నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్పై ఫైర్ అయ్యారు. ఇవాళ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. యువగళం పాదయాత్రలో వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడారన్నారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరులో ఇరిగేషన్ ప్రాజెక్టులను పట్టించుకోలేదని, అధికారంలోకి వచ్చిన తర్వాతనే పూర్తి చేసామన్నారు. సోమశిల సామర్థ్యాన్ని పెంచాం.. దీనివల్ల చిత్తూరు చెన్నై లకు పుష్కలంగా నీరు అందించామని ఆయన వెల్లడించారు. రాళ్లపాడు రిజర్వాయర్ కూడా నీళ్లు ఇచ్చామని, ఈ ప్రభుత్వ హయాంలోనే మూడు వేల కోట్ల విలువైన పండ్లకు టెండర్లు పిలిచి పనులు చేస్తున్నామన్నారు. అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రావాలని లోకేష్ కు అనిల్ సవాల్ విసిరారు. అంతేకాకుండా.. ‘టీడీపీ హయాంలో సోమశిల రిజర్వాయర్ కు నీళ్లు రాలేదు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు పంటలకూ నీళ్లు ఇస్తున్నాం. ఊరంతా గెలిచేది కాదు దమ్ముంటే మంగళగిరిలో గెలవాలి. పాదయాత్రకు ప్రజలు రావడం లేదు.
Also Read : Group-4 Exam: గ్రూప్-4 పరీక్షకు వేలిముద్రతో హాజరు.. జులై 1న పరీక్ష
నూటికి వచ్చినట్టు జగన్ పై మాట్లాడడం సరికాదు. వచ్చే ఎన్నికల్లో మేమే గెలుస్తున్నాం. రామనారాయణరెడ్డి ఎక్కడ గాలి వస్తే అక్కడికి వెళుతుంటాడు.. ఎవడితో వుంటావో తెలీదు. ఐదేళ్లు మంత్రిగా ఉండి ఏం సాధించారు. ఒక సంగం బ్యారేజ్ పనులు పూర్తి చేయలేదు. రామనారాయణరెడ్డి తీరు వల్లే పలు అభివృద్ధి పనులు ఆగిపోయాయి. ఆల్తూరుపాడు రిజర్వాయర్ పనులను ఆనం అడ్డుకున్నారు. నెల్లూరు రూరల్.. సిటీలలో ఆనంకు బలం లేదు. వచ్చే ఎన్నికల్లో ఆనం గెలిచే ప్రసక్తే లేదు. ఎన్నికల్లో వైసీపీ గెలుస్తోంది. ఆయన మళ్లీ టీడీపీని వదిలేస్తాడు. ఎన్నికల్లో జగన్ టికెట్ ఇయకుంటే ఆనంకు రాజకీయ భవిష్యత్తు ఉండేది కాదు. ఆనం ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్ కూడా రాదు. ఆనం ఓటమి తథ్యం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వర్లమాలు నెల్లూరుకు వచ్చారు. ఎందుకు నీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. సెకండ్ హయాంలో ఎన్నో పనులు చేశాం. ఇంకా చేస్తున్నాం. ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీని వీడినంత మాత్రాన ఏం కాదు. వైసీపీలో వాళ్ళు కలుపు మొక్కలు.. అందుకనే పీకి పారేశారు’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు అనిల్ కుమార్ యాదవ్.
Also Read : Group-4 Exam: గ్రూప్-4 పరీక్షకు వేలిముద్రతో హాజరు.. జులై 1న పరీక్ష