MLC Jeevan Reddy : దరఖాస్తులు స్వీకరించకుండా దళిత బంధు లబ్దిదారుల ఎంపిక ఎలా చేస్తున్నారో చెప్పాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగిత్యాల జిల్లా కేంద్రం లోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొనసాగుతుంది భారత రాజ్యాంగమా.. బీఆర్ఎస్ రాజ్యాంగమా అని ఆయన అన్నారు. దరఖాస్తులు స్వీకరించకుండా దళిత బంధు లబ్దిదారుల ఎంపిక ఎలా చేస్తున్నారో చెప్పాలన్నారు. దళిత బంధు ఎమ్మెల్యే బందుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. జీ ఓ 8 లో పేర్కొన్నట్లుగా ప్రజా ప్రతినిధులు అంటే ఎవరో కలెక్టర్ స్పష్టత నివ్వాలని, కాంగ్రెస్ గ్యారంటీ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్తామన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీ సీ బంధు, మైనారిటీ బంధు, దళిత బంధు అంటూ ప్రజలను మభ్య పెడుతున్నారని ధ్వజమెత్తారు. 2018 నుండి గృహ నిర్మాణ కార్యక్రమాలు, దళితులు, బలహీన వర్గాల స్వయం ఉపాధి పథకాలు పూర్తిగా స్తభింపజేశారన్నారు.
Also Read : Rahul Dravid: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. రోహిత్, కోహ్లీకి విశ్రాంతి అందుకోసమేనట..!
Also Read
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
- రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
అంతేకాకుండా.. ‘2018 నుండి డబుల్ బెడ్రూం పథకం పూర్తిగా నిలిపి వేశారు. పదేళ్ల లో గృహ నిర్మాణ వ్యయం రెట్టింపు కాగా ఇంటి నిర్మాణం కోసం రు. 10 లక్షలు ఇవ్వాల్సిందిపోయి రు. 3 లక్షలు ఇస్తామంటున్నరు. దళిత బంధు ఎమ్మెల్యే బంధు గా మారింది, రాష్ట్రంలో కొనసాగుతుంది భారత రాజ్యాంగమా…బీ ఆర్ ఎస్ ప్రత్యేకంగా ఏదైనా రాజ్యాంగం అమలు చేస్తున్నారా…. ఆశావహుల నుండి ధరఖాస్తులు స్వీకరించకుండా దళిత బంధు లబ్దిదారులను ఏ విధంగా ఎంపిక చేస్తున్నారు. దళిత బంధు లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తున్నారో తేలియక దళిత సమాజం ఆందోళన చెందుతోంది.. రాజ్యాంగం లో ఫోర్త్ ఎస్టేట్ ప్రజాస్వామ్య పరిరక్షణ లో కీలకమైన పాత్రికేయుల ద్వారానైనా లబ్దిదారుల ఎంపిక ఎలా చేస్తున్నారో ప్రకటించారా…. దళిత బంధు విధి విధానాలు ఏమిటో చెప్పాలన్నారు. జగిత్యాల జిల్లా పారదర్శకతకు ఆదర్శంగా నిలిచే జిల్లా క్షేత్ర స్థాయిలో ప్రజా ప్రతినిధులు అంటే ఎవరో స్పష్టత ఇవ్వాలి అని జిల్లా కలెక్టర్ కి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
Also Read : Rahul Dravid: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. రోహిత్, కోహ్లీకి విశ్రాంతి అందుకోసమేనట..!
కాంగ్రెస్ గ్యారంటీ పథకాలు ప్రతి ఇంటికి తీసుకెళ్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గృహ నిర్మాణ కోసం స్థలం కేటాయించి, ఇంటి నిర్మాణం కోసం రు.5లక్షలు ఇస్తాం. సిలిండర్ ధర ఎంత ఉన్నప్పటికీ రు.500 లకే అందజేస్తాం.. ప్రతి మహిళకు రు.2,500 ఉచిత రవాణా సౌకర్యము కల్పిస్తాం.. వరి ధాన్యం మద్దతు ధర పై అదనంగా రు.500 చెల్లిస్తాం.. గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచితంగా అందజేస్తాం.. విద్యా జ్యోతి కింద విద్యార్థులు ఉన్నత చదువులకు రు.5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తాం.. కాంగ్రెస్ గ్యారంటీ కార్డు.. ప్రజల హక్కు పత్రం.. ఇంటి ఇంటికి కాంగ్రెస్ గ్యారంటీ తీసుకెళ్తాము. బీఆర్ ఎస్ అనాలోచిత విధానంతో మిషన్ భగీరథ పేరిట 50 వేల కోట్ల ఆర్థిక భారం ప్రజల పై మోపారని విమర్శించారు. ఎన్ టీ పీ సీ లో 4000 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉన్నా ఎందుకు యాదాద్రి నిర్మిస్తున్నారు..’ అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!