Group-4 Exam: గ్రూప్-4 పరీక్షకు వేలిముద్రతో హాజరు.. జులై 1న పరీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Group-4 Exam: గ్రూప్-4 పరీక్షకు వేలిముద్రతో హాజరు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) నిర్ణయించింది. గతంలో జరిగిన పరీక్షల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పరీక్షకు ఒకరికి బదులు మరొకరు హాజరు కాకుండా ఉండటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అభ్యర్థుల వేలిముద్రలు తీసుకున్న తరువాతే వారికి ఓఎంఆర్ పత్రాల్ని అందజేస్తారు. జులై 1న గ్రూప్-4 పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. పేపర్-1ను ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు .. పేపర్-2ను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.
Read also: Cheetah: చిరుత చిక్కింది.. మరో చిరుత ఉన్నట్లు సమాచారం
Also Read
- Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి 'చేప ప్రసాదం' పంపిణీ..
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
ప్రభుత్వ విభాగాల్లో 8,180 గ్రూప్-4 పోస్టులకు జులై 1న రాతపరీక్షను ఓఎంఆర్ విధానంలో నిర్వహించనున్నారు. పరీక్షకు 9.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులకు రెండంచెల తనిఖీలు నిర్వహించనున్నారు. హాల్టికెట్తో పాటు తప్పనిసరిగా ఫొటో గుర్తింపు కార్డును పరిశీలిస్తారు. గతేడాది నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో బయోమెట్రిక్ అమలు చేశారు. కానీ ఆ సమయంలో 100 శాతం అభ్యర్థుల బయోమెట్రిక్ను తీసుకోలేకపోయారు. కొందరు పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావడం, పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి బయోమెట్రిక్ తీసుకోలేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో తదుపరి పరీక్షల్లో అభ్యర్థుల్లో అపోహలు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం జారీచేసిన ఏదో ఒక ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరి చేసింది. హాజరుపట్టీలో ఫొటోను.. అభ్యర్థి గుర్తింపు కార్డు, ముఖాన్ని సరిచూసి సంతకం, వేలిముద్ర తీసుకోనున్నారు. పరీక్షకు భారీసంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉండటంతో పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను కమిషన్ ఆదేశించింది. ఓఎంఆర్ పత్రాల్లో అభ్యర్థులు హాల్టికెట్ నంబరు, ప్రశ్నపత్రం కోడ్, పేరు, సంతకం తప్పకుండా పేర్కొనాల్సి ఉంటుంది. గతంలో జరిగిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఇబ్బందులు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. గ్రూప్-4 పరీక్ష హాల్టికెట్లు ఈ రోజు నుంచే కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. జులై 1న పేపర్-1 పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
-
Fake Job Offers: ఫేక్ జాబ్ ఆఫర్స్ గుర్తించడం ఎలా? ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.!
-
Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
-
Shocking: బెడ్షీట్పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
-
Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!