AP Legislative Assembly: 50 ఏళ్లకే పెన్షన్లు ఇచ్చేందుకు పరిశీలన చేస్తున్నాం: మంత్రి కొండపల్లి
- శాసనమండలిలో పెన్షన్లపై వైసీపీ సభ్యుల ప్రశ్నలు
- సభ్యుల ప్రశ్నలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం
- మేము రాగానే వెంటనే ఒక వెయ్యి పెంచాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ శాసనమండలిలో పెన్షన్లపై వైసీపీ సభ్యులు ప్రశ్నలు సంధించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యే సమయానికి 53 లక్షల మందికి పెన్షన్లు ఉన్నాయని, కూటమి అధికారంలోకి వచ్చే సమయానికి 65 లక్షలకు పెన్షన్లు పెరిగాయని వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పేర్కొన్నారు. ఇప్పుడు పెన్షన్లు ఎన్ని తొలగించారని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చాక 1.89 లక్షల మందికి తగ్గించారని, బడ్జెట్లో ఉన్న పెన్షన్లకి సరిపడా కేటాయింపులు చేయలేదని వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయేల్ ఫైర్ అయ్యారు. వైసీపీ సభ్యుల ప్రశ్నలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు.
‘గత ప్రభుత్వ హయాంలో ఇబ్బడిముబ్బడిగా పెన్షన్లు మంజూరు చేసింది. కూటమి అధికారంలోకి వచ్చాక 1.89 లక్షల మందికి తగ్గించారు. బడ్జెట్లో ఉన్న పెన్షన్లకి సరిపడా కేటాయింపులు చేయలేదు. మీరు 50 ఏళ్లకే ఇస్తామన్న పెన్షన్లు ఇస్తారా? లేదా?. పెన్షన్ల పరిశీలన అంటూ తగ్గిస్తూ వెళ్తున్నారు. కూటమి నేతలు హామీ ఇచ్చిన విధంగా అర్హులకు పెన్షన్లు ఇవ్వాలి’ అని వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయేల్ డిమాండ్ చేశారు. ‘జగన్ ముఖ్యమంత్రి అయ్యే సమయానికి 53 లక్షల మందికి పెన్షన్లు ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చే సమయానికి 65 లక్షలకు పెన్షన్లు పెరిగాయి. ఇప్పుడు పెన్షన్లు తొలగిస్తే ఎన్ని తొలగించారు?’ అని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ప్రశ్నించారు. ‘యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. కొత్త ప్రభుత్వం వచ్చి 10 నెలలు గడుస్తున్నా ఇంతవరకూ ఏ ప్రతిపాదన చేయలేదు’ అని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేరొన్నారు.
Also Read
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 28 నుంచే ప్రారంభం..
- France: ఫ్రాన్స్లో ఎండలు భగభగ.. ఏసీల కోసం ఎగబడ్డ జనాలు
- Chilli Garlic Egg Salad Recipe: ఉదయాన్నే ఎనర్జీ కావాలా? 5 నిమిషాల్లో రెడీ.. రుచికరమైన హై-ప్రోటీన్ ఎగ్ సలాడ్
‘ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొలిసారి పెన్షన్లు మొదలుపెట్టారు. 2014లో పెన్షన్ వెయ్యి నుంచి రెండు వేలకు టీడీపీ ప్రభుత్వం పెంచింది. వృద్ధాప్య పెన్షన్లతో పాటు మత్స్యకార, ట్రాన్స్ జెండర్ పెన్షన్లు కూడా ఇస్తున్నాం. కేవలం కాలం చేసిన వారి పెన్షన్లు మాత్రమే తొలగించాం. 50 ఏళ్లకు పెన్షన్లు ఇచ్చేందుకు పరిశీలన చేస్తున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు యాభై ఏళ్లకే పెన్షన్లు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచటానికి ఐదేళ్ల సమయం తీసుకుంది. మేము రాగానే వెంటనే ఒక వెయ్యి పెంచాం’ అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు.
తాజావార్తలు
-
Most Powerful Weapons: మహాభారతంలో ఆ 11 అస్త్రాలు గనుక ప్రయోగిస్తే.. బూడిదే! దేవతలు సైతం వణికిపోయిన ఆయుధాలు ఇవే!
-
Vijayashanthi : ఫీజు బకాయిలపై విజయశాంతి ఫైర్.!
-
Yoga vs Gym: గుండె ఆరోగ్యానికి యోగా బెటారా? జిమ్కు వెళ్లాలా.?
-
Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 28 నుంచే ప్రారంభం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!