Tummala Nageswara Rao: అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదు..
- రోడ్లు, డ్రైనేజ్ లకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన
- అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం నగరంలోని 49 వ డివిజన్ మామిల్లగూడెం లో రోడ్లు, డ్రైనేజ్ లకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ… కమీషనర్ అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చినప్పటికీ పాత పద్ధతిలో కాకుండా భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని నాణ్యత ప్రమాణాల ప్రకారం నిర్మాణాలు చేపట్టండి అని కోరారు. నిర్మాణం చేసేప్పుడు కార్పొరేటర్లు, డివిజన్ పెద్దలు వాటి నిర్మాణంలో నాణ్యత లేకపోతే కమీషనర్ కు సమాచారం ఇవ్వండని సూచించారు.
Also Read:Buggamatham Lands: కాసేపట్లో తిరుపతి బుగ్గమఠం భూముల సర్వే..
Also Read
నిర్మాణం సరిగ్గా జరగకపోతే పందులు, ఈగలు, దోమలు వ్యాపించి రోగాలు దరి చేరతాయని అన్నారు. ఖాళీ స్థలాలు ఎవరైనా శుభ్రం చేయించుకోవాలి, లేనిచో నగర పాలక సంస్థ నుంచి నోటీసులు జారీ చేయండని ఆదేశించారు. రెండు మూడు నోటీసులకు స్పందించకపోతే ఆ స్థలం నగర పాలక సంస్థ పరిధిలోకి వెళ్తుంది ఆ తర్వాత మీరు ఏమి చేయలేరన్నారు. కమీషనర్ ఎక్కడ రాజీ పడకుండా ఖమ్మం నగరం ఆనందమైన నగరంగా తీర్చిదిద్దాలి అని ఆదేశించారు. రోడ్లపై గుడులు, మసీదులు, చర్చ్ లు నిర్మిస్తే వాటి పై మొదటిలోనే చర్యలు తీసుకోవాలన్నారు.
Also Read:Nani: ది ప్యారడైజ్లోకి అడుగు పెట్టేది అప్పుడే!
ప్రధాన రహదారులు నేను చేయగలుగుతా కానీ, డివిజన్ లలో మీరే చూసుకోవాలి.. అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదు, మీరు నాకు ఓటు వేయకపోయినా ఫర్వాలేదు.. నచ్చితే ఓటు వేసి గెలిపించండి, లేదా ఓడించండి. మీ మనసు గెలుచుకుంటే మమ్మల్ని గెలవకుండా ఎవరు ఆపలేరని అన్నారు. నేను గెలిచిన నాటి నుంచి ఎవరి గురించి కూడా నేను పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయలేదు, చేయను కూడ.. ఆర్డీఓ, కమీషనర్ లు మాస్టర్ ప్లాన్ ప్రకారం పని చేసుకుంటూ వెళ్ళండి.. రోడ్లను ఆక్రమించి ఉండేవారిని ఇబ్బంది పెట్టొద్దు, వారికి ఊరి బయట ఇళ్ల స్థలాలు ఇవ్వండి, వారికి ఇల్లు ఇవ్వండి.. రైల్వే స్టేషన్ రోడ్, పొట్టి శ్రీరాములు రోడ్డు చాలా ఇరుకుగా ఉంది వాటిని వెడల్పు చేయాలి.. ఓట్లు వేపించుకునే వారు కానీ, ఓట్లు వేయాలి అనుకునేవారు కానీ సక్రమంగా పని చేస్తే మీకే ఓటు వేస్తారు ప్రజలు అని మంత్రి తుమ్మల వెల్లడించారు.
తాజావార్తలు
-
Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?