Minister Narayana: డిసెంబర్ మొదటి వారం నుంచి అమరావతి నిర్మాణ పనులు
- రాజధాని పరిధిలోని ఏడీసీ నర్సరీలను పరిశీలించిన మంత్రి నారాయణ
- అమరావతిలో 4 పెద్ద పార్కులు వుంటాయని మంత్రి వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని ఏడీసీ నర్సరీలను మంత్రి నారాయణ పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రూ. 41వేల కోట్లతో అమరావతికి గతంలో టెండర్లు ఇచ్చామని.. గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడి అమరావతిని నిర్వీర్యం చేసిందని ఆయన మండిపడ్డారు. అమరావతి పనుల కోసం రూ. 5000 కోట్లు కూడా చెల్లించామన్నారు. లండన్ సంస్థ నార్మన్ పోస్టర్ వారితో డిజైన్ చేయించామని.. రూ. 36 కోట్లతో కంప తొలగింపు చేపట్టామని.. 50 శాతం తొలగించామని మంత్రి తెలిపారు. అమరావతిలో 4 నర్సరీలను డెవలప్ చేశామని.. అక్కడి చెట్లు చాలా పెద్దవి అయిపోయాయన్నారు.
Read Also: Andhra Pradesh: బదిలీలకు గైడ్ లైన్స్ జారీ చేస్తున్న వివిధ శాఖలు
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
అమరావతిలో 4 పెద్ద పార్కులు వుంటాయని మంత్రి నారాయణ వెల్లడించారు. శాఖమూరు సెంట్రల్ పార్కు 300 ఎకరాల్లో, అనంతవరం రీజినల్ పార్క్ 35 ఎకరాలు, మల్కాపురం 25 ఎకరాలు నర్సరీలు డెవలప్ చేశామన్నారు. 2 వాటర్ లేక్లు కూడా డెవలప్ చేస్తున్నామన్నారు. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్లకు రెండు వైపులా బఫర్ జోన్ వస్తుందని.. అక్కడ ట్రీ ప్లాంటేషన్ కూడా చేస్తామన్నారు. మంచి వాతావరణం అమరావతిలో ఉండేలా చర్యలు ఉన్నాయన్నారు. టెండర్లు ఇంతవరకు చేసిన పనులతో క్లోజ్ చేస్తామన్నారు.
అమరావతి పనులు డిసెంబర్ మొదటి వారం నుంచి మొదలు పెట్టే అవకాశం ఉందన్నారు. అమరావతి నిర్మాణం ఆగిపోయి 5 ఏళ్లు అయిందన్నారు. శాఖమూరిలోని అంబేద్కర్ స్మృతి వనం అంశం ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అంబేద్కర్ స్మృతి వనం కోసం గతంలో టెండర్లు పిలిచామన్నారు. కొంతపని జరిగాక కూడా గత ప్రభుత్వం నిలిపేసిందని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!