Pakistan: దైవదూషణ ఆరోపణలు.. పాకిస్థాన్లో చర్చిలు ధ్వంసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్థాన్లోని ఫైసలాబాద్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్రిస్టియన్ మైనారిటీలపై ఓ వర్గానికి చెందిన ఆందోళనకారులు దాడులకు తెగబడ్డారు. చర్చీలను ధ్వంసం చేస్తూ.. మైనారిటీల అణిచివేత చర్యలకు పాల్పడ్డారు. ఒక క్రైస్తవ కుటుంబం దైవదూషణకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అనేక చర్చిలు ధ్వంసం చేయబడ్డాయి. పాకిస్తాన్లోని ఫైసలాబాద్లో చుట్టుపక్కల ఉన్న క్రైస్తవ నివాసాలను దోచుకున్నారు. ఈ ఘటన ఫైసలాబాద్లోని జరన్వాలా జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. క్లీనర్గా పనిచేసే ఒక క్రైస్తవుడు ఖురాన్పై కించపరిచే వ్యాఖ్యలు చేయడంతో స్థానిక ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని ఇంటిని కూల్చివేయడమే కాకుండా, గుంపు ఆ ప్రాంతంలోని చర్చిలు, ఇతర క్రైస్తవ నివాసాలను కూడా ధ్వంసం చేసింది. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోల్లో ఓ ఉన్మాద గుంపు చర్చిలపైకి ఎక్కి పవిత్ర శిలువను తన్నడం కనిపించింది.
Also Read: Nora Fatehi In Matka: ‘మట్కా’ కోసం హైదరాబాద్లో నోరా ఫతేహి
Also Read
- Tarique Rahman: నవంబర్లో భారత్కు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్? ఢిల్లీతో చర్చలు షురూ!
- Pakistan: పాకిస్తాన్లో ఘోర పేలుడు.. 15 మంది మృతి..
- ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్ను క్లీన్స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
- TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
దూషించేవారిపై చర్య తీసుకోవడంలో పోలీసులు విఫలమైతే, ముస్లిం మతపెద్దలు గుంపును సమీకరించమని ప్రేరేపించడాన్ని కూడా కొన్ని వీడియోలు చూపించాయి. డాన్లోని ఒక కథనం ప్రకారం.. తాము ఆందోళనకారులతో చర్చలు జరుపుతున్నామని, ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు పంజాబ్ పోలీసు చీఫ్ ఉస్మాన్ అన్వర్ చెప్పారు. అయితే, తమ ఇళ్లను దోచుకోవడంతో పోలీసులు మౌనంగా ఉండిపోయారని స్థానిక క్రైస్తవులు ఫిర్యాదు చేశారు.
Also Read: New Rules: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్రం కొత్త రూల్స్..!
పాకిస్తాన్లోని సెక్షన్లు 295B (పవిత్ర ఖురాన్ను అపవిత్రం చేయడం మొదలైనవి) , 295C (పవిత్ర ప్రవక్తను కించపరిచే వ్యాఖ్యలు మొదలైనవి) కింద నిందితుడైన క్రైస్తవ వ్యక్తిపై పోలీసులు ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు చేశారు. ఫైసలాబాద్లో క్రైస్తవ మైనారిటీ కుటుంబం పవిత్ర ఖురాన్ను ఉల్లంఘించిందని ఆరోపించిన తర్వాత ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వందలాది మంది ఆందోళనకారులు ఒక్కచోట చేరి చర్చిలపై దాడులకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆందోళనకారులను చెదరగొడుతున్నారు.
Is IG Punjab asleep? 4th church being burnt in Faislababad today. Christians under attack #Pakistan pic.twitter.com/bxfHRzHDQl
— Sara Taseer (@sarataseer) August 16, 2023
తాజావార్తలు
-
Tarique Rahman: నవంబర్లో భారత్కు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్? ఢిల్లీతో చర్చలు షురూ!
-
Pakistan: పాకిస్తాన్లో ఘోర పేలుడు.. 15 మంది మృతి..
-
ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్ను క్లీన్స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
-
TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
-
Suhas: తెలుగు ఆడియన్స్ అనే పదమే రావట్లేదా సుహాస్?
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..