మేడారం జాతరపై మంత్రి సీతక్క అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరను జయప్రదం చేస్తామన్నారు. ఫిబ్రవరి 21 నుండి జాతర ప్రారంభం అవుతుందని సీతక్క తెలిపారు. ఇప్పటికే రూ.75 కోట్ల నిధులు సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశారని పేర్కొ్న్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర సైతం మేడారం దేవతల సన్నిధి నుండే ప్రారంభించారని మంత్రి అన్నారు. మేడారం జాతర కోసం అడగ్గానే నిధులు కేటాయించారని మంత్రి సీతక్క పేర్కొన్నారు. అవసరమైన మేరకు మరిన్ని నిధులు ప్రభుత్వాన్ని కోరుతామన్నారు.
Read Also: Bigg Boss 7 Grand Finale :బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ రైతు బిడ్డదే..
మా ఇంటి ఇలవేల్పు మేడారం తల్లులు అని అన్నారు. జాతరపై అధికారులకు అన్ని సూచనలు చేశాం.. జాతర విజయవంతం కోసం ప్రణాళిక రూపొందించామని మంత్రి తెలిపారు. కాంట్రాక్ట్ పనులను అవినీతి లేకుండా పూర్తి చేస్తాం.. శాశ్వత ప్రాతిపదికన చేస్తామని మంత్రి పేర్కొన్నారు. కేంద్రానికి కొన్ని పనుల కోసం ప్రతిపాదనలు పంపాము.. మేడారం జాతరకు జాతీయ హోదా కోసం రిక్వెస్ట్ పంపుతున్నామని తెలిపారు. అందరూ సహకరించి జాతరను విజయవంతం చేయాలని మంత్రి సీతక్క కోరారు.
Read Also: PM Modi: మంచి మనసు చాటుకున్న ప్రధాని మోడీ.. కాన్వాయ్ను ఆపి..!