MLA Sreedhar Reddy: వేలానికి ఎమ్మెల్యే ఆస్తులు..? తప్పుడు ప్రచారం.. నేను పారిపోయే వ్యక్తిని కాదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Sreedhar Reddy: పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి సంబంధించిన ఆస్తులను వేలం వేసేందుకు కెనరా బ్యాంకు సిద్ధం అయినట్టు వార్తలు వచ్చాయి.. ఆస్తులను వేలం వేస్తున్నట్టు కెనరా బ్యాంకు బహిరంగ ప్రకటన విడుదల చేసింది. అయితే, ఈ పరిణామాలపై స్పందించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. కరోనా మహమ్మారి వల్ల బ్యాంకుకు రుణాలు చెల్లించడం ఆలస్యం అయ్యిందన్నారు.. మా పార్టీలో ఉన్న వాళ్లే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. రుణాలు ఎగ్గొట్టి వెళ్ళే ప్రసక్తే లేదు.. నేను పారిపోయే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. కంపెనీలో వ్యాపారం జరుగుతుంది.. రావాల్సిన బకాయిలు రావాలన్న ఆయన.. బ్యాంకులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నానని వెల్లడించారు.
Read Also: Locket Chatterjee: పశ్చిమ బెంగాల్లోనూ మణిపూర్ తరహా ఘటన.. కన్నీళ్లు పెట్టుకున్న బీజేపీ ఎంపీ
Also Read
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
ఇక, వ్యాపారంలో ఒడిదుడుకులు రావడం సహజమే.. అంత మాత్రాన ఎగ్గొట్టి పోతారనడం దారుణం అన్నారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి.. కంపెనీకి 1500 కోట్ల రూపాయల విలువైన పనులు జరిగాయి. బకాయిలు రావాలి.. వచ్చిన వెంటనే చెల్లిస్తామని వివరణ ఇచ్చారు. రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి, వ్యాపారాన్ని వ్యాపారంగా చూడాలని హితవుపలికారు. శ్రీధర్ రెడ్డి మళ్లీ పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో నేను గెలవలేని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి.. ఇలాంటి జిమ్మిక్కులు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయం ఎదుర్కోలేక నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. కాగా, మెసర్స్ సాయిసుధీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కెనరా బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంది. అయితే, వాటిని చెల్లించలేదు. ఇక, ఈ రుణాలకు శ్రీధర్ రెడ్డి హామీదారుడిగా ఉన్నారు. దీంతో కంపెనీతో పాటు, శ్రీధర్ రెడ్డి ఆస్తులను ఆగస్టు 18వ తేదీన వేలం వేయనున్నట్టు బ్యాంకు ప్రకటించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ‘ఆర్య’ కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
-
Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
-
Sana Mir: వంటగదిలో రోటీలు చేసుకోండని పురుష క్రికెటర్లను అంటారా?.. ఈ లింగ వివక్ష ఎందుకు!
-
JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్కే షాక్.. జియో హాట్స్టార్లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!