PM Modi Vizag Tour: ఈ నెల 8న ఏపీకి ప్రధాని మోడీ.. మంత్రుల కమిటీ ఏర్పాటు
- మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ప్రధాని మోడీ..
- ఈ నెల 8వ తేదీన విశాఖ పర్యటనకు ప్రధాని..
- విశాఖలో రోడ్ షో నిర్వహించనున్న ప్రధాని మోడీ..
- మోడీ పర్యటనను విజయవంతం చేసేందుకు మంత్రుల కమిటీ ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Vizag Tour: భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారు.. ఈ నెల విశాఖ పర్యటన ఖరారైనట్టు జిల్లా యంత్రాంగానికి ఇప్పటికే సమాచారం అందించారు.. 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ ఎయిర్పోర్టు చేరుకోనున్నారు మోడీ.. అయితే, ఈ నెల 8 తేదీన ప్రధాని మోడీ పర్యటనను విజయవంతం చేసేందుకు మంత్రుల కమిటీని నియమించారు సీఎం చంద్రబాబు నాయుడు.. కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కొలుసు పార్థసారథి.. ఈ విషయాన్ని వెల్లడించారు.. విశాఖ రైల్వే జోన్ కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు.. ఎన్టీపీసీ ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.. రూ.65,370 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు ఎన్టీపీసీ పెడుతోంది.. 2500 ఎకరాల్లో కృష్ణపట్నం ఇండస్ట్రియల్ జోన్ కు కూడా ప్రధాని ప్రారంభిస్తారు.. నక్కపల్లి వద్ద ఏర్పాటు చేయనున్న బల్క్ డ్రగ్ పార్క్ కు కూడా పీఎం మోడీ శంకుస్థాపన చేస్తారు.. బల్క్ డ్రగ్ పార్కులో రూ.11,542 కోట్లు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు పార్థసారథి..
Read Also: West Bengal: మమతా బెనర్జీ సన్నిహితుడి హత్య..
Also Read
- PoK Protests: "మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్ను సహాయం కోరుతాం!".. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
- Morning Diet Tips: ఉదయాన్నే ఏం తినాలి? ఏం తినకూడదు? నిపుణుల హెచ్చరిక
- Monsoon 2026: రైతన్నలకు బిగ్ అలర్ట్.. ఈ 15 రోజులు అత్యంత కీలకం.. భారీ వర్షాలు!
- Pakistan-Afghanistan: పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. పాకిస్థాన్పై ఆఫ్ఘనిస్థాన్ డ్రోన్ దాడులు!
ఇక, జనవరి 8 తేదీన ప్రధాని మోడీ విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభ నుంచే ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు మంత్రి పార్థసారథి.. అంతకుముందు విశాఖలో ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహిస్తారు.. నగరంలోని సంపత్ వినాయక టెంపుల్ నుంచి ఏయూ గ్రౌండ్స్ వరకూ రోడ్ షో ఉంటుందని తెలిపారు.. మరోవైపు.. వచ్చే విద్య సంవత్సరం లోగా తల్లికి వందనం పథకం అందించేందుకు కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుంది.. రైతులకు ఇచ్చే ఆర్ధిక సాయం అన్నదాతా సుఖీభవ కార్యక్రమాన్ని కేంద్రంతో పాటే ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాం అన్నారు.. కేంద్ర సాయంతో కలిపి రూ.20 వేలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాం.. వేట నిలిచిపోయిన సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్ధిక సాయం రూ.20 వేలు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయించారని వెల్లడించారు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి..
తాజావార్తలు
-
NTRxTrivikram : ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై తమిళ తంబీల ఆగ్రహం.. కారణమేంటంటే?
-
PoK Protests: “మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్ను సహాయం కోరుతాం!”.. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
-
Tata Sierra EV: 665KM రేంజ్తో టాటా సియెర్రా EV లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Ravi Teja Sree Vishnu: రవితేజ, శ్రీవిష్ణు మల్టీస్టారర్ ఫిక్సా? సంక్రాంతి రేసులో దిల్ రాజు భారీ ప్లాన్!
-
Morning Diet Tips: ఉదయాన్నే ఏం తినాలి? ఏం తినకూడదు? నిపుణుల హెచ్చరిక
ట్రెండింగ్
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!