Peddireddy Ramachandra Reddy: ఈ పాపమంతా చంద్రబాబుదే.. అనుభవించక తప్పదు..
Peddireddy Ramachandra Reddy: చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పైచంద్రబాబు నాయుడు రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ల్యాండ్ ఓనర్లకు మంచి చేయడానికి జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చారని మంత్రి చెప్పారు. చిలువలు పలువులుగా మాట్లాడుతూ స్వప్రయోజనానికి తీసుకొచ్చారంటున్నారని ఆయన ఆగ్రహించారు. రాష్ట్రమంతా జగన్మోహన్ రెడ్డి భూములంతా తీసుకుంటాడా.. ఇలాంటి మాటలు విపక్షాలకు తగవన్నారు.
ఈ యాక్ట్ పేదల కోసం ల్యాండ్ రైట్స్ ప్రొటెక్షన్ కోసమే తెచ్చామన్నారు. ఈ యాక్ట్ను ఇంప్లిమెంట్ చేస్తాం తప్ప రద్దు చేయమన్నారు. చంద్రబాబు నాయుడు వచ్చేది లేదు.. ఈ యాక్ట్ రద్దు చేసేది లేదన్నారు. చంద్రబాబు నాయుడు ఒకటో సంతకం, రెండో సంతకం అంటున్నారని ఎద్దేవా చేశారు. పెన్షన్లు అందక ఓ వృద్ధుడు గ్రామ సచివాలయానికి వెళ్లి వడదెబ్బతో చనిపోయాడని.. ఈ పాపాలన్నీ చంద్రబాబు నాయుడు వల్లే జరుగుతున్నాయన్నాని విమర్శించారు. వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదని ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసి ఆపించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. కుట్రపూరితంగా నిమ్మగడ్డ రమేష్తో ఈ పిటిషన్ వేయించారని.. ఈ పాపమంతా చంద్రబాబుకే చెందుతుందని ఆరోపించారు.
Also Read
- RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
- DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
Read Also: Tirumala: తిరుమలలో భారీ వర్షం.. చల్లబడిన వాతావరణం
చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కేవలం 34 లక్షల పెన్షన్లు మాత్రమే ఇచ్చేవారని.. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 66 లక్షల పెన్షన్లు ఇచ్చారన్నారు. 66 లక్షల మందికి ఏకకాలంలో బ్యాంకుల్లో పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండదన్నారు. వాలంటరీల వ్యవస్థ ఉంటే ఎంతో సౌలభ్యంగా ఇంటి వద్ద పెన్షన్లు పంపిణీ చేశామన్నారు. వాలంటీర్లు వ్యవస్థ లేకపోవడంతో వృద్ధులంతా ఎండలకు పిట్టలు రాలిపోయినట్లు రాలిపోతున్నారని మంత్రి చెప్పారు. ఈ పాపమంతా చంద్రబాబు నాయుడుదేనని.. తప్పనిసరిగా ఈ ప్రాయశ్చితాన్ని ఆయన అనుభవించక తప్పదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
-
Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
-
Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!