Pakistan: దైవదూషణ ఆరోపణలు.. పాకిస్థాన్లో చర్చిలు ధ్వంసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్థాన్లోని ఫైసలాబాద్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్రిస్టియన్ మైనారిటీలపై ఓ వర్గానికి చెందిన ఆందోళనకారులు దాడులకు తెగబడ్డారు. చర్చీలను ధ్వంసం చేస్తూ.. మైనారిటీల అణిచివేత చర్యలకు పాల్పడ్డారు. ఒక క్రైస్తవ కుటుంబం దైవదూషణకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అనేక చర్చిలు ధ్వంసం చేయబడ్డాయి. పాకిస్తాన్లోని ఫైసలాబాద్లో చుట్టుపక్కల ఉన్న క్రైస్తవ నివాసాలను దోచుకున్నారు. ఈ ఘటన ఫైసలాబాద్లోని జరన్వాలా జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. క్లీనర్గా పనిచేసే ఒక క్రైస్తవుడు ఖురాన్పై కించపరిచే వ్యాఖ్యలు చేయడంతో స్థానిక ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని ఇంటిని కూల్చివేయడమే కాకుండా, గుంపు ఆ ప్రాంతంలోని చర్చిలు, ఇతర క్రైస్తవ నివాసాలను కూడా ధ్వంసం చేసింది. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోల్లో ఓ ఉన్మాద గుంపు చర్చిలపైకి ఎక్కి పవిత్ర శిలువను తన్నడం కనిపించింది.
Also Read: Nora Fatehi In Matka: ‘మట్కా’ కోసం హైదరాబాద్లో నోరా ఫతేహి
Also Read
- Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
- T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
- Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
- Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
దూషించేవారిపై చర్య తీసుకోవడంలో పోలీసులు విఫలమైతే, ముస్లిం మతపెద్దలు గుంపును సమీకరించమని ప్రేరేపించడాన్ని కూడా కొన్ని వీడియోలు చూపించాయి. డాన్లోని ఒక కథనం ప్రకారం.. తాము ఆందోళనకారులతో చర్చలు జరుపుతున్నామని, ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు పంజాబ్ పోలీసు చీఫ్ ఉస్మాన్ అన్వర్ చెప్పారు. అయితే, తమ ఇళ్లను దోచుకోవడంతో పోలీసులు మౌనంగా ఉండిపోయారని స్థానిక క్రైస్తవులు ఫిర్యాదు చేశారు.
Also Read: New Rules: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్రం కొత్త రూల్స్..!
పాకిస్తాన్లోని సెక్షన్లు 295B (పవిత్ర ఖురాన్ను అపవిత్రం చేయడం మొదలైనవి) , 295C (పవిత్ర ప్రవక్తను కించపరిచే వ్యాఖ్యలు మొదలైనవి) కింద నిందితుడైన క్రైస్తవ వ్యక్తిపై పోలీసులు ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు చేశారు. ఫైసలాబాద్లో క్రైస్తవ మైనారిటీ కుటుంబం పవిత్ర ఖురాన్ను ఉల్లంఘించిందని ఆరోపించిన తర్వాత ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వందలాది మంది ఆందోళనకారులు ఒక్కచోట చేరి చర్చిలపై దాడులకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆందోళనకారులను చెదరగొడుతున్నారు.
Is IG Punjab asleep? 4th church being burnt in Faislababad today. Christians under attack #Pakistan pic.twitter.com/bxfHRzHDQl
— Sara Taseer (@sarataseer) August 16, 2023
తాజావార్తలు
-
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
-
T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
-
Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!