నటుడు అర్జున్ సర్జా నిర్మించిన హనుమాన్ ఆలయాన్ని తెలంగాణ ఎమ్మెల్సీ కవిత శుక్రవారం సందర్శించి పూజలు చేశారు. ఓ కాన్క్లేవ్లో పాల్గొనేందుకు కవిత చెన్నై వచ్చారు. “ఈ రోజు నేను చెన్నై పర్యటన సందర్భంగా ఐకానిక్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించాను, అక్కడ సర్వశక్తిమంతుడికి పూజ చేసే అదృష్టం నాకు లభించింది” అని ఎమ్మెల్సీ తన పర్యటన తర్వాత ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ… చెన్నైలో పర్యటించడం తనకు ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని తెలిపారు.
Also Read : ప్రయాణించేటప్పుడు వాంతులు వస్తున్నాయా?.. ఇలా చేయండి..
తమిళనాడు అస్తిత్వం చాలా గొప్పదని, అక్కడి ప్రజలు స్ఫూర్తిదాయకంగా ఉంటారని అన్నారు. తమిళనాడు ప్రజలు తమ సంస్కృతి భాష చరిత్ర వారసత్వం పట్ల గర్వంగా ఉంటారని, ప్రతి ఒక్కరికి ఆ గౌరవభావం ఉండాలని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కవిత. ఉమ్మడి ఆలోచన తత్వం భారతీయులను ఐక్యంగా ఉంచుతుండడం గర్వంగా ఉందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. దేశంలోని అతిపెద్ద హనుమాన్ దేవాలయాన్ని నిర్మించినందుకు అర్జున్ కు అభినందనలు తెలిపారు ఎమ్మెల్సీ కవిత.
Also Read : Kethireddy Pedda Reddy: ఇసుక రీచ్ వద్ద జేసీ ఆందోళన.. ఎమ్మెల్యే పెద్దారెడ్డి కౌంటర్