Minister RK Roja: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు.. బాబుపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister RK Roja: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తోన్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి ఆర్కే రోజా.. ఎన్టీఆర్ పేరు చెప్పుకుని మళ్లీ అధికారంలోకి రావాలని చంద్రబాబు ఆలోచన అంటూ ఫైర్ అయ్యారు.. ఎన్టీఆర్ జిల్లా అని చెప్పే చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు ఏం చేయలేదన్నారు.. ఒక్క జిల్లాకు లేదా మండలానికి కూడా ఎన్టీఆర్ పేరు పెట్టలేదు.. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి, పార్టీ గుర్తు, పార్టీ లాక్కున్న వ్యక్తి చంద్రబాబు.. పార్టీ డిపాజిట్లు కూడా లాక్కున్నారు అంటూ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు..
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
అసెంబ్లీలో ఎన్టీఆర్కి మైక్ ఇవ్వకుండా ఆయన చావుకు చంద్రబాబు కారణం అయ్యారు అని విమర్శించారు మంత్రి రోజా.. ఇన్ని చేసి ఇప్పుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు చేయటం హాస్యాస్పదమన్న ఆమె.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎన్టీఆర్ కుటుంబం చంద్రబాబుకి గుర్తు వస్తారని ఎద్దేవా చేశారు.. కానీ, అధికారంలో ఉంటే వాళ్లని బాబు పట్టించుకోరన్నారు. ఇపుడు శత జయంతి ఉత్సవం పేరిట హడావిడి చేస్తున్నారు.. ఎన్టీఆర్ పుట్టిన ప్రాంతంలో అభివృద్ధి పనులు చేయటమే కాకుండా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటూ ప్రశంసలు కురిపించారు మంత్రి ఆర్కే రోజా.
Read Also: Drug Prevention: మాదక ద్రవ్యాల నివారణపై సీఎం ఫోకస్.. కీలక ఆదేశాలు
ఇక, మధ్య ప్రధాని నరేంద్ర మోడీపై చంద్రబాబు పొగడ్తల వర్షంపై స్పందించిన మంత్రి రోజా.. గతంలో మోడీ గురించి చంద్రబాబు నీచంగా మాట్లాడారు.. భార్యను చూడని వాడు.. దేశాన్ని చూస్తాడా? అని మోడీని విమర్శించారు చంద్రబాబు.. అంతేకాదు నరేంద్ర మోడీని గద్దె దించటం కోసం రాహుల్ గాంధీతో జత కట్టారు.. అయితే, తాజాగా మోడీ విజన్ ఉన్న నాయకుడు అని సిగ్గు లేకుండా పొగడ్తలు గుప్పిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.. చంద్రబాబు అవసరం కోసం ఏదైనా చేస్తారని మండిపడ్డారు. వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు అధికారంలోకి వస్తే కొనసాగిస్తామని బాబు చెబుతున్నారు.. దీన్ని బట్టే జగన్ పాలన బేష్ అని చంద్రబాబు ఒప్పుకున్నారని వ్యాఖ్యానించారు మంత్రి ఆర్కే రోజా.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!