Mohammad Amir: టీ20 వరల్డ్ కప్లో టీమిండియా సెమీఫైనల్కు చేరింది. భారతీయులందరూ సంతోషంగా ఉన్నారు. కానీ.. పాకిస్థాన్ మాజీ ప్లేయర్లు, ఆ దేశస్థులకు మాత్రం కడుపు మంట పెరిగింది. ఇండియాతో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయింది. తర్వాత సూపర్-8 నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో భారత ప్లేయర్ల తీరుపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆమిర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆమిర్ ప్రత్యేకంగా ఫీల్డింగ్ను విమర్శించాడు. మూడు–నాలుగు క్యాచ్లు మిస్ అయ్యాయని, బుమ్రా తప్ప మిగతా బౌలర్లందరూ బలహీనంగా ఉన్నారని అభిప్రాయపడ్డాడు. మొత్తం ఆట ఒక బౌలర్ల మీదే ఆధారపడి ఉంటుందన్నాడు.
READ MORE: Iran: ఇరాన్లో డేంజర్ బెల్స్.. అణు కేంద్రం నుంచి రేడియేషన్ లీక్.. శాస్త్రవేత్తల్లో భయాందోళనలు
ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇటీవల ఆమిర్ ఇండియా సెమీఫైనల్కు చేరదని జోష్యం చెప్పాడు. భారతీయ జట్టు సెమీస్ క్వాలిఫై కాదని చెప్పిన మాటలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ఇప్పుడు భారత్ సెమీస్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికీ వక్ర బుద్ధి, విషం కక్కడం మానడం లేదు. తాజాగా ఇండియా-వెస్టిండీస్ మ్యాచ్ తర్వాత.. సంజు శామ్సన్ తన జీవితంలో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడుతూనే.. భారత్కు ఇప్పటికీ బెస్ట్ మంచి క్రికెట్ ఆడటం రాలేదన్నాడు. అంటే భారత్ బెస్ట్ ఫర్ఫామెన్స్ ఇవ్వలేకపోతోందని చెప్పాడు. తమ జట్టు పరిస్థితిని పట్టించుకోకుండా.. భారత్ ప్రదర్శన, బౌలింగ్, టీమ్ లోపాలను ఎత్తి చూపడంపై తీవ్ర చర్చకు దారి తీసింది. ఆ దేశస్థులతో పాటు టీమిండియా ఫ్యాన్స్ సైతం మండిపడుతున్నారు. ముందు మీది మీరు కనుక్కోండి అంటూ ఫైర్ అవుతున్నారు.
READ MORE: Iran-Israel War: గాంధీ ఆసుపత్రిపై బాంబుల వర్షం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫైర్..
