Minister Ponguleti: రైతులకు గుడ్ న్యూస్..రుణమాఫీ, వడ్లకు రూ.500 బోనస్పై మంత్రి ప్రకటన
- రైతులు తీసుకొచ్చిన పత్తిలో కోత విధిస్తే సహించబోం
- అర్హులైన రైతులకు డిసెంబర్ లోపే రుణమాఫీ అమలు
- వరికి సన్నరకం వడ్లకు రూ.500 బోనస్
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Ponguleti Srinivas Reddy: రైతులు తీసుకొచ్చిన పత్తిలో కోత విధిస్తే సహించబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. వేబ్రిడ్జి కాటాలో తేడా వస్తే మిల్లు సీజ్ చేయిస్తామన్నారు. ఈ సంవత్సరం అధిక వర్షాలతో పత్తి పంట నష్టపోయారని చెప్పారు. రెండు లక్షల ఎకరాల్లో 20 టన్నుల పంట ఉత్పత్తి అవుతుందని.. తొమ్మిది సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. మద్దతు ధర ఇవ్వడంతో పాటు తేమ 12 శాతం ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఇది రైతుల పక్షపాత ప్రభుత్వమని అన్నారు. రైతుకు ఎక్కడ ఇబ్బంది కలగొద్దని విప్లవాత్మక మార్పులు చేశామని చెప్పారు.
Read Also: Bandi Sanjay: కేటీఆర్ లీగల్ నోటీసులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానం
Also Read
- రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
- MP: ‘సారీ అమ్మా, నాన్న.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు’.. కన్నీరు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ నోట్
- SL vs WI: కెప్టెన్గా కుసాల్ మెండిస్ బోణి.. వెస్టిండీస్పై శ్రీలంక ఘన విజయం.!
- Virat Kohli: ఫైనల్ తర్వాత వైభవ్ను వెతుక్కుంటూ వెళ్లిన కోహ్లీ.. ఏం సలహా ఇచ్చాడో చూడండి..(వీడియో)
ఇప్పటికే 18వేల కోట్ల రుణమాఫీ చేశామన్న ఆయన.. రుణమాఫీపై ప్రతిపక్షాలు కారుకూతలు కూస్తున్నాయన్నారు. అర్హులైన రైతులందరికీ తల తాకట్టు పెట్టైనా రుణమాఫీ చేస్తామన్నారు. డిసెంబర్ లోపే 13 వేల కోట్ల రుణమాఫీ అమలు చేస్తామని చెప్పారు. అర్హులైన పేదలకు అందరికీ ఇందిరమ్మ ఇళ్ళు దీపావళి కానుకగా ఇవ్వబోతున్నామన్నారు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఇల్లు కట్టించారో ఇప్పుడు కూడా అలాగే ఇస్తామన్నారు. వరికి సన్నరకం వడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పాము, ఇవ్వబోతున్నామని వెల్లడించారు. ధాన్యంలో తేమ శాతం కోసం ఎండబెట్టుకుని తీసుకుపోవాలన్నారు. సీసీఐ నామ్స్ ప్రకారం రైతులు పత్తిని తీసుకురావాలన్నారు. ఒక్క కేజీ తరుగు తీయొద్దన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. రైతులు ఫిర్యాదు చేస్తే అధికారుల మీద చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు ఎక్కడ నష్టం కలుగకుండా చూడాలన్నారు. రైతుల అవసరం, కష్టాలు తీర్చాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.
తాజావార్తలు
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
MP: ‘సారీ అమ్మా, నాన్న.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు’.. కన్నీరు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ నోట్
-
SL vs WI: కెప్టెన్గా కుసాల్ మెండిస్ బోణి.. వెస్టిండీస్పై శ్రీలంక ఘన విజయం.!
-
Bed Bugs: మీ పరుపుల్లో నల్లులు నిద్ర పోతున్నాయా? పైసా ఖర్చు లేకుండా నల్లులకు ఇలా శాశ్వతంగా చెక్ పెట్టండి!
-
Virat Kohli: ఫైనల్ తర్వాత వైభవ్ను వెతుక్కుంటూ వెళ్లిన కోహ్లీ.. ఏం సలహా ఇచ్చాడో చూడండి..(వీడియో)
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!