Minister KTR : యువ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తెలంగాణ గమ్యస్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైటెక్స్ మూడు రోజుల పాటు జరగనున్న టై గ్లోబల్ సమ్మిట్ను రాష్ట్ర ఐటీ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. ఈ సదస్సులో అడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయన్, గ్రీన్కో గ్రూపు ఎండీ, సీఈవో అనిల్ కుమార్లతోపాటు 2,500 మంది డెలిగేట్స్, 550కి పైగా టై చార్టర్ సభ్యులు వీరితోపాటు 17 దేశాలకు చెందిన 150 అంతర్జాతీయ స్పీకర్లు, 200కి పైగా పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ఏడోసారి జరుగుతున్న ఈ గ్లోబల్ సమ్మిట్లో ప్రపంచ వ్యవస్థాపక అభివృద్ధిపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఎనిమిదిన్నర ఏళ్లలో ఎన్నో అద్భుతాలు చేసిందన్నారు. ప్రయివేట్ రాకెట్ స్పెస్లోలోకి పంపిన స్టార్ట్ అప్ టీ హబ్ కి చెందినదేనని ఆయన వ్యాఖ్యానించారు. యువ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తెలంగాణ గమ్యస్థానమన్నారు. తెలంగాణలో 50 సెక్టార్లలో 6500 స్టార్ట్ఆప్లున్నాయని ఆయన వెల్లడించారు.
యువ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తెలంగాణ గమ్యస్థానమని, శాంతను….హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలన్నారు. ఇప్పటికే….ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద అడోబ్ క్యాంపస్ కోసం హైదరాబాద్ ను ఎంచుకున్నందుకు ధన్యవాదాలన్నారు. స్టార్టుప్ లకు హైదరాబాద్ సొంతగడ్డగా మారిందన్నారు. అనంతరం అడోబి సిస్టమ్స్ సీఈఓ శాంతను నారాయన్ మాట్లాడుతూ.. నా సొంత గడ్డ హైదరాబాద్ కు తిరిగి వచ్చినందుకు ఆనందంగా ఉందని, ఇప్పుడు ఉన్నట్టుగా హైదరాబాద్ అప్పట్లో ఉండి ఉంటే నేను విదేశాలకు వెళ్లేవాడిని కాదన్నారు. కాబోయే వ్యవస్థాపకులందరికి నా నుంచి చిన్న సలహా….మీ కలలను విడిచిపెట్టకండని ఆయన అన్నారు.
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!