Mirchowk Fire Accident : హృదయవిదారకం.. 17కు చేరిన మృతుల సంఖ్య.. మృతుల్లో 8 మంది చిన్నారులు
- మీర్చౌక్ భారీ అగ్నిప్రమాదంలో 17కి చేరిన మృతుల సంఖ్య
- మృతుల్లో ఎనిమిది మంది చిన్న పిల్లలు
- ఒకటిన్నర ఏండ్లు ఒకరు.. ఏడేళ్లు ఒకరు.. నాలుగు ఏళ్ల లోపు పిల్లలు ఆరుగురు
- మృతుల్లో నలుగురు అరవై ఏళ్ళ నుంచి డెబ్బై ఐదేళ్ల ఏళ్ల వయస్సు వారు
- మృతుల్లో ఐదుగురు ముప్పై నుంచి నలభై ఏళ్ల లోపు వయస్సు వారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mirchowk Fire Accident : హైదరాబాద్లోని పాతబస్తీ మీర్చౌక్లో జరిగిన భారీ అగ్నిప్రమాదం మరింత విషాదాన్ని నింపింది. సహాయక చర్యలు కొనసాగుతుండగా, ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 17కు చేరుకుంది. మృతుల్లో ఎనిమిది మంది చిన్న పిల్లలు ఉండటం హృదయాలను కలిచివేస్తోంది. మృతి చెందిన చిన్నారుల్లో ఒకటిన్నర సంవత్సరం వయస్సున్న ఒకరు, ఏడేళ్ల వయస్సున్న మరొకరు ఉన్నారు. మిగిలిన ఆరుగురు పిల్లలు నాలుగు సంవత్సరాల లోపు వారే కావడం ఈ దుర్ఘటన తీవ్రతను తెలియజేస్తోంది. అంతేకాకుండా, ఈ ప్రమాదంలో నలుగురు వృద్ధులు (60 నుంచి 75 సంవత్సరాల మధ్య వయస్సు ) , ఐదుగురు 30 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఒకేసారి అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.
Fire Accident : మీర్ చౌక్ భారీ అగ్నిప్రమాదంలో 11కి చేరిన మృతుల సంఖ్య
Also Read
- WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్కు డబుల్ ప్రొటెక్షన్!
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
- Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
- India-Iran Trade: ఇరాన్తో చమురు వ్యాపారం.. 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
నిన్న జరిగిన ఈ అగ్నిప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరగడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మంటలు వేగంగా వ్యాపించడం , భవనంలో చిక్కుకున్న వారిని వెంటనే బయటకు తీయలేకపోవడం వల్ల మృతుల సంఖ్య పెరిగింది. ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేయగా, మృతదేహాలను వెలికి తీసే ప్రక్రియ కొనసాగుతోంది. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు, బాధితులకు అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున తక్షణ సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ దుర్ఘటన జరిగిన తీరు , దానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపించాలని స్థానికులు కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Virat Kohli-Bharat Ratna: కోహ్లీకి ‘భారతరత్న’ ఇవ్వాలి .. రిటైర్మెంట్ మ్యాచ్ నిర్వహించాల్సిందే..!
తాజావార్తలు
-
WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్కు డబుల్ ప్రొటెక్షన్!
-
Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
-
The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్బ్యాక్ అవుతాడా?
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!