Monsoon: 62 ఏళ్ల తర్వాత తొలిసారి.. ఢిల్లీ, ముంబై చేరిన రుతుపవనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monsoon: నైరుతి రుతుపవనాలు ఢిల్లీ, ముంబై నగరాలను చేరాయి. రుతుపవనాల రాకతో రెండు నగరాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల కారణంగా దేశ రాజధాని, దేశ ఆర్థిక రాజధానిలో ఒకేసారి వర్షాలు కురవడం 62 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇలాంటి అరుదైన దృగ్విషయం చివరిసారిగా జూన్ 21, 1961న ఢిల్లీ, ముంబైల మీదుగా ఒకేసారి రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ కార్యాలయం తెలిపింది. రెండు నగరాలు ఒకదానికొకటి 1,430 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. రుతుపవనాలు సాధారణంగా జూన్ 27న ఢిల్లీని తాకగా, ఈ ఏడాది షెడ్యూల్ కంటే రెండు రోజులు ముందుగానే కనిపించాయి. మరోవైపు, ముంబైకి రుతుపవనాలు వచ్చే తేదీ జూన్ 11. అయితే ఈ సారి రెండు వారాలు ఆలస్యంగా నగరంలోకి ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది.
Also Read: Mumbai Rains: ముంబైలో వర్ష బీభత్సం. కుప్పకూలిన ఓ భవనం.. నలుగురు సేఫ్.. మరో ఇద్దరి కోసం గాలింపు..!
Also Read
ఢిల్లీలో వాతావరణ సూచన
ఆదివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో దేశ రాజధాని వాసులు నిద్ర లేచారు. ఉదయం 5.30 గంటల వరకు, నగరంలోని ప్రాథమిక వాతావరణ కేంద్రమైన సఫ్దర్జంగ్లో 47.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, నైరుతి ఢిల్లీలోని పాలంలో 22 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఐఎండీ డేటా ప్రకారం, రుతుపవనాలు గత ఏడాది జూన్ 30న, 2021లో జూలై 13న, 2020లో జూన్ 25న, 2019లో జూలై 5న, 2018లో జూన్ 28న ఢిల్లీని ఆవరించాయి. ఆదివారం (జూన్ 25), సోమవారం (జూన్ 26) ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. బుధవారం (జూన్ 27), గురువారం (జూన్ 28) ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది.
ముంబైలో వాతావరణ సూచన
రెండు వారాల ఆలస్యం తర్వాత రుతుపవనాలు ముంబైకి చేరుకున్నాయి. సాధారణంగా జూన్ 11న రుతుపవనాలు చేరాల్సి ఉంది. నగరంలో శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పలు చోట్ల నీటి ఎద్దడి ఉన్నట్లు సమాచారం. ముంబైకి ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!