Karnataka Elections : కర్ణాటకలో మేనిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలో కర్ణాటక రాష్ట్రంలో జరుగనున్న ఎన్నికల కోసం అధికార-ప్రతిపక్ష పార్టీలు భారీగా ప్రచారంతో పాటు విమర్శలకు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. దీంతో నిన్న ( సోమవారం ) అధికార బీజేపీ పార్టీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. దీంతో ఇవాళ ( మంగళవారం ) కాంగ్రెస్ పార్టీ కూడా తమ మేనిఫెస్టోను విడుదల చేసింది.
Also Read : Vizag: విశాఖలో ఫ్లెక్సీల కలకలం..
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో హామీల వర్షం కురిపించింది కాంగ్రెస్ పార్టీ. తాము అధికారంలోకి వస్తే.. ఉచిత విద్యుత్, మహిళలకు నగదు-ఉచిత రవాణా, నిరుద్యోగ భృతి వంటివి ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. కర్ణాటకలో ఉదయం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖర్జున ఖర్గే, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్దరామయ్యతో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు.
Also Read : Snake Poison : బంగ్లా సరిహద్దులో కోట్ల విలువ చేసే పాము విషం స్వాధీనం..
మేనిఫెస్టోలోని ముఖ్య అంశాలు..
1. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తరపు నుంచి ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్
2. కుంటుంబ పెద్దగా ఉండే ప్రతి మహిళకు నెలకు రూ. 2 వేల నగదు పంపిణీ
3. నిరుద్యోగ గ్రాడ్జ్యువేట్స్ కు నెలకు రూ. 3 వేలు ( రెండేళ్ల వరకు )
4. డిప్లామా హోల్డర్స్ కు నెలకు. రూ. 1,500 ( రెండేళ్ల వరకు )
5. కేఎస్ఆర్టీసీ-బీఎంటీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీగా ప్రయాణం.
6. నైట్ డ్యూటీ చేసే పోలీసు అధికారులకు నెలకు రూ. 5వేల స్పెషల్ అలోవెన్స్
7. బజరంగ్ దళ్, పీఎఫ్ఐ వంటి సంస్థలను నిషేధించే విధంగా నిర్ణయం తీసుకోవడం.
8. ఎస్సీ రిజర్వేసన్ 15 నుంచి 17 శాతానికి పెంచడం.. ఎస్టీ రిజర్వేషన్ 3 నుంచి 7 శాతానికి పెంపు
9. మైనార్టీ రిజర్వేషన్ 4 శాతానికి పునరుద్ధరించడం, లింగాయత్లు, వొక్కలిగ్గాలు, ఇతర సంఘాల సభ్యులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చే విధంగా ప్రచారం
Also Read : NTR 30: జాన్వీకి పోటీగా మహానటి రంగంలోకి…
అయితే 224 అసెంబ్లీ సీట్లున్న కర్ణాటకలో ఈ నెల 10వ తారీఖున ఎలక్షన్స్ జరుగనున్నాయి. 13న తుది ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే కొన్ని సర్వేలు బయటకొచ్చాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెబుతున్నాయి. మరి కొన్ని సర్వేలు మాత్రం హంగ్ వస్తుందని అంచనా వేస్తున్నాయి. మరి కన్నడ ఓటర్లు ఎవరికి పట్టం కడతారు అనేది వేచి చూడాలి…
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!