Minister Ponguleti: రైతులకు గుడ్ న్యూస్..రుణమాఫీ, వడ్లకు రూ.500 బోనస్పై మంత్రి ప్రకటన
- రైతులు తీసుకొచ్చిన పత్తిలో కోత విధిస్తే సహించబోం
- అర్హులైన రైతులకు డిసెంబర్ లోపే రుణమాఫీ అమలు
- వరికి సన్నరకం వడ్లకు రూ.500 బోనస్
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Ponguleti Srinivas Reddy: రైతులు తీసుకొచ్చిన పత్తిలో కోత విధిస్తే సహించబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. వేబ్రిడ్జి కాటాలో తేడా వస్తే మిల్లు సీజ్ చేయిస్తామన్నారు. ఈ సంవత్సరం అధిక వర్షాలతో పత్తి పంట నష్టపోయారని చెప్పారు. రెండు లక్షల ఎకరాల్లో 20 టన్నుల పంట ఉత్పత్తి అవుతుందని.. తొమ్మిది సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. మద్దతు ధర ఇవ్వడంతో పాటు తేమ 12 శాతం ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఇది రైతుల పక్షపాత ప్రభుత్వమని అన్నారు. రైతుకు ఎక్కడ ఇబ్బంది కలగొద్దని విప్లవాత్మక మార్పులు చేశామని చెప్పారు.
Read Also: Bandi Sanjay: కేటీఆర్ లీగల్ నోటీసులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానం
Also Read
ఇప్పటికే 18వేల కోట్ల రుణమాఫీ చేశామన్న ఆయన.. రుణమాఫీపై ప్రతిపక్షాలు కారుకూతలు కూస్తున్నాయన్నారు. అర్హులైన రైతులందరికీ తల తాకట్టు పెట్టైనా రుణమాఫీ చేస్తామన్నారు. డిసెంబర్ లోపే 13 వేల కోట్ల రుణమాఫీ అమలు చేస్తామని చెప్పారు. అర్హులైన పేదలకు అందరికీ ఇందిరమ్మ ఇళ్ళు దీపావళి కానుకగా ఇవ్వబోతున్నామన్నారు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఇల్లు కట్టించారో ఇప్పుడు కూడా అలాగే ఇస్తామన్నారు. వరికి సన్నరకం వడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పాము, ఇవ్వబోతున్నామని వెల్లడించారు. ధాన్యంలో తేమ శాతం కోసం ఎండబెట్టుకుని తీసుకుపోవాలన్నారు. సీసీఐ నామ్స్ ప్రకారం రైతులు పత్తిని తీసుకురావాలన్నారు. ఒక్క కేజీ తరుగు తీయొద్దన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. రైతులు ఫిర్యాదు చేస్తే అధికారుల మీద చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు ఎక్కడ నష్టం కలుగకుండా చూడాలన్నారు. రైతుల అవసరం, కష్టాలు తీర్చాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.
తాజావార్తలు
-
Iran: మసీదుల్లో ఆయుధ శిక్షణ.. 3 కోట్ల మంది పేర్లు నమోదు..
-
Bhojshala Case: “భోజ్శాల ఆలయం కాదు”.. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
-
Full Body Checkup : 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు మిస్ అయితే రిస్క్.!
-
Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
-
VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. ఛీప్ గెస్ట్లు వీరే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..