CM Chandrababu Serious: తిరుపతి ఘటనపై సీఎం సీరియస్.. వారిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు..
- తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్..
- టీటీడీ ఈవోపై సీఎం ప్రశ్నల వర్షం..
- ఎందుకు నిర్లక్ష్యం వహించారని మండిపడ్డ సీఎం..
- అసలు టీటీడీ ఈవోకు సమాచారం ఎప్పుడు వచ్చిందని ప్రశ్న..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Serious: తిరుపతి ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీటీడీ ఈవోపై సీరియస్ అయ్యారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, తొక్కిసలాట జరిగే ప్రమాదముందని తెలిసినప్పటికీ ఎందుకు నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. అసలు టీటీడీ ఈవోకు సమాచారం ఎప్పుడు వచ్చిందని ప్రశ్నించారు. మీ ప్లానింగ్ ఏంటి.. భక్తులు వస్తారని తెలిసి ప్లానింగ్ ఎందుకు చేయలేకపోయారని ముఖ్యమంత్రి నిలదీశారు. పోలీస్, టీటీడీ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం ఉందని నివేదిక వచ్చిందని, బాధ్యులను ఫిక్స్ చేసి వెంటనే వారిని సస్పెండ్ చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అసలు కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం ఎందుకు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం ఘటనలో అధికారుల వైఫల్యం స్పష్టంగా ఉందని ప్రాథమిక నివేదిక వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు.
Also Read
- Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
- Leopard: అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత కలకలం.. పరుగులు తీసిన భక్తులు
- Tirupati Double Murder: తిరుపతిలో జంట హత్యల కలకలం.. పెళ్లి వేడుకలో కత్తులతో దాడి..
- Peddireddy Ramachandra Reddy: తిరుపతిలో వైఎస్సార్కు నివాళి.. మావిగన్పై పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
టీటీడీ ఈవోతో పాటు జేఈవో గౌతమీపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఇది పద్ధతి కాదు, పద్ధతి ప్రకారం పని చేసేది నేర్చుకోండి.. మీరు సమాధానం చెప్పండి.. ఈ కేంద్రం వద్ద ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారు.. ప్రతి ఒక్కరికి చెప్తున్నా.. పద్ధతి ప్రకారం నడుచుకోండి.. తమాషాలనుకోవద్దు అని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.. బాధ్యతలు తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి.. ఇక్కడ నో ఎక్స్క్యూజ్.. అని స్పష్టం చేశారు.. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి.. ఎందుకు జరిగిందో చెప్పండి..? భక్తులను ఉంచేందుకు కొత్త ప్లేస్ ఎంపిక చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా? అని నిలదీశారు.. ఇక్కడ నియమించిన పోలీస్ ఆఫీసర్ కి జాగ్రత్తలు చెప్పారా..? ఆ గేటు తీస్తే తొక్కిసలాట జరుగుతుందని ఎందుకు ఊహించలేదు అని కలెక్టర్పై ఫైర్ అయ్యారు.. ఘటనా స్థలానికి అంబులెన్స్ ఎన్ని గంటలకు వచ్చింది..? టోకెన్లు ఆఫ్లైన్లో ఎన్ని ఇచ్చారు.. ఆన్లైన్లో ఎన్ని ఇచ్చారు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.. గత విధానం కొనసాగించకుండా కొత్త విధానం ఎంపిక చేసుకుని ఉండాల్సింది.. అలా చేస్తారని మిమ్మల్ని పంపించాను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!