Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Karimnagar Mlc Elections 2025 Central Minister Bandi Sanjay Slams Congress Caste Census

Bandi Sanjay: జనాభాకి అనుగుణంగా లెక్కలు లేవు.. 60 లక్షల మంది ఎక్కడికి పోయారు?

Published Date :February 25, 2025 , 1:01 pm
By Sampath Kumar
  • ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి బండి సంజయ్
  • అసలు బీసీలకు 32 శాతమే వస్తుంది
  • కేసీఆర్‌కి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు
Bandi Sanjay: జనాభాకి అనుగుణంగా లెక్కలు లేవు.. 60 లక్షల మంది ఎక్కడికి పోయారు?
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణలో జనాభాకి అనుగుణంగా లెక్కలు లేవని.. 4.30 కోట్లు జనాభా ఉంటే 3.70 కోట్లు మాత్రమే చూపెట్టారని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ సర్వే చేస్తే 52 శాతం బీసీ జనాభా ఉంటే.. కాంగ్రెస్ సర్వేలో 46 శాతం మాత్రమే ఉందని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకూ నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం 1.08 లక్షల కోట్లు ఇచ్చిందని, నిరూపిస్తాం అంటే కాంగ్రెస్ నేతలు పారిపోయారని బండి సంజయ్ పేర్కొన్నారు. కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి బండి సంజయ్ పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.

‘బీజేపీ కులగణనకి బీజేపీ వ్యతిరేకం కాదు. తెలంగాణలో జనాభాకి అనుగుణంగా లెక్కలు లేవు. 4.30 కోట్లు జనాభా ఉంటే 3.70 కోట్లు మాత్రమే చూపెట్టారు, మిగతా 60 లక్షల మంది ఎక్కడికి పోయారు?. కేసీఆర్ సర్వే చేస్తే 52 శాతం బీసీ జనాభా ఉంటే.. 46 శాతం కాంగ్రెస్ సర్వేలో ఉంది. బీసీల్లో ముస్లింలను చేర్చితే.. అసలు బీసీలకు 32 శాతమే వస్తుంది. గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో అభివృద్ధి విషయంలో పోల్చుకోండి. ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇవ్వమనంటే ఎందుకు ఇవ్వడం లేదు. కేసీఆర్ పేరు ఫోన్ ట్యాపింగ్లో నిందితులు చెప్పారు. ఎందుకు కేసీఆర్‌కి నోటీసులు ఇవ్వలేదు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు కాంగ్రెస్ హయాంలోనే పారిపోయారు. సీబీఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు ఇవ్వండి.. వాళ్ళను పట్టుకోస్తాం’ అని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు.

‘ఫార్ములా ఈ-కార్ రెస్ కేసులో కేసీఆర్‌కి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు. ఇదేనా విచారణ పద్దతి?. విద్యుత్ కొనుగోళ్ల కేసు, కాళేశ్వరం అక్రమాలు, డ్రగ్స్ కేసులలో విచారణ ఇదేనా. హైడ్రాలో ఇళ్లను కూల్చుతున్నారు. జనవాడ ఫార్మ్ హౌస్ ఎందుకు ముట్టుకోరు?. ఒక్క కేసులో కూడా కేసీఆర్‌ కుటుంబానికి నోటీస్ ఎందుకు ఇవ్వలేదు. లిక్కర్ కేసులో మేము కవితను అరెస్ట్ చేసి లోపల వేశాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ కేసుల విషయంలో లాలూచీ పడ్డాయి. మూసీ ప్రక్షాళనకు 15 వేల కోట్లు అయితే 1.50 లక్షల కోట్లు అంచనాలు పెంచారు. అందుకే నిధులు ఇవ్వడం లేదు. పేదరికాన్ని బట్టి యూపీ, బీహార్‌లో నిధులు ఇస్తున్నారు. అన్నీ తెల్సి ప్రజల్లో అయోమయం సృష్టించే వ్యాఖ్యలు చేస్తున్నారు’ అని కేంద్రమంత్రి పేర్కొన్నారు.

‘అభివృద్ధి విషయంలో మేము చర్చకు సిద్ధం. కేంద్రం తెలంగాణకు 1.08 లక్షల కోట్లు ఇచ్చాం.. నిరూపిస్తాం అంటే కాంగ్రెస్ వారు పారిపోయారు. బీఆర్ఎస్ కెప్టెన్ ఫామ్‌హౌస్‌లో పండుకున్నారు. వరి వేస్తే ఉరి అన్న కేసీఆర్ లాగే.. కాంగ్రేస్ నేతలు అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును 50 శాతం బీఆర్ఎస్ నాశనం చేస్తే.. మిగతా 50 శాతం కాంగ్రెస్ నాశనం చేసింది. ఫిబ్రవరిలోనే పంటలు ఎండుతున్నాయి. పక్క రాష్ట్రం కృష్ణా జలాలను దోచుకుంటుంది.. అయినా చూడనట్టు కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తోంది. సీఎం రేవంత్ ప్రధాని పట్ల చేసిన వ్యాఖ్యలు బీసీలను కించవరచడమే. ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఇవ్వడం బాధ్యత. ఎవరైనా ఇవ్వాల్సిందే. ఇచ్చిన హామీలను అసలు చేసారా?.. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి?. నిన్నటి దాకా పీసీసీ, సీఎం పదవులు రేవంత్ వద్దే ఉన్నాయి. ఒత్తిడి చేస్తే పార్టీ పదవిని వదులుకున్నారు’ అని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • bjp
  • BRS
  • congress
  • karimnagar

తాజావార్తలు

  • 2027 Pongal Fight : వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటి నుండే కాంపిటీషన్

  • Trump: “అలా చేస్తే నా నెక్ట్స్‌ టార్గెట్ మీరే”.. చైనాకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..

  • RamCharan: మెగా పవర్ స్టార్ బాలీవుడ్ ఎంట్రీ.. భన్సాలీ భారీ ప్రాజెక్ట్ లో చరణ్?

  • JD Vance: చర్చలు విఫలం.. ఇరాన్ తో ఎలాంటి డీల్ లేదన్న జేడీ వాన్స్

  • Shashi Tharoor: వారే ఆ పాత్రను పోషించగలరు.. పాక్ ప్రధాని పోస్ట్‌పై థరూర్ సెటైర్స్

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions