MLA Raja Singh: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తా.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Raja Singh: తనను టార్గెట్ చేస్తూ బీజేపీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.. తాను బీజేపీకి రాజీనామా జరగడానికి కారణం అందులో తప్పులు జరుగుతున్నాయని తెలిపారు.. బీజేపీ కార్యకర్తలను పక్కన పెడుతున్నారని రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఇంకా ఎన్ని రోజులు తనను టార్గెట్ చేస్తారని అడిగారు. తాను బీజేపీ కార్యకర్తల కోసం మాట్లాడానన్నారు. బీజేపీ రాష్ట్ర కమిటీలో 10 నుంచి 12 మందిని సికింద్రబాద్ పార్లమెంట్ నుంచి తీసుకున్నారని చెప్పారు.
READ MORE: Supreme Court: ‘‘ మన రాజ్యాంగం గర్వకారణం’’.. నేపాల్, బంగ్లాలను ఉదహరించిన సుప్రీంకోర్టు..
Also Read
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
- CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- Ajinkya Rahane: రిటైర్మెంట్ వేళ రహానే సంచలనం.. గంభీర్కే నేరుగా హెచ్చరిక..
ఇంతకీ ఇది రామ చందర్ రావు కమిటీ నా? మా కిషన్ రెడ్డి వేసిన కమిటీ నా? అని ప్రశ్నించారు. ఈ కమిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని తెలంగాణలో తీసుకువస్తారా అన్నారు. ఒక వేళ తీసుకొస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. పార్టీని సర్వనాశనం చేస్తున్నారని వారు ఫోన్ చేసి చెబుతున్నారు. ఎంపీలు ఈ కమిటీతో సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఆ విషయాన్ని బయటకు చెప్పారన్నారు.
READ MORE: Jagtial: గణపతి చందా ఇవ్వలేదని కులం నుంచి బహిష్కరణ.. ఎవరైనా మాట్లాడితే రూ.25వేలు ఫైన్..!
“రామ చందర్ రావు వెనుక కొందరు ఉండి పార్టీని నడిపించాలని అనుకుంటున్నారు. డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాను నడిపిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వేముల అశోక్ మాట్లాడే పద్ధతి సరిగా లేదు. బీబీ నగర్ ఎయిమ్స్ లో పోస్ట్ లు ఇప్పిస్తానని రూ. మూడు లక్షలు తీసుకున్నారని మీపై ఆరోపణలు ఉన్నాయి. భార్యతో కలిసి రామచందర్ రావు ఇంటికి వెళ్లి కిరోసిన్ పోసుకున్నారట. నేను నాలుగో సారి పోటీ చేయాలా వద్దా? అని ఆలోచిస్తా. నన్ను గెలిపించింది మా బీజేపీ కార్యకర్తలే.. మళ్ళీ కూడా గెలిపిస్తారు. మా పార్టీ బాగు పడాలనేది నేను అనుకుంటున్న. అధికారంలోకి రావాలనే నా కోరిక.. నేను ఎమ్మేల్యే గా రాజీనామా చేయను. కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే నేను రాజీనామా చేస్తా.” అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
-
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
-
Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
-
Exhaust Fan Cleaning Tips: మీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నల్లగా, జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే విప్పకుండానే కొత్తదిలా మెరిసిపోతుంది!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!