Balmuri Venkat: కేసీఆర్ కుటుంబం వల్ల తెలంగాణ రాష్ట్రం దోపిడీకి గురైంది..
- కేటీఆర్ ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా గుర్తింపు పొందారు- బల్మూరి వెంకట్
- సుప్రీంకోర్టు, హైకోర్టులలో కేటీఆర్ కు ఊరట లభించలేదు
- కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు- వెంకట్
- కేసీఆర్ కుటుంబం వల్ల తెలంగాణ రాష్ట్రం దోపిడీకి గురైంది- బల్మూరి వెంకట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ కుటుంబంపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా గుర్తింపు పొందారని ఆరోపించారు. సుప్రీంకోర్టు, హైకోర్టులలో కేటీఆర్కు ఊరట లభించలేదు.. అందుకే మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని కేటీఆర్ను దుయ్యబట్టారు. కేటీఆర్కు హైదరాబాద్ పై ఒక స్పష్టత లేదు.. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో బావ, బామ్మర్ది ఎన్నో స్కామ్లకు పాల్పడ్డారని తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో అడ్డమైన జీవోలు ఇచ్చి ప్రభుత్వ భూములను ప్రైవేటు రంగానికి, బిల్డర్లకు ఇచ్చి డబ్బులు దోచుకు తిన్నారని పేర్కొన్నారు.
Read Also: CM Chandrababu Serious: తిరుపతి ఘటనపై సీఎం సీరియస్.. వారిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు..
Also Read
- India T20 Captaincy: సూర్యకుమార్కు బిగ్ షాక్.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు?
- Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
- Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
కేటీఆర్ చేసిన అక్రమాలకు ఇప్పుడు కొంతమంది ఐఏఎస్ అధికారులు ఇబ్బందులు పడుతున్నారని బల్మూరి వెంకట్ తెలిపారు. కరీంనగర్ అక్రమ ఇసుక రవాణా చేసింది మీ తమ్ముడు, మీ బాబాయ్ కాదా.. అని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్లో చెల్లె కవిత ఇరుక్కుని ఊసలు లెక్క పెట్టింది నిజం కాదా అని విమర్శించారు. ఛత్తీస్గఢ్లో అదానీతో కేసీఆర్ చేసుకున్న అక్రమ ఎలక్ట్రిసిటీ ఒప్పందాల సంగతేంటని అన్నారు. ఫోన్ టాపింగ్ విషయంలో ఆర్థిక, రాజకీయ అంశాలను చేర్చి దోపిడీకి తెరలేపింది కేటీఆర్ అని బల్మూరి వెంకట్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం వల్ల తెలంగాణ రాష్ట్రం దోపిడీకి గురైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Sankranti ki vastunnam : సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు కేటీఆర్కు లేదని బల్మూరి వెంకట్ అన్నారు. ఐటీ రంగంలో హైదరాబాద్ను అభివృద్ధి చేశామని.. ఒక బోగస్ ప్రచారానికి కేటీఆర్ తెరలేపాడని ఆరోపించారు. ప్రభుత్వ శాఖల్లో కేటీఆర్ చేసిన అవినీతి చిట్టాను ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ స్కీమ్ తీసుకువచ్చిన స్కామ్కు దారి తీసింది.. ఏసీబీకి పూర్తిస్థాయిలో సహకరించి నీ నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలని కేటీఆర్కు సూచించారు. దోపిడీకి పాల్పడిన కేటీఆర్ కుటుంబాన్ని తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితి లేదని బల్మూరి వెంకట్ తెలిపారు.
తాజావార్తలు
-
India T20 Captaincy: సూర్యకుమార్కు బిగ్ షాక్.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు?
-
Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!