Minister RK Roja: వ్యాక్సిన్ కనిపెట్టారు సరే.. కొడుకును కూడా గెలిపించుకోలేరా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి ఆర్ కె రోజా. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబును రెండు రాష్ట్రాల ప్రజలు తిరస్కరించారు. ఆంధ్రాలో ప్రతిపక్షంగా కూడా ఉండలేక ఖమ్మం వెళ్లి మాట్లాడుతున్నారు. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు తట్టుకోలేక తెలంగాణలో పార్టీ పెట్టాలనుకుంటున్నారేమో అన్నారు రోజా. ఖమ్మం నా గుమ్మం అన్నారు… మీకు జీవితాన్నిచ్చిన కుప్పం ప్రజలకు ఏం చెబుతారు? అని మంత్రి రోజా ప్రశ్నించారు.
Read Also: Niranjan Reddy: కల్లాలు కట్టడం నేరమా..? తెలంగాణపై కేంద్రం కక్ష కట్టింది.
Also Read
- BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
- Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
- Jinping: బ్రిక్స్ సదస్సుకు వస్తున్న జిన్పింగ్.. సోషల్ మీడియాలో చైనా పోస్ట్
- Red Fort Blast: ఎర్రకోట ఉగ్రదాడి కేసు.. హిందూ ఆలయమే తొలి టార్గెట్..?
చంద్రబాబుకు మతిభ్రమించింది. సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను అని చంద్రబాబు అంటాడు. నిన్న ఏకంగా కరోనాకు వ్యాక్సిన్ నేనే కనిపెట్టాను అన్నాడు… ఇన్ని కనిపెట్టిన చంద్రబాబుకు కొడుకు లోకేష్ ను గెలిపించుకోడం తెలియదా? అని రోజా హేళన చేశారు. ఖమ్మంలో సభపై ఇటు వైసీపీ నేతలు, అటు బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీలో చెల్లని రూపాయి.. తెలంగాణలో చెల్లుతుందా? అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆర్థిక మంత్రి హరీశ్రావు సెటైర్లు వేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, అభివృద్ధి చేయలేక అక్కడి ప్రజల చేతుల్లో ఛీత్కారానికి గురై ఇప్పుడు తెలంగాణను అభివృద్ధి చేస్తాననడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. . ఏపీ ప్రజలే పాలన బాగాలేదని చిత్తుచిత్తుగా ఓడించి వెళ్లగొడితే.. ఇక్కడికి వచ్చి ఏం చేస్తారన్నారు హరీష్ రావు.నల్లగొండలో ఫ్లోరోసిస్ను పారద్రోలింది తానేనని చంద్రబాబు అంటున్నాడని, ఇంతకన్నా పెద్ద జోక్ ఉందా? అని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు.
Read Also: Gandhi Bhavan Hitension: డిగ్గీరాజా సాక్షిగా గాంధీభవన్ లో డిష్యుం డిష్యుం
తాజావార్తలు
-
BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
-
Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
-
Jinping: బ్రిక్స్ సదస్సుకు వస్తున్న జిన్పింగ్.. సోషల్ మీడియాలో చైనా పోస్ట్
-
Red Fort Blast: ఎర్రకోట ఉగ్రదాడి కేసు.. హిందూ ఆలయమే తొలి టార్గెట్..?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?