MLC Kavitha: ‘కేసీఆర్’ ఇంటర్నెట్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత!
- ఇంటర్నెట్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత
- సతీశ్కు చిన్నప్పటి నుంచి కేసీఆర్ అంటే ప్రాణం
- బీఆర్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న సతీశ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ సీఎం కేసీఆర్ వీరాభిమాని, దివ్యాంగుడైన చిర్రా సతీశ్ జిరాక్స్ సెంటర్ను ఎమ్మెల్సీ కవిత సోమవారం ప్రారంభించారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగుడైన సతీశ్కు ఆర్థికంగా చేయూతనందించిన కవిత.. నేడు ‘కేసీఆర్’ ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్ను ఆరంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ రవీందర్ రావు, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్, మాజీ ఎంపీ మలోత్ కవిత పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రామానుజపురం గ్రామానికి చెందిన ఉద్యమ కారుడు చిర్ర లింగన్న కుమారుడు సతీష్. సతీశ్కు చిన్నప్పటి నుంచి కేసీఆర్ అంటే ప్రాణం. 2001లో టీఆర్ఎస్ స్థాపించిన నాటి నుంచి కార్యకర్తగా ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ఆర్థిక ఇబ్బందులు, అంగవైకల్యాన్ని ఎదిరించిన సతీష్ డిగ్రీ పూర్తి చేశారు. బీఆర్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. 2025 ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. ఇంటర్నెట్ సెంటర్ ద్వారా తనకు స్వయం ఉపాధికి కల్పించాలని ఎమ్మెల్పీ కవితకు విజ్ఞప్తి చేశారు. సతీష్ విజ్ఞప్తికి కవిత వెంటనే స్పందించి.. సాయం చేస్తానని హామీ ఇచ్చారు. వారం రోజుల్లోనే సొంతం ఖర్చులతో ఇంటర్నెట్ సెంటర్ను ఏర్పాటు చేయించారు. ఈ ఇంటర్నెట్ సెంటర్కు కేసీఆర్ పేరును సతీశ్ పెట్టుకున్నాడు. జిల్లా పర్యటనలో భాగంగా నేడు ‘కేసీఆర్’ ఇంటర్నెట్ సెంటర్ను ప్రారంభించారు.
Also Read
- Jewar Toll Plaza: కేంద్రం గుడ్న్యూస్.. 14 ఏళ్ల డిమాండ్కు పరిష్కారం.. అక్కడ టోల్ ఫ్రీ ప్రయాణం..
- Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లు జలమయం
- AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
- Nepal Floods: 170 మీటర్ల లోతులో 9 రోజులు.. "మహామంత్రం" జపిస్తూ ప్రాణాలతో బయటపడ్డ నేపాల్ కార్మికుడు..
Also Read: Liquor Shops: తెలంగాణలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్!
ఇంటర్నెట్ సెంటర్ ఏర్పాటుపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ‘కార్యకర్తలే పార్టీకి ఆయువుపట్టు. కార్యకర్తలకు అండగా ఉండడం కేసీఆర్ గారు మనకు నేర్పిన బాధ్యత. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, కేసీఆర్ గారి వీరాభిమాని చిర్రా సతీష్ గారికి స్వయం ఉపాధి కల్పించడం నా బాధ్యతగానే భావించా. కార్యకర్తలు, వారి కుటుంబాలకు అన్ని రకాల మద్దతు ఇవ్వడంలో ముందుండే ఏకైక పార్టీ బీఆర్ఎస్. సతీష్ కేసీఆర్ ఇంటర్నెట్-జిరాక్స్ సెంటర్ను ప్రారంభించే అవకాశం నాకు కలగడం సంతోషంగా ఉంది’ అని కవిత పేర్కొన్నారు. తనకు ఇంత పెద్ద సాయం చేసిన కవితకు సతీష్ కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్, కవితలకు తన కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటుందని చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Jewar Toll Plaza: కేంద్రం గుడ్న్యూస్.. 14 ఏళ్ల డిమాండ్కు పరిష్కారం.. అక్కడ టోల్ ఫ్రీ ప్రయాణం..
-
Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లు జలమయం
-
AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
-
Nepal Floods: 170 మీటర్ల లోతులో 9 రోజులు.. “మహామంత్రం” జపిస్తూ ప్రాణాలతో బయటపడ్డ నేపాల్ కార్మికుడు..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఆత్మకథ పబ్లిష్ నుంచి వైదొలిగిన పెంగ్విన్.. కొత్త పబ్లిషర్ ఎవరంటే..!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!