Jan Dhan Yojana : మూతపడిన 10 కోట్ల బ్యాంకు ఖాతాలు.. క్లెయియ్ చేయకుండా మిగిలిన రూ.12 వేల కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jan Dhan Yojana : ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందించడంలో భారత ప్రభుత్వ జన్ ధన్ యోజన చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ విజయవంతానికి జన్ ధన్ ఖాతాలు గణనీయంగా దోహదపడ్డాయి. ఇప్పుడు దేశంలో దాదాపు 51 కోట్ల జన్ ధన్ ఖాతాలు ప్రారంభించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాచారం. కానీ, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీటిలో దాదాపు 20 శాతం ఖాతాలు అంటే దాదాపు 10 కోట్లకు పైగా ఖాతాలు మూతపడ్డాయి. ఈ ఖాతాల్లో దాదాపు రూ.12,779 కోట్లు ఉన్నాయి. ఈ మొత్తంపై క్లెయిమ్ చేయడానికి ఎవరూ లేరు. డిసెంబర్ 6వ తేదీ వరకు వివిధ బ్యాంకుల్లో మొత్తం 10.34 కోట్ల ఖాతాలు మూతపడ్డాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ రాజ్యసభలో తెలిపారు. వీటిలో 4.93 కోట్ల ఖాతాలు మహిళలకు చెందినవి. బ్యాంకుల నుంచి అందిన సమాచారం ప్రకారం దేశంలో దాదాపు 51.11 కోట్ల పీఎం జన్ధన్ ఖాతాలు ఉన్నాయని, అందులో 20 శాతం డిసెంబరు 6 వరకు నిష్క్రియంగా ఉన్నాయని ఆయన చెప్పారు.
Read Also:Yuvagalam Vijayotsava Sabha: నేడు యువగళం విజయోత్సవ సభ.. పాల్గొననున్న టీడీపీ, జనసేన శ్రేణులు
Also Read
- Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
- AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
ఇతర బ్యాంకింగ్ ఖాతాల్లో కూడా క్లోజ్డ్ అకౌంట్లు 20 శాతం మాత్రమే ఉన్నాయని కరద్ తెలిపారు. దాదాపు రూ.12,779 కోట్లు ఇప్పటికీ క్రియారహిత జన్ ధన్ ఖాతాల్లోనే ఉన్నాయి. ఈ ఖాతాల్లోని మొత్తం డిపాజిట్లలో ఇది దాదాపు 6.12 శాతం. క్లోజ్డ్ అకౌంట్లపై కూడా వడ్డీ వస్తోందని చెప్పారు. ఇలాంటి ఖాతాల సంఖ్యను తగ్గించేందుకు బ్యాంకులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. వీటిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. జన్ ధన్ ఖాతాల్లో 55.5 శాతం మహిళలదేనని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విటర్లో రాసింది. నవంబర్ 22 వరకు ఈ ఖాతాల్లో రూ.2.10 లక్షల కోట్లు జమ అయ్యాయి. కానీ, 4.30 కోట్ల ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా లేదు. జన్ ధన్ ఖాతాల్లో కనీస మొత్తం ఉంచాల్సిన అవసరం లేదు.
Read Also:Tamil Nadu CM: రెండు వేల కోట్ల సాయంగా ఇవ్వాలని ప్రధాని మోడీకి సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
మార్చి 2023 నాటికి మూసివేయబడిన ఖాతాల్లో దాదాపు రూ.42,270 కోట్లు పడి ఉన్నాయని కరాద్ గతంలో పార్లమెంటుకు తెలిపారు. ఏడాది క్రితం ఈ సంఖ్య రూ.32,934 కోట్లు. ఈ ఖాతాల యజమానులను గుర్తించేందుకు ఆర్బీఐ పలు చర్యలు చేపట్టిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి తెలిపారు. 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు మూసివేయబడిన ఖాతాల మొత్తం డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్లో జమ చేయబడుతుంది. ఆర్బీఐ ప్రకారం, తమిళనాడు, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, బెంగాల్, కర్ణాటక, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బ్యాంకుల్లో ఇటువంటి డబ్బు ఎక్కువగా డిపాజిట్ చేయబడింది.
తాజావార్తలు
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!