MLC Kavitha : కామారెడ్డి డిక్లరేషన్లో పేర్కొన్న హామీలను వెంటనే అమలు చేయాలి
- తెలంగాణ రాష్ట్ర బీసీల హక్కులకు అన్యాయం జరుగుతోంది
- బీసీలకు ఇచ్చిన హామీలను విస్మరించింది కాంగ్రెస్ ప్రభుత్వం
- సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా బీసీ మహాసభ : ఎమ్మెల్సీ కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha :తెలంగాణ రాష్ట్ర బీసీల హక్కులకు అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీసీల హక్కుల కోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జనవరి 3న నిర్వహించనున్న బీసీ మహాసభ పోస్టర్ను కవిత బుధవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపు విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోంది. కామారెడ్డి డిక్లరేషన్లో పేర్కొన్న హామీలను వెంటనే అమలు చేయాలి,” అన్నారు. సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా బీసీ మహాసభను భారీ స్థాయిలో నిర్వహించేందుకు తెలంగాణ జాగృతి సిద్ధమవుతోందని కవిత తెలిపారు. ఈ మహాసభలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు, కామారెడ్డి డిక్లరేషన్ను అమలులోకి తీసుకురావాలన్న డిమాండ్లు ప్రధానంగా ఉండనున్నాయి.
Also Read
- Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
- Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
- UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
- PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
ఈ మహాసభకు తెలంగాణ సర్పంచ్ల సంఘం జేఏసీ, విద్యార్థి జేఏసీతో పాటు పలు ప్రజా సంఘాలు, కుల సంఘాలు మద్దతు ప్రకటించినట్లు కవిత వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్, బీసీ నాయకులు బొల్లా శివశంకర్, పెంట రాజేష్, సుంకోజు కృష్ణమాచారి, ఆలకుంట్ల హరి తదితరులు పాల్గొన్నారు. బీసీ మహాసభ విజయవంతం చేయడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, బీసీ నాయకులు పాల్గొనాలని కవిత పిలుపునిచ్చారు. “తెలంగాణ బీసీల హక్కుల కోసం ప్రతి ఒక్కరూ తమ మద్దతు తెలియజేయాలి,” అని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్లైన్
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!