Ramantapur Incident Ex-Gratia: మృతులకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన!
- చనిపోయిన ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా
- గాయపడ్డ వారికి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది
- మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramantapur Incident Ex-Gratia: హైదరాబాద్ రామంతపూర్ గోఖలే నగర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల కారణంగా జరిగిన ఘోర విషాద ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శ్రీకృష్ణుడి విగ్రహ శోభాయాత్రలో రథానికి విద్యుత్ తీగలు తాకడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలవిస్తున్నారు. మరోవైపు పరిస్థితి విషమంగా ఉన్న వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద తమవారి కోసం ఎదురుచూస్తున్నారు.
Coolie 4 days box office collections : కూలీ 4 డేస్ కలెక్షన్స్.. ఇంకా చాలా రావాలి
Also Read
- YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
- Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
- Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
ఇకపోతే, తెలంగాణ ప్రభుత్వం చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు మృతుల కుటుంబాలను కలిసి వారికి భరోసా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. చనిపోయిన ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, గాయపడ్డ వారికి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఈ సంఘటన జరగడం చాలా బాధాకరం అని అయన అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరో 100 మీటర్ల దూరంలో శోభయాత్ర ముగుస్తుండగా ఘటన జరగడం దురదృష్టకరం అని ఆవేదన తెలిపారు.
R Madhavan: అంకుల్ అని పిలిస్తే అంగీకరించాల్సిందే !
ఈ ఘటనలో కేబుల్ వైర్ ద్వారా కరెంట్ సరఫరా జరిగి ప్రమాదం జరిగినట్లుగా అధికారులు చెప్తున్నారని తెలిపారు. ఈ విషయమై హైదరాబాద్ కలెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశామని ఆయన అన్నారు. ఇక రిపోర్టు వచ్చాక తదుపరి చర్యలు చేపడతామని ఆయన అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేబుల్ వైర్లు కరెంటు తీగలపై స్పెషల్ డ్రైవ్ కు ఆదేశాలు జారీ చేశామని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్… స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
-
TATA Sierra EV: టాటా సియెర్రా ఈవీ రిలీజ్ కు రెడీ..! 500KM రేంజ్, ప్రీమియం ఫీచర్లు
-
Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
-
Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
ట్రెండింగ్
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..