Bandi Sanjay: జనాభాకి అనుగుణంగా లెక్కలు లేవు.. 60 లక్షల మంది ఎక్కడికి పోయారు?
- ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి బండి సంజయ్
- అసలు బీసీలకు 32 శాతమే వస్తుంది
- కేసీఆర్కి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో జనాభాకి అనుగుణంగా లెక్కలు లేవని.. 4.30 కోట్లు జనాభా ఉంటే 3.70 కోట్లు మాత్రమే చూపెట్టారని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ సర్వే చేస్తే 52 శాతం బీసీ జనాభా ఉంటే.. కాంగ్రెస్ సర్వేలో 46 శాతం మాత్రమే ఉందని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్కు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకూ నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం 1.08 లక్షల కోట్లు ఇచ్చిందని, నిరూపిస్తాం అంటే కాంగ్రెస్ నేతలు పారిపోయారని బండి సంజయ్ పేర్కొన్నారు. కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి బండి సంజయ్ పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.
‘బీజేపీ కులగణనకి బీజేపీ వ్యతిరేకం కాదు. తెలంగాణలో జనాభాకి అనుగుణంగా లెక్కలు లేవు. 4.30 కోట్లు జనాభా ఉంటే 3.70 కోట్లు మాత్రమే చూపెట్టారు, మిగతా 60 లక్షల మంది ఎక్కడికి పోయారు?. కేసీఆర్ సర్వే చేస్తే 52 శాతం బీసీ జనాభా ఉంటే.. 46 శాతం కాంగ్రెస్ సర్వేలో ఉంది. బీసీల్లో ముస్లింలను చేర్చితే.. అసలు బీసీలకు 32 శాతమే వస్తుంది. గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో అభివృద్ధి విషయంలో పోల్చుకోండి. ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇవ్వమనంటే ఎందుకు ఇవ్వడం లేదు. కేసీఆర్ పేరు ఫోన్ ట్యాపింగ్లో నిందితులు చెప్పారు. ఎందుకు కేసీఆర్కి నోటీసులు ఇవ్వలేదు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు కాంగ్రెస్ హయాంలోనే పారిపోయారు. సీబీఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు ఇవ్వండి.. వాళ్ళను పట్టుకోస్తాం’ అని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు.
Also Read
- Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
- Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
- Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్పై స్పందిస్తాము..
- Commonwealth Games 2026: కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు తొలి స్వర్ణం.. చరిత్ర స్పష్టించిన మీరాబాయి చాను..
‘ఫార్ములా ఈ-కార్ రెస్ కేసులో కేసీఆర్కి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు. ఇదేనా విచారణ పద్దతి?. విద్యుత్ కొనుగోళ్ల కేసు, కాళేశ్వరం అక్రమాలు, డ్రగ్స్ కేసులలో విచారణ ఇదేనా. హైడ్రాలో ఇళ్లను కూల్చుతున్నారు. జనవాడ ఫార్మ్ హౌస్ ఎందుకు ముట్టుకోరు?. ఒక్క కేసులో కూడా కేసీఆర్ కుటుంబానికి నోటీస్ ఎందుకు ఇవ్వలేదు. లిక్కర్ కేసులో మేము కవితను అరెస్ట్ చేసి లోపల వేశాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ కేసుల విషయంలో లాలూచీ పడ్డాయి. మూసీ ప్రక్షాళనకు 15 వేల కోట్లు అయితే 1.50 లక్షల కోట్లు అంచనాలు పెంచారు. అందుకే నిధులు ఇవ్వడం లేదు. పేదరికాన్ని బట్టి యూపీ, బీహార్లో నిధులు ఇస్తున్నారు. అన్నీ తెల్సి ప్రజల్లో అయోమయం సృష్టించే వ్యాఖ్యలు చేస్తున్నారు’ అని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
‘అభివృద్ధి విషయంలో మేము చర్చకు సిద్ధం. కేంద్రం తెలంగాణకు 1.08 లక్షల కోట్లు ఇచ్చాం.. నిరూపిస్తాం అంటే కాంగ్రెస్ వారు పారిపోయారు. బీఆర్ఎస్ కెప్టెన్ ఫామ్హౌస్లో పండుకున్నారు. వరి వేస్తే ఉరి అన్న కేసీఆర్ లాగే.. కాంగ్రేస్ నేతలు అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును 50 శాతం బీఆర్ఎస్ నాశనం చేస్తే.. మిగతా 50 శాతం కాంగ్రెస్ నాశనం చేసింది. ఫిబ్రవరిలోనే పంటలు ఎండుతున్నాయి. పక్క రాష్ట్రం కృష్ణా జలాలను దోచుకుంటుంది.. అయినా చూడనట్టు కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తోంది. సీఎం రేవంత్ ప్రధాని పట్ల చేసిన వ్యాఖ్యలు బీసీలను కించవరచడమే. ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఇవ్వడం బాధ్యత. ఎవరైనా ఇవ్వాల్సిందే. ఇచ్చిన హామీలను అసలు చేసారా?.. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి?. నిన్నటి దాకా పీసీసీ, సీఎం పదవులు రేవంత్ వద్దే ఉన్నాయి. ఒత్తిడి చేస్తే పార్టీ పదవిని వదులుకున్నారు’ అని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.
- Tags
- bandi sanjay
- bjp
- BRS
- congress
- karimnagar
తాజావార్తలు
-
The Paradise: 20 కోట్ల వ్యూస్తో దుమ్మురేపిన ‘ఆయా షేర్’.. ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్పై బిగ్ అప్డేట్!
-
Indian Idol 16 Winner: ఇండియన్ ఐడల్ 16 విజేతగా జ్యోతిర్మయి నాయక్.. ట్రోఫీతో పాటు రూ. 20 లక్షల ప్రైజ్ మనీ
-
Ram Charan: రామ్ చరణ్కు గాయం.. సర్జరీ కోసం కోయంబత్తూరు, RC17పై ప్రభావం?
-
CM Revanth Reddy : యువతే గేమ్చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!