Pakistan: దైవదూషణ ఆరోపణలు.. పాకిస్థాన్లో చర్చిలు ధ్వంసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్థాన్లోని ఫైసలాబాద్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్రిస్టియన్ మైనారిటీలపై ఓ వర్గానికి చెందిన ఆందోళనకారులు దాడులకు తెగబడ్డారు. చర్చీలను ధ్వంసం చేస్తూ.. మైనారిటీల అణిచివేత చర్యలకు పాల్పడ్డారు. ఒక క్రైస్తవ కుటుంబం దైవదూషణకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అనేక చర్చిలు ధ్వంసం చేయబడ్డాయి. పాకిస్తాన్లోని ఫైసలాబాద్లో చుట్టుపక్కల ఉన్న క్రైస్తవ నివాసాలను దోచుకున్నారు. ఈ ఘటన ఫైసలాబాద్లోని జరన్వాలా జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. క్లీనర్గా పనిచేసే ఒక క్రైస్తవుడు ఖురాన్పై కించపరిచే వ్యాఖ్యలు చేయడంతో స్థానిక ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని ఇంటిని కూల్చివేయడమే కాకుండా, గుంపు ఆ ప్రాంతంలోని చర్చిలు, ఇతర క్రైస్తవ నివాసాలను కూడా ధ్వంసం చేసింది. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోల్లో ఓ ఉన్మాద గుంపు చర్చిలపైకి ఎక్కి పవిత్ర శిలువను తన్నడం కనిపించింది.
Also Read: Nora Fatehi In Matka: ‘మట్కా’ కోసం హైదరాబాద్లో నోరా ఫతేహి
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
దూషించేవారిపై చర్య తీసుకోవడంలో పోలీసులు విఫలమైతే, ముస్లిం మతపెద్దలు గుంపును సమీకరించమని ప్రేరేపించడాన్ని కూడా కొన్ని వీడియోలు చూపించాయి. డాన్లోని ఒక కథనం ప్రకారం.. తాము ఆందోళనకారులతో చర్చలు జరుపుతున్నామని, ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు పంజాబ్ పోలీసు చీఫ్ ఉస్మాన్ అన్వర్ చెప్పారు. అయితే, తమ ఇళ్లను దోచుకోవడంతో పోలీసులు మౌనంగా ఉండిపోయారని స్థానిక క్రైస్తవులు ఫిర్యాదు చేశారు.
Also Read: New Rules: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్రం కొత్త రూల్స్..!
పాకిస్తాన్లోని సెక్షన్లు 295B (పవిత్ర ఖురాన్ను అపవిత్రం చేయడం మొదలైనవి) , 295C (పవిత్ర ప్రవక్తను కించపరిచే వ్యాఖ్యలు మొదలైనవి) కింద నిందితుడైన క్రైస్తవ వ్యక్తిపై పోలీసులు ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు చేశారు. ఫైసలాబాద్లో క్రైస్తవ మైనారిటీ కుటుంబం పవిత్ర ఖురాన్ను ఉల్లంఘించిందని ఆరోపించిన తర్వాత ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వందలాది మంది ఆందోళనకారులు ఒక్కచోట చేరి చర్చిలపై దాడులకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆందోళనకారులను చెదరగొడుతున్నారు.
Is IG Punjab asleep? 4th church being burnt in Faislababad today. Christians under attack #Pakistan pic.twitter.com/bxfHRzHDQl
— Sara Taseer (@sarataseer) August 16, 2023
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!