Jan Dhan Yojana : మూతపడిన 10 కోట్ల బ్యాంకు ఖాతాలు.. క్లెయియ్ చేయకుండా మిగిలిన రూ.12 వేల కోట్లు
Jan Dhan Yojana : ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందించడంలో భారత ప్రభుత్వ జన్ ధన్ యోజన చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ విజయవంతానికి జన్ ధన్ ఖాతాలు గణనీయంగా దోహదపడ్డాయి. ఇప్పుడు దేశంలో దాదాపు 51 కోట్ల జన్ ధన్ ఖాతాలు ప్రారంభించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాచారం. కానీ, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీటిలో దాదాపు 20 శాతం ఖాతాలు అంటే దాదాపు 10 కోట్లకు పైగా ఖాతాలు మూతపడ్డాయి. ఈ ఖాతాల్లో దాదాపు రూ.12,779 కోట్లు ఉన్నాయి. ఈ మొత్తంపై క్లెయిమ్ చేయడానికి ఎవరూ లేరు. డిసెంబర్ 6వ తేదీ వరకు వివిధ బ్యాంకుల్లో మొత్తం 10.34 కోట్ల ఖాతాలు మూతపడ్డాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ రాజ్యసభలో తెలిపారు. వీటిలో 4.93 కోట్ల ఖాతాలు మహిళలకు చెందినవి. బ్యాంకుల నుంచి అందిన సమాచారం ప్రకారం దేశంలో దాదాపు 51.11 కోట్ల పీఎం జన్ధన్ ఖాతాలు ఉన్నాయని, అందులో 20 శాతం డిసెంబరు 6 వరకు నిష్క్రియంగా ఉన్నాయని ఆయన చెప్పారు.
Read Also:Yuvagalam Vijayotsava Sabha: నేడు యువగళం విజయోత్సవ సభ.. పాల్గొననున్న టీడీపీ, జనసేన శ్రేణులు
Also Read
ఇతర బ్యాంకింగ్ ఖాతాల్లో కూడా క్లోజ్డ్ అకౌంట్లు 20 శాతం మాత్రమే ఉన్నాయని కరద్ తెలిపారు. దాదాపు రూ.12,779 కోట్లు ఇప్పటికీ క్రియారహిత జన్ ధన్ ఖాతాల్లోనే ఉన్నాయి. ఈ ఖాతాల్లోని మొత్తం డిపాజిట్లలో ఇది దాదాపు 6.12 శాతం. క్లోజ్డ్ అకౌంట్లపై కూడా వడ్డీ వస్తోందని చెప్పారు. ఇలాంటి ఖాతాల సంఖ్యను తగ్గించేందుకు బ్యాంకులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. వీటిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. జన్ ధన్ ఖాతాల్లో 55.5 శాతం మహిళలదేనని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విటర్లో రాసింది. నవంబర్ 22 వరకు ఈ ఖాతాల్లో రూ.2.10 లక్షల కోట్లు జమ అయ్యాయి. కానీ, 4.30 కోట్ల ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా లేదు. జన్ ధన్ ఖాతాల్లో కనీస మొత్తం ఉంచాల్సిన అవసరం లేదు.
Read Also:Tamil Nadu CM: రెండు వేల కోట్ల సాయంగా ఇవ్వాలని ప్రధాని మోడీకి సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
మార్చి 2023 నాటికి మూసివేయబడిన ఖాతాల్లో దాదాపు రూ.42,270 కోట్లు పడి ఉన్నాయని కరాద్ గతంలో పార్లమెంటుకు తెలిపారు. ఏడాది క్రితం ఈ సంఖ్య రూ.32,934 కోట్లు. ఈ ఖాతాల యజమానులను గుర్తించేందుకు ఆర్బీఐ పలు చర్యలు చేపట్టిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి తెలిపారు. 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు మూసివేయబడిన ఖాతాల మొత్తం డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్లో జమ చేయబడుతుంది. ఆర్బీఐ ప్రకారం, తమిళనాడు, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, బెంగాల్, కర్ణాటక, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బ్యాంకుల్లో ఇటువంటి డబ్బు ఎక్కువగా డిపాజిట్ చేయబడింది.
తాజావార్తలు
-
Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్పై విజయం సాధిస్తాం.!
-
CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
-
Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
-
Toxic: యశ్ ‘టాక్సిక్’ పై రుక్మిణి వసంత్ క్రేజీ కామెంట్స్..
-
Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!