Monsoon: 62 ఏళ్ల తర్వాత తొలిసారి.. ఢిల్లీ, ముంబై చేరిన రుతుపవనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monsoon: నైరుతి రుతుపవనాలు ఢిల్లీ, ముంబై నగరాలను చేరాయి. రుతుపవనాల రాకతో రెండు నగరాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల కారణంగా దేశ రాజధాని, దేశ ఆర్థిక రాజధానిలో ఒకేసారి వర్షాలు కురవడం 62 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇలాంటి అరుదైన దృగ్విషయం చివరిసారిగా జూన్ 21, 1961న ఢిల్లీ, ముంబైల మీదుగా ఒకేసారి రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ కార్యాలయం తెలిపింది. రెండు నగరాలు ఒకదానికొకటి 1,430 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. రుతుపవనాలు సాధారణంగా జూన్ 27న ఢిల్లీని తాకగా, ఈ ఏడాది షెడ్యూల్ కంటే రెండు రోజులు ముందుగానే కనిపించాయి. మరోవైపు, ముంబైకి రుతుపవనాలు వచ్చే తేదీ జూన్ 11. అయితే ఈ సారి రెండు వారాలు ఆలస్యంగా నగరంలోకి ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది.
Also Read: Mumbai Rains: ముంబైలో వర్ష బీభత్సం. కుప్పకూలిన ఓ భవనం.. నలుగురు సేఫ్.. మరో ఇద్దరి కోసం గాలింపు..!
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఢిల్లీలో వాతావరణ సూచన
ఆదివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో దేశ రాజధాని వాసులు నిద్ర లేచారు. ఉదయం 5.30 గంటల వరకు, నగరంలోని ప్రాథమిక వాతావరణ కేంద్రమైన సఫ్దర్జంగ్లో 47.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, నైరుతి ఢిల్లీలోని పాలంలో 22 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఐఎండీ డేటా ప్రకారం, రుతుపవనాలు గత ఏడాది జూన్ 30న, 2021లో జూలై 13న, 2020లో జూన్ 25న, 2019లో జూలై 5న, 2018లో జూన్ 28న ఢిల్లీని ఆవరించాయి. ఆదివారం (జూన్ 25), సోమవారం (జూన్ 26) ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. బుధవారం (జూన్ 27), గురువారం (జూన్ 28) ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది.
ముంబైలో వాతావరణ సూచన
రెండు వారాల ఆలస్యం తర్వాత రుతుపవనాలు ముంబైకి చేరుకున్నాయి. సాధారణంగా జూన్ 11న రుతుపవనాలు చేరాల్సి ఉంది. నగరంలో శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పలు చోట్ల నీటి ఎద్దడి ఉన్నట్లు సమాచారం. ముంబైకి ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!