Minister Narayana: 3 వారాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభం.. మంత్రి నారాయణ కీలక సమీక్ష
- మూడు వారాల్లో అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తాం
- గతంలో మాదిరిగా రూ. 5కే అన్న క్యాంటీన్లల్లో భోజనం..టిఫిన్లు
- అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై మంత్రి నారాయణ సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. మూడు వారాల్లో అన్న క్యాంటీన్లని ప్రారంభించేలా కార్యాచరణకు మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. ఇప్పుడు కూడా గతంలో మాదిరిగా రూ. 5కే అన్న క్యాంటీన్లల్లో భోజనం, టిఫిన్లు ఏర్పాటు చేస్తామన్నారు. 203 అన్న క్యాంటీన్లకు గత టీడీపీ ప్రభుత్వం అనుమతించిందని, వీటిలో చాలా వరకు భవనాల నిర్మాణం జరిగిందన్నారు. అన్ని రకాల సౌకర్యాలు కల్పించామన్నారు. గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లని వేరే అవసరాలకు వినియోగించుకుందన్నారు. కండిషన్లో లేని నాటి అన్న క్యాంటీన్ల భవనాలను రెన్నోవేట్ చేయాలని ఆదేశించామన్నారు. రూ. 73కు మూడు పూటల భోజనం పెడతామని ఇస్కాన్ చెప్పిందన్నారు. కానీ మేం పేదలను దృష్టిలో పెట్టుకుని సబ్సిడీపై రూ. 5 భోజనం పెట్టామని మంత్రి పేర్కొన్నారు.
Read Also: Minister Satya Kumar: వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సత్య కుమార్ యాదవ్.
Also Read
రూ. 58 మేం ఇస్కాన్కు నాటి టీడీపీ ప్రభుత్వం తరపున చెల్లించిందన్నారు. అప్పట్లో రోజుకు 2.25 లక్షల మంది భోజనం చేసేవారని.. టీడీపీ హయాంలో 4.25 కోట్ల మంది అన్న క్యాంటీన్లను సద్వినియోగం చేసుకున్నారన్నారు. ఇస్కాన్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఇస్కాన్ కే అన్న క్యాంటీన్ల నిర్వహణ బాధ్యత ఇవ్వొచ్చా..? లేదా.. వేరే టెండర్లను పిలవాలా..? అనే అంశంపై చర్చిస్తున్నామన్నారు. మూడు వారాల్లో అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామన్నారు. తొలి విడతలో 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించగలమని ఇస్కాన్ ప్రతినిధులు చెప్పారన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఇస్కాన్ సంస్థకున్న సెంట్రలైజ్డ్ కిచెన్స్ కూడా ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లాయని విమర్శించారు.
తాజావార్తలు
-
PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!