Minister Meruga : నీకు పేదల పల్లెల్లో తిరిగే హక్కు లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో అమరావతి ఆర్ 5 జోన్ వివాదం ప్రస్తుతం కాకరేపుతోంది. అమరావతిలో పేదలకు ఇళ్ల స్ధలాలు ఇచ్చేందుకు ఆర్ 5 జోన్ ఏర్పాటు చేయడమే కాకుండా దీనిపై కోర్టుల్లోనూ విజయం సాధించిన వైసీపీ సర్కార్ ఇప్పుడు విపక్షాలపై విరుచుకుపడుతుంది. ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్ల స్ధలాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న చంద్రబాబును వైసీపీ మంత్రులు టార్గెట్ చేస్తున్నారు. గతంలో అమరావతిని స్మశానం అంటూ చేసిన వ్యాఖ్యలపైనా వివరణ ఇస్తున్నారు. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో, ఇన్నాళ్లూ పేదల పట్ల, బడుగుల పట్ల ప్రదర్శించిన నిరంకుశమైన ఆలోచనసరళికి తగిన సమాధానం చెప్పిన తర్వాతనే, ఆయన పేదల పల్లెల్లో పర్యటించాలని మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు.
Also Read : Etela Rajender : నేను పార్టీలు మారే వ్యక్తిని కాదు.. బీజేపీ హై కమాండ్ తెలంగాణపై సీరియస్గా ఉంది
Also Read
- Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
- Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
- iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
- Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి రాజధాని మొత్తాన్ని శ్మశానమని అనలేదని మరో మంత్రి మేరుగు నాగార్జున ఇవాళ క్లారిటీ ఇచ్చారు. మంత్రి శ్మశానమని ఏ ఆలోచనలతో ఏం మాట్లాడారో అన్నది ఒక ఎత్తు అయితే చంద్రబాబు డెమోగ్రాఫికల్ సమతుల్యత ఇబ్బంది అవుతుందని అన్నది మరో ఎత్తని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తే కోర్టులకు వెళ్లి ఎందుకు అడ్డుకుంటున్నారంటూ మంత్రి మేరుగ ప్రశ్నించారు. ఆర్ 5 జోన్ లో ఇళ్లస్థలాలు ఇచ్చే వారంతా ఈ ప్రాంత లబ్దిదారులే అన్నారు. ఇక్కడి నుంచే విజయవాడ -గుంటూరు ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకుంటున్నారని మంత్రి నాగార్జున వెల్లడించాడు. ఇక్కడ ఇళ్లస్థలాలు పొందే లబ్దిదారులంతా రాత్రిపూట ఇక్కడే నివాసం ఉంటున్నారన్నారు.
Also Read : Ukraine War: ఉక్రెయిన్పై రష్యా క్షిపణుల వర్షం..
పేదలకు ఇంటి జాగా ఇవ్వడంపై స్వయంగా సుప్రీంకోర్టు మొట్టికాయలేసినా కూడా… చంద్రబాబు ఫ్యూడలిజం మనస్తత్వంలో ఎక్కడా మార్పు రాలేదని మంత్రి మేరుగు ఆరోపించారు. పేదవాళ్లకు ప్రభుత్వం ఇచ్చే భూమిని సమాధులతో పోల్చాడన్నారు. ఈ మాట మాట్లాడటానికి ఆయనకు నోరెలా వచ్చింది.. ఏంటి, నీ అహంకారం..? అని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ప్రశ్నించారు. పేదవారిని, బడుగుల జీవితాలను హేళన చేస్తూ, అనేక సందర్భాల్లో చంద్రబాబు మాట్లాడాడు అంటూ ఆరోపించాడు. ఆఖరికి పేదవాళ్ల ఇంటి స్థలాన్ని సమాధులతో పోల్చిన చంద్రబాబును ఎక్కడికెళ్లినా పేదలంతా నిలదీయమని మంత్రి మేరుగు పిలుపునిచ్చారు.
- Tags
- Amaravati
- ap
- botsa
- Minister Meruga
- tdp
తాజావార్తలు
-
Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
-
Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
-
Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
-
Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!