Gandhi Bhavan Hitension: డిగ్గీరాజా సాక్షిగా గాంధీభవన్ లో డిష్యుం డిష్యుం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ లో నిత్యం వివాదాలే… నేతల మధ్య యుద్ధాలే. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఉన్న విబేధాలు గాంధీభవన్ సాక్షిగా బహిర్గతమయ్యాయి. అదికూడా కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ వచ్చినప్పుడే.. ఆయన ఎదుటే డిష్యుం డిష్యుం. హస్తం నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు వచ్చిన సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఎదుటే కాంగ్రెస్ నేతలు రెచ్చిపోవడం హాట్ టాపిక్ అవుతోంది. గాంధీభవన్లో ఒకరినొకరు కాలర్లు పట్టుకుని వాగ్వాదానికి దిగడంతో అవాక్కవ్వడం దిగ్విజయ్ వంతైంది.
Also Read
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
- Tamballapalle MLA: చావడానికైనా, చంపడానికైనా సిద్ధం.. తంబళ్లపల్లె ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
- Tim David: నీకు ఫైన్ వేయడంలో ఏమాత్రం తప్పు లేదయ్యా.. గ్రౌండ్ లోనే సిగార్ తాగుతూ రచ్చ రచ్చ.!
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
గాంధీభవన్లో ఎన్ఎస్యూఐ విద్యార్థి నేతలతో అనిల్కుమార్ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అనిల్కుమార్పై ఎన్ఎస్యూఐ విద్యార్థి నేతలు దాడికి ప్రయత్నించారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డినే తిడతావా అంటూ అనిల్పై ఎన్ఎస్యూఐ నేతలు దాడి చేశారు. ఈ సందర్భంగా జై కాంగ్రెస్.. సేవ్ కాంగ్రెస్, దొంగల నుంచి పార్టీని కాపాడాలంటూ వారంతా నినాదాలు చేశారు. అనంతరం, అనిల్ కుమార్ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. దీంతో, గాంధీభవన్లో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది. అక్కడేం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు.
Read Also: Sudigali Sudheer: గాలోడు గట్టి ఆఫర్ నే పట్టేశాడే..?
ఈ ఘటన పై కాంగ్రెస్ నేత మల్లురవి స్పందించారు. గాంధీభవన్ లో జరిగిన విషయాలు దిగ్విజయ్ సింగ్ దృష్టికి తీసుకువెళ్తాం అన్నారు. ఓయూ విద్యార్థుల అంశాలు పార్టీ దృష్టిలో ఉన్నాయి. వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత దూషణలు చేయవద్దు. అన్ని సమస్యలపై కూర్చుని మాట్లాడుకుందాము అని కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే… గాంధీభవన్ కి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఎవరూ లేరన్నారు.
దిగ్విజయ్ సింగ్కు కొన్ని సలహాలు ఇచ్చాను. ఆయన కూడా మాకు కొన్ని సలహాలు ఇచ్చారు. అందరం కలిసి రెండు రోజుల్లో మీ ముందుకు వస్తాం అన్నారు. కాంగ్రెస్ నేతలంతా ఐకమత్యంతో ముందుకు వెళ్తాం అన్నారు. పార్టీలో ఇలాంటివి మామూలే.. అన్నీ సామరస్యంగా పరిష్కారం అవుతాయన్నారు జానారెడ్డి.గాంధీభవన్లో గొడవ విషయంలో విజయ్ తొందర పడ్డాడు. అలా జరగకుండా ఉండాల్సింది..అందరినీ సమన్వయ పరిచేందుకే దిగ్విజయ్ సింగ్ వచ్చారన్నారు జానారెడ్డి.
Read Also: Venkaiah Naidu: తెన్నేటి విశ్వనాథం అందరికీ ఆదర్శం
తాజావార్తలు
-
Ntv Exclusive: ‘పెద్ది’తో రామ్ చరణ్ విశ్వరూపం.. కంటతడి పెట్టించేశాడట!
-
Stock Market Crash: కుప్పకూలిన షేర్ మార్కెట్.. సెన్సెక్స్ 1100 పాయింట్లు పతనం.. లక్షల కోట్లు గాల్లోనే!
-
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ ఆఫర్.. ఈ తరహా మెసేజీలు వస్తున్నాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
-
Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
-
PEDDI Hikes : పెద్ది తెలంగాణ టికెట్ ధరల పెంపు.. జీవో వెనుక చక్రం తిప్పిన టాలీవుడ్ బడా నిర్మాత
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!