MLC Kavitha : తెలంగాణ భవిష్యత్తు కేసీఆర్ హస్తంలోనే
- ఎం.ఎల్.సి. కవిత ఆసక్తికర వ్యాఖ్యలు – రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు
- తెలంగాణలో బీఆర్ఎస్ భవిష్యత్ – కేసీఆర్ పాత్రపై కవిత స్పష్టత
- రంజాన్ తోఫా నిలిపివేతపై అసంతృప్తి – కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha : నిజామాబాద్ బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రంజాన్ తోఫా నిలిపివేయడం, సీఎం రేవంత్ రెడ్డి తీరు, తెలంగాణ భవిష్యత్తు గురించి ఆమె తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరిచారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ తోఫాను నిలిపివేయడం ముస్లిం సోదరుల హక్కులకు భంగం కలిగించే విషయం అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మతసామరస్యానికి ప్రతీక అయిన తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు ఇచ్చే సహాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిలిపివేసిందని ఆమె ప్రశ్నించారు. తమ పాలనలో అన్ని మతాలకు సమాన గౌరవం కల్పించామని, ముస్లింల సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయించామని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం కేసీఆర్పై వ్యాఖ్యలు చేయడం దారుణమని కవిత పేర్కొన్నారు. “నిద్రలో కూడా ఆయన కేసీఆర్ను కలవరపెడుతున్నారని” వ్యాఖ్యానించారు. ఓ దశలో రైతుబంధును రద్దు చేయాలనే ఉద్దేశంతోనే ఆయన వ్యవహరించారని మండిపడ్డారు. రైతులకు నష్టం కలిగించే విధంగా వ్యవహరించడం తగదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర చరిత్ర అంటే కేసీఆర్, ఆ భవిష్యత్తు కూడా ఆయనే అని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయపడ్డారు. గత పదిహేను సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు కేసీఆర్ అని, ఆయన తీసుకువచ్చిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- 144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
- Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
ఇఫ్తార్ విందులో పాల్గొన్న సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి గంగా-జమునా తహజీబ్కు ప్రతీక అని అన్నారు. మతసౌహార్ధాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వానిదే అని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రాజకీయ సాధనంగా మాత్రమే చూస్తోందని ఆమె విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటుతున్నా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ కూడా పూర్తిగా అమలు చేయలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై త్వరలోనే తమ తీర్పును వెలిబుచ్చుతారని, మళ్లీ కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో రాజకీయ వేడి పెరుగుతున్న ఈ తరుణంలో ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి మద్దతు తెలుపుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Ram Charan : ఆటకూలీగా రామ్ చరణ్.. బుచ్చిబాబు ప్లాన్ అదిరింది
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్క్రిస్ట్లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?