Raghunandan Rao: ఆయనపై కత్తి దాడి దురదృష్టకరం.. నాపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తి దాడి దుదృష్టకరం, బాధాకరం అని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.. ప్రజాస్వామ్య లో దాడులు పరిష్కారం కావు.. కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. పాలమూరు నుండి నేరుగా ఆస్పత్రికి వెళ్లి ప్రభాకర్ రెడ్డినీ పరామర్శిస్తాను అని ఆయన తెలిపారు. నిందితుడు రాజు జై కాంగ్రెస్, జై మిరుదొడ్డి మండలం అని ఫేస్ బుక్ లో స్టేటస్ పెట్టుకున్నాడు అంటూ బీజేపీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. వీహెచ్ తో కలిసి దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి.. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి సీపీ పూర్తి వివరాలు వెల్లడిస్తే బాగుండేది అని రఘునందన్ రావు చెప్పుకొచ్చారు.
Read also: Madonna Sebastian: అరేయ్.. ఆంటోనీ దాస్.. ఎలారా.. ఇంత అందాన్ని నరబలి ఇచ్చావ్
Also Read
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్మన్ గిల్..
దిపాయన్ పల్లీ గ్రామానికి చెందిన కార్యకర్త స్వామినీ పోలీసులు మఫ్టీలో ఎత్తుకెళ్లారు అని రఘునందన్ రావు ఆరోపించారు. దుబ్బాక బీజేపీ కార్యాలయంపై దాడి చేశారు.. కొంత మంది కౌన్సిలర్లు మా సిబ్బందిపై భౌతిక దాడి చేశారు.. పోలీసుల ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.. బీజేపీ నాయకుల ఇళ్లు, దుకాణాలపై దాడులు చేస్తున్నారు.. ఎన్నికల కోడ్ అమలు లో ఉంటే రఘునందన్ రావు దిష్టి బొమ్మ దహనం చేస్తుంటే ఏం చేస్తున్నారు.. దళిత బంధు రాలేదని ఆవేదనతో ఘటనకు పాల్పడ్డాడు అని కొన్ని మీడియాలో వస్తోంది.. కార్యకర్తలు సంయమనం పాటించండి.. సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాన్ని నమ్మొద్దు అని రఘునందన్ రావు అన్నారు.
Read also: Omar Abdullah: ఇండియా కూటమి బలంగా లేకపోవడం దురదృష్టకరం
రాజు మద్యం మత్తులో ఉన్నాడు, కుటుంబ సభ్యులతో కలహాలు ఉన్నాయని మీడియాలో వస్తోంది రఘునందన్ రావు తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి సీపీ వివరాలు వెల్లడిస్తే బాగుండేది.. సీపీ వాఖ్యల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అనుకుంటున్నాం అని ఆయన పేర్కొన్నారు. బీజేపీ కండువా కప్పినట్టు ప్రచారం జరుగుతున్న వ్యక్తి నిందితుడు కాదు.. పొడేటి నర్సింహులు నిన్ననే బీఆర్ఎప్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరాడు అని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.. సిద్దిపేట సీపీపై వారం క్రితమే డీజీపీకి ఫిర్యాదు చేశాను.. సీఎం అడుగులకు మడుగులు నొక్కుతున్నారు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాణానికి చెరో వైపు అంటూ రఘునందన్ రావు మండిపడ్డారు.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..