MLA Sreedhar Reddy: వేలానికి ఎమ్మెల్యే ఆస్తులు..? తప్పుడు ప్రచారం.. నేను పారిపోయే వ్యక్తిని కాదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Sreedhar Reddy: పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి సంబంధించిన ఆస్తులను వేలం వేసేందుకు కెనరా బ్యాంకు సిద్ధం అయినట్టు వార్తలు వచ్చాయి.. ఆస్తులను వేలం వేస్తున్నట్టు కెనరా బ్యాంకు బహిరంగ ప్రకటన విడుదల చేసింది. అయితే, ఈ పరిణామాలపై స్పందించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. కరోనా మహమ్మారి వల్ల బ్యాంకుకు రుణాలు చెల్లించడం ఆలస్యం అయ్యిందన్నారు.. మా పార్టీలో ఉన్న వాళ్లే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. రుణాలు ఎగ్గొట్టి వెళ్ళే ప్రసక్తే లేదు.. నేను పారిపోయే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. కంపెనీలో వ్యాపారం జరుగుతుంది.. రావాల్సిన బకాయిలు రావాలన్న ఆయన.. బ్యాంకులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నానని వెల్లడించారు.
Read Also: Locket Chatterjee: పశ్చిమ బెంగాల్లోనూ మణిపూర్ తరహా ఘటన.. కన్నీళ్లు పెట్టుకున్న బీజేపీ ఎంపీ
Also Read
- 55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
- Modi - Meloni - Melody: జార్జియా మెలోనికి మోడీ స్పెషల్ గిఫ్ట్..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో
- Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా 'Rupee'.. పతనానికి అసలు కారణం ఇదే..
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
ఇక, వ్యాపారంలో ఒడిదుడుకులు రావడం సహజమే.. అంత మాత్రాన ఎగ్గొట్టి పోతారనడం దారుణం అన్నారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి.. కంపెనీకి 1500 కోట్ల రూపాయల విలువైన పనులు జరిగాయి. బకాయిలు రావాలి.. వచ్చిన వెంటనే చెల్లిస్తామని వివరణ ఇచ్చారు. రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి, వ్యాపారాన్ని వ్యాపారంగా చూడాలని హితవుపలికారు. శ్రీధర్ రెడ్డి మళ్లీ పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో నేను గెలవలేని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి.. ఇలాంటి జిమ్మిక్కులు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయం ఎదుర్కోలేక నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. కాగా, మెసర్స్ సాయిసుధీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కెనరా బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంది. అయితే, వాటిని చెల్లించలేదు. ఇక, ఈ రుణాలకు శ్రీధర్ రెడ్డి హామీదారుడిగా ఉన్నారు. దీంతో కంపెనీతో పాటు, శ్రీధర్ రెడ్డి ఆస్తులను ఆగస్టు 18వ తేదీన వేలం వేయనున్నట్టు బ్యాంకు ప్రకటించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Chiru158: చిరు158కి థమన్ ఫిక్స్.. మెగా మాస్కి మ్యూజికల్ బ్లాస్ట్ రెడీ!
-
Ragi Egg Dosa: బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ అవ్వాలా? ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఈ దోశ తింటే చాలు!
-
Modi – Meloni – Melody: జార్జియా మెలోనికి మోడీ స్పెషల్ గిఫ్ట్..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో
-
Allu Arjun: ‘ఈసారి టైగర్ కాదు.. డ్రాగన్’.. అంటూ బావ కోసం బన్నీ స్పెషల్ విషెస్ ..
ట్రెండింగ్
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!