Fire Accident : మీర్ చౌక్ భారీ అగ్నిప్రమాదంలో 11కి చేరిన మృతుల సంఖ్య
- మీచ్చౌక్లో భారీ అగ్నిప్రమాదంలో 11కి చేరిన మృతుల సంఖ్య
- ఘటనా స్థలానికి వచ్చి బాధిత కుటుంబంతో మాట్లాడిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి
- మృతుల్లో ముగ్గురు చిన్నారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident : నగరంలోని మీర్చౌక్లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదానికి దారితీసింది. మీర్చౌక్ ప్రాంతంలోని ఓ నివాస భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది దాదాపు 10 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇంటి నిర్మాణం తేడాగా ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఊపిరాడక 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో 14 మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా, వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటన సమాచారం అందుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఫైర్ సిబ్బందికి ఆక్సిజన్ సిలిండర్లు లేకపోవడంతో ప్రాణహానికీ కారణమై ఉండొచ్చని పేర్కొన్నారు. రెస్క్యూలో ఆలస్యం జరగడం తీవ్రతను పెంచిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు పూర్తి సహాయం అందించనున్నట్లు హామీ ఇచ్చారు.
Also Read
- Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
- iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
- AP Government Jobs: గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
మృతుల వివరాలు ఇలా ఉన్నాయి
అభిషేక్ మోడీ (30)
ఆరుషి జైన్ (17)
హర్షాలి గుప్తా (7)
షీతల్ జైన్ (37)
రాజేందర్ కుమార్ (67)
సుమిత్ర (65)
మున్నిబాయి (72)
ఇరాజ్ (2)
ఇంకా ముగ్గురి వివరాలు తెలియాల్సి ఉంది.
అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. భవనంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే ప్రమాదానికి దారితీసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం తెలియనున్నాయి.
తాజావార్తలు
-
M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా ‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ ప్రారంభం
-
Social Media Trolling: ఆమ్మో సోషల్ మీడియా.. ఆ సమయంలో వణికిపోయా.. టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
-
Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
-
Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!