KTR: బీఆర్ఎస్ సీఎం అభ్యర్థి కేసీఆరే.. కాంగ్రెస్, బీజేపీ వారి అభ్యర్థి చెప్పగలరా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ సీఎం అభ్యర్థి కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ చిట్ చాట్ లో అన్నారు. కాంగ్రెస్, బీజేపి పార్టీల సీఎం అభ్యర్థి ఎవరో చెప్పగలరా అని ప్రశ్నించారు. తాజాగా కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆ పార్టీకి రాజీనామా చేశారని.. పొన్నాల బీఆర్ఎస్లోకి వస్తానని అంటే వారి ఇంటికి వెళతానని తెలిపారు. ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధమన్నారు. రాహుల్ గాంధీ లీడర్ కాదు, రాసింది చదివే రీడర్ మాత్రమేనని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ డిజిట్ దాటదని.. ఆ పార్టీ 110 స్థానాల్లో డిపాజిట్ కోల్పోతుందని మంత్రి కేటీఆర్ అన్నారు.
Read Also: Sree leela: అందుకే డాక్టర్ అవ్వాలని ఫిక్సయ్యా.. ఎన్ని కష్టాలు వచ్చినా డాక్టర్ శ్రీలీల అనిపించుకుంటా!
Also Read
మరోవైపు పెండింగ్ అభ్యర్థుల 5 స్థానాలను మూడు నాలుగు రోజుల్లో ప్రకటిస్తామని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే ప్రకటించిన తమ అభ్యర్థులు ప్రజల్లో ఉన్నారని.. ప్రచారంలో దూసుకుపోతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి 40 చోట్ల అభ్యర్థులు లేరని.. కానీ 70 స్థానాల్లో గెలుస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని పేర్కొన్నారు. అది చూసి ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. గ్రేటర్ లో 20 స్థానాల్లో కాంగ్రెస్ కు అభ్యర్థులు లేరని అన్నారు. మరోవైపు ఈరోజు కర్ణాటకలో రూ.42 కోట్లు దొరికాయని.. తమకు ఉన్న సమాచారం ప్రకారం 8 కోట్లు కొడంగల్ లో రేవంత్ రెడ్డికి అందాయని ఆరోపించారు. నోట్ల కట్టలతో తెలంగాణ ప్రజలను అంగట్లో సరుకుల కొనాలని కాంగ్రెస్ అనుకుంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
Read Also: Winter Season : చలికాలంలో పండించే కూరగాయల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
బీఆర్ఎస్ ప్రభుత్వం సెక్యులర్ ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ అన్నారు. మైనార్టీలు తమ వైపే ఉన్నారని.. మైనార్టీల కోసం తాము 9 ఏళ్లుగా పని చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 286 మైనార్టీ హాస్టల్ లు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో బుల్డోజర్ కూల్చివేతలు లేవని… మిషనరీల పై దాడులు లేవని కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీ మోడీ, షాలను దేశంలో ఏ నేతను కూడా కేసీఆర్ విమర్శించలేదన్నారు. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రభల శక్తిగా ఎదగాలని తమ ఆలోచనని.. బీజేపీ, కాంగ్రెస్ తో తమకెందుకని అన్నారు.
Read Also: Lifestyle : మీకు విపరీతంగా కోపం వస్తుందా? అయితే ఈ టిప్స్ ను తప్పక పాటించాల్సిందే..
తమ పైనే ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయని… కాంగ్రెస్ నేతల మీద ఎందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేయడం లేదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు?. ఓటుకు నోటు కేసును కేంద్ర సర్కార్ ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ఈసీ బదిలీలను, బదిలీలుగా మాత్రమే చూస్తామన్నారు. మరోవైపు తమకు 85 కంటే సీట్లు తగ్గవని అనుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు. 2018 మేనిఫేస్టోలోని 95 శాతం హామీలు అమలు చేశామని.. కరోనా వల్ల నిరుద్యోగ భృతి ఇవ్వలేక పోయామన్నారు. హుజూరాబాద్ లో బీఆర్ఎస్ గెలుస్తుందని… గజ్వేల్ లో ఈటల పోటీ చేసే హక్కు ఉందని తెలిపారు.
- Tags
- ANNOUNCE
- BRS
- ktr
- MLA candidates
- soon
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!