాంధీ పొలిటికల్ మార్క్!
-
IND vs ZIM: ముగ్గురు ఆటగాళ్లకు గాయాలు.. బరువు పెరిగిన స్టార్ ప్లేయర్.. తీవ్ర ఆందోళనలో బీసీసీఐ!
-
Delhi protests: హస్తినలో ఆగని ఆందోళనలు.. 16 మెట్రో స్టేషన్లు మూసివేత.. ఆంక్షలు..
-
Nandamuri Kalyan Ram : పరశురామ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్.. కానీ?
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!