ASEAN Summit: కౌలాలంపూర్ లో ఆసియన్ సదస్సు.. వర్చువల్ గా పాల్గొననున్న మోడీ
- అక్టోబర్ 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆసియాన్ సదస్సు
- ప్రతి ఏటా సదస్సులో పాల్గొననున్న ప్రధాని మోడీ
- ఈ సారి వర్చువల్ గా పాల్గొననున్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ASEAN Summit: మలేసియా రాజధాని కౌలాలంపూర్లో అక్టోబర్ 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆసియాన్ సదస్సు జరగనున్నది. ప్రతి ఏటా ఈ సదస్సుకు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఈసారి హాజరవుతారు. కానీ ఈసారి ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కావడంలేదని.. కేవలం వర్చువల్ గా హాజరవుతానని ఎక్స్ లో తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కూడా భేటీ రద్దు అయినట్లు సమాచారం. ట్రంప్ కూడా ఈ సదస్సుకు హాజరవుతున్నట్లు ప్రకటించిన కొన్ని గంటలకే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జరిగే 22వ ఆసియాన్ – ఇండియా సమ్మిట్లో వర్చువల్గా పాల్గొంటారు. ప్రధానమంత్రి మోదీ , ఆసియాన్ నాయకులు సంయుక్తంగా ఆసియాన్-భారత్ సంబంధాలలో పురోగతిని సమీక్షిస్తారని, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి చొరవలను చర్చిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆసియాన్తో సంబంధాన్ని బలోపేతం చేసుకోవడం భారతదేశం యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఇండో-పసిఫిక్ దార్శనికతకు కీలక స్తంభమని పేర్కొంది. ఈ నిర్ణయంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మోదీకి సాధ్యమయ్యే ద్వైపాక్షిక భేటీపై గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మొదట్లో ప్రధాని మోదీ కౌలాలంపూర్తో పాటు కంబోడియాలో కూడా పర్యటించాలనుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఆ సదస్సుకు వెళ్లకపోవడత.. కంబోడియా పర్యటన కూడా వాయిదా పడింది.
Also Read
- Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
- PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
- APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
ఈ సమ్మిట్ లో ప్రధాని మోదీకి బదులు విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ భారత దేశానికి ప్రాతినిద్యం వహించనున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రధాని మోదీయే స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ఫోన్లో ఆత్మీయ సంభాషణ జరిపిన అనంతరం.. మోదీ మలేసియాకు ఆసియాన్ ఛైర్మన్షిప్ లభించినందుకు అభినందించారు. “ఆసియాన్-ఇండియా సదస్సుకు వర్చువల్గా హాజరు అయ్యేందుకు ఎదురు చూస్తున్నాను. ఆసియాన్-ఇండియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఆశిస్తున్నాను” అని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు.
Had a warm conversation with my dear friend, Prime Minister Anwar Ibrahim of Malaysia. Congratulated him on Malaysia’s ASEAN Chairmanship and conveyed best wishes for the success of upcoming Summits. Look forward to joining the ASEAN-India Summit virtually, and to further…
— Narendra Modi (@narendramodi) October 23, 2025
- Tags
తాజావార్తలు
-
Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
-
Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!