Minister Sridhar Babu: మా విజన్ వేరు.. కంపెనీలను హైదరాబాద్ కే పరిమితం చెయ్యం
- విదేశీ పర్యటనపై కొంతమంది సినిమా షో ప్లాప్ అయ్యిందంటున్నారు
- మా విజన్ వాళ్ళ ముందు పెట్టాం
- హైదరాబాద్ వరకే కంపెనీలను పతిమితం చెయ్యం
- ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా కంపెనీలు పెడతాం
- సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం
విదేశీ పర్యటనపై కొంతమంది సినిమా షో ప్లాప్ అయ్యిందని అంటున్నారని.. మా విజన్ వాళ్ళ ముందు పెట్టామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ వరకే కంపెనీలను పతిమితం చెయ్యమని.. ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా కంపెనీలు పెడతామన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. “ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలని మా ఆలోచన. అదే విషయం కంపెనీలకు తెలియజేశాం. దావోస్ లో జరిగిన ఒప్పందాలకు ఒక్కొక్క డిపార్ట్ నుంచి సెల్ ఏర్పటు చేసి Mou లపై ముందుకు వెళ్తున్నాం. మా తరఫున నుంచి అన్ని కంపెనీలకు సహకారం అందిస్తాం. ప్లాప్ షో హిట్ షో అనేది ఎంటర్టెన్మెంట్ షో లో ఉంటుంది. ఒప్పందాలు కుదుర్చుకున్న కంపనీలపై అసూయ ఉండి కామెంట్స్ చేస్తే మేము ఏమి చేయలేము. కేసీఆర్ చైనా కి 15 రోజులు పోయారు.. రూ. 1000 కోట్లు ఒప్పందం చేసుకున్నారు. రూ. 200 కోట్ల పెట్టుబడులు పెట్టారు. మేము ఏమి అనలేదు.” అని మంత్రి వ్యాఖ్యానించారు.
READ MORE: Friday Up Consultancy: బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్ వేర్ కంపెనీ.. ట్రైనింగ్ పేరుతో మోసం
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
నెగటివ్ గా చూస్తే నెగటివ్ గానే కనిపిస్తాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. Mou లకు పరిమితం కామని.. కంపనీలతో నిత్యం టచ్ లో ఉంటామన్నారు. టెక్నాలజి పరంగా ఎవరు ముందుకు వచ్చిన ఆహ్వానం పలుకుతామని స్పష్టం చేశారు. ఏ కుటుంబం వాళ్ళు కొత్త టెక్నాలజి తో వచ్చిన mou కుదుర్చుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు 19 సంస్థలతో రూ.31,500 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నామని మంత్రి వివరించారు. ఈ పెట్టుబడుల ద్వారా 30,750 ఉద్యోగాలు వచ్చే అవకాశముందన్నారు. ‘‘దక్షిణ కొరియాలో దాదాపు 12 సంస్థలతో చర్చలు జరిపాం. ఏఐ, ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులపై చర్చించాం. మూసీ పునరుజ్జీవం కోసం కొన్ని అధ్యయనాలు చేశాం. మూసీ సుందరీకరణపై ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడితో చర్చించాం. రాష్ట్రంలో బయోడిజైర్ సిటీని ఏర్పాటు చేయాలని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీని కోరాం’’ అని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో