Jan Dhan Yojana : మూతపడిన 10 కోట్ల బ్యాంకు ఖాతాలు.. క్లెయియ్ చేయకుండా మిగిలిన రూ.12 వేల కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jan Dhan Yojana : ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందించడంలో భారత ప్రభుత్వ జన్ ధన్ యోజన చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ విజయవంతానికి జన్ ధన్ ఖాతాలు గణనీయంగా దోహదపడ్డాయి. ఇప్పుడు దేశంలో దాదాపు 51 కోట్ల జన్ ధన్ ఖాతాలు ప్రారంభించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాచారం. కానీ, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీటిలో దాదాపు 20 శాతం ఖాతాలు అంటే దాదాపు 10 కోట్లకు పైగా ఖాతాలు మూతపడ్డాయి. ఈ ఖాతాల్లో దాదాపు రూ.12,779 కోట్లు ఉన్నాయి. ఈ మొత్తంపై క్లెయిమ్ చేయడానికి ఎవరూ లేరు. డిసెంబర్ 6వ తేదీ వరకు వివిధ బ్యాంకుల్లో మొత్తం 10.34 కోట్ల ఖాతాలు మూతపడ్డాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ రాజ్యసభలో తెలిపారు. వీటిలో 4.93 కోట్ల ఖాతాలు మహిళలకు చెందినవి. బ్యాంకుల నుంచి అందిన సమాచారం ప్రకారం దేశంలో దాదాపు 51.11 కోట్ల పీఎం జన్ధన్ ఖాతాలు ఉన్నాయని, అందులో 20 శాతం డిసెంబరు 6 వరకు నిష్క్రియంగా ఉన్నాయని ఆయన చెప్పారు.
Read Also:Yuvagalam Vijayotsava Sabha: నేడు యువగళం విజయోత్సవ సభ.. పాల్గొననున్న టీడీపీ, జనసేన శ్రేణులు
Also Read
- Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
- Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
- Geetu Mohandas: "నేను రాసిందొకటి.. తీసిందొకటి".. టాక్సిక్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. కానీ..
- OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
ఇతర బ్యాంకింగ్ ఖాతాల్లో కూడా క్లోజ్డ్ అకౌంట్లు 20 శాతం మాత్రమే ఉన్నాయని కరద్ తెలిపారు. దాదాపు రూ.12,779 కోట్లు ఇప్పటికీ క్రియారహిత జన్ ధన్ ఖాతాల్లోనే ఉన్నాయి. ఈ ఖాతాల్లోని మొత్తం డిపాజిట్లలో ఇది దాదాపు 6.12 శాతం. క్లోజ్డ్ అకౌంట్లపై కూడా వడ్డీ వస్తోందని చెప్పారు. ఇలాంటి ఖాతాల సంఖ్యను తగ్గించేందుకు బ్యాంకులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. వీటిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. జన్ ధన్ ఖాతాల్లో 55.5 శాతం మహిళలదేనని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విటర్లో రాసింది. నవంబర్ 22 వరకు ఈ ఖాతాల్లో రూ.2.10 లక్షల కోట్లు జమ అయ్యాయి. కానీ, 4.30 కోట్ల ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా లేదు. జన్ ధన్ ఖాతాల్లో కనీస మొత్తం ఉంచాల్సిన అవసరం లేదు.
Read Also:Tamil Nadu CM: రెండు వేల కోట్ల సాయంగా ఇవ్వాలని ప్రధాని మోడీకి సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
మార్చి 2023 నాటికి మూసివేయబడిన ఖాతాల్లో దాదాపు రూ.42,270 కోట్లు పడి ఉన్నాయని కరాద్ గతంలో పార్లమెంటుకు తెలిపారు. ఏడాది క్రితం ఈ సంఖ్య రూ.32,934 కోట్లు. ఈ ఖాతాల యజమానులను గుర్తించేందుకు ఆర్బీఐ పలు చర్యలు చేపట్టిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి తెలిపారు. 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు మూసివేయబడిన ఖాతాల మొత్తం డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్లో జమ చేయబడుతుంది. ఆర్బీఐ ప్రకారం, తమిళనాడు, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, బెంగాల్, కర్ణాటక, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బ్యాంకుల్లో ఇటువంటి డబ్బు ఎక్కువగా డిపాజిట్ చేయబడింది.
తాజావార్తలు
-
Ranabaali Release Date: రష్మికతో కలిసి విజయ్ విశ్వరూపం.. అక్టోబర్ 16న వరల్డ్వైడ్గా ‘రణబాలి’ గ్రాండ్ రిలీజ్!
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Mandadi Teaser: ‘మండాడి’ టీజర్ చూశారా? సుహాస్, సూరి ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది!
-
Dean Elgar Retirement: క్రికెట్కు గుడ్బై చెప్పిన దక్షిణాఫ్రికా స్టార్.. విరాట్ కోహ్లీతో వివాదం గుర్తుందా?
-
Toxic vs Irumudi : టాక్సిక్ టాక్.. ఇరుముడికి తిరుగులేదు
ట్రెండింగ్
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!