Monsoon: 62 ఏళ్ల తర్వాత తొలిసారి.. ఢిల్లీ, ముంబై చేరిన రుతుపవనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monsoon: నైరుతి రుతుపవనాలు ఢిల్లీ, ముంబై నగరాలను చేరాయి. రుతుపవనాల రాకతో రెండు నగరాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల కారణంగా దేశ రాజధాని, దేశ ఆర్థిక రాజధానిలో ఒకేసారి వర్షాలు కురవడం 62 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇలాంటి అరుదైన దృగ్విషయం చివరిసారిగా జూన్ 21, 1961న ఢిల్లీ, ముంబైల మీదుగా ఒకేసారి రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ కార్యాలయం తెలిపింది. రెండు నగరాలు ఒకదానికొకటి 1,430 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. రుతుపవనాలు సాధారణంగా జూన్ 27న ఢిల్లీని తాకగా, ఈ ఏడాది షెడ్యూల్ కంటే రెండు రోజులు ముందుగానే కనిపించాయి. మరోవైపు, ముంబైకి రుతుపవనాలు వచ్చే తేదీ జూన్ 11. అయితే ఈ సారి రెండు వారాలు ఆలస్యంగా నగరంలోకి ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది.
Also Read: Mumbai Rains: ముంబైలో వర్ష బీభత్సం. కుప్పకూలిన ఓ భవనం.. నలుగురు సేఫ్.. మరో ఇద్దరి కోసం గాలింపు..!
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ఢిల్లీలో వాతావరణ సూచన
ఆదివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో దేశ రాజధాని వాసులు నిద్ర లేచారు. ఉదయం 5.30 గంటల వరకు, నగరంలోని ప్రాథమిక వాతావరణ కేంద్రమైన సఫ్దర్జంగ్లో 47.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, నైరుతి ఢిల్లీలోని పాలంలో 22 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఐఎండీ డేటా ప్రకారం, రుతుపవనాలు గత ఏడాది జూన్ 30న, 2021లో జూలై 13న, 2020లో జూన్ 25న, 2019లో జూలై 5న, 2018లో జూన్ 28న ఢిల్లీని ఆవరించాయి. ఆదివారం (జూన్ 25), సోమవారం (జూన్ 26) ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. బుధవారం (జూన్ 27), గురువారం (జూన్ 28) ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది.
ముంబైలో వాతావరణ సూచన
రెండు వారాల ఆలస్యం తర్వాత రుతుపవనాలు ముంబైకి చేరుకున్నాయి. సాధారణంగా జూన్ 11న రుతుపవనాలు చేరాల్సి ఉంది. నగరంలో శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పలు చోట్ల నీటి ఎద్దడి ఉన్నట్లు సమాచారం. ముంబైకి ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!