Kottu Satyanarayana: ఇంద్రకీలాద్రిపైకి భక్తుల తాకిడి.. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కనక దుర్గమ్మ ఇవాళ దుర్గాదేవిగా అమ్మవారు దర్శనం ఇస్తున్నారు అని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఎంతో ప్రశాంతంగా ఇప్పటి వరకూ సజావుగా దసరా ఉత్సవాలు జరిగాయి.. రేపు ఉదయం 3 గంటల నుంచి మహిషాసురమర్ధని అవతారంలో అమ్మవారి దర్శనం ఉంటుంది అని ఆయన అన్నారు. రేపు ఉదయం 7:30 కి పోలీసు, ఎండోమెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ల సమన్వయ మీటింగ్ ఉంటుంది.. డిపార్ట్మెంట్ హెడ్స్ కూడా సమావేశంలో ఉంటారు.. కొంత పోలీసు సిబ్బంది డామినేషన్ గమనించడం జరిగింది.. అవసారానికి మించి పోలీసులు అజమాయిషీ చేయకూడదు అని మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు.
Read Also: Prabhas: కటౌట్ చూసి.. కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్
Also Read
మహిషాసుర మర్ధని, రాజరాజేశ్వరీ గా రేపు అమ్మవారు దర్శనం ఇస్తారు అంటూ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. శ్రవణా నక్షత్రయుక్త దశమిలో శమీపూజలు నిర్వహిస్తారు.. రేపు జమ్మిదొడ్డి వద్ద శమీపూజ నిర్వహిస్తాం.. అమ్మవారి అలంకరణ మార్పు కారణంగా రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచీ 2 గంటల వరకూ దర్శనం ఉండదు అని ఆయన తెలిపారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాలని సాయంత్రం 4:30 కి ఇంద్రకీలాద్రి నుంచీ బయలుదేరి 5:30 నుంచీ దుర్గాఘాట్ లో హంసవాహనం మీద నదీ విహారం ఉంటుందని మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు.
Read Also: TDP-Janasena Meeting: రేపే టీడీపీ-జనసేన పార్టీల తొలి జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ
భక్తులకు కూడా దుర్గాఘాట్ లో వీక్షించే అవకాశం ఇచ్చామని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. ఆనవాయితీగా వన్ టౌన్ పోలీసు స్టేషనుకు అమ్మవారి ఉత్సవ విగ్రహాలు తరలిస్తాం.. 24న దశమి ఉంది కనుక.. భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.. రేపటి రోజు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాటు చేసాం.. మంగళవారం నుంచీ గురువారం వరకూ భవానీల తాకిడి ఉంటుంది.. హంసవాహనంలో తెప్పోత్సవం జరిగేప్పుడు 30 మందికే అవకాశం ఉందని మంత్రి అన్నారు.
తాజావార్తలు
-
Ashu Reddy: మోసం కేసులో ట్విస్ట్.. మౌనం వీడిన అషు రెడ్డి
-
M. S. Subbulakshmi biopic. : M. S. సుబ్బలక్ష్మి బయోపిక్ నుండి సాయి పల్లవి ఔట్
-
Abhishek Sharma: అభిషేక్ శర్మకు చేదు అనుభవం.. హద్దు మీరిన లేడీ ఫ్యాన్, వీడియో వైరల్!
-
Delhi: టేకాఫ్ సమయంలో ఇంజిన్లో మంటలు.. విమానంలోని ఆరుగురికి గాయాలు.!
-
Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్-ఎన్యుమరేషన్ ప్రారంభం..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!