PDS Ration Scam: డబ్బులు కడితే పేర్ని నాని దొర అవుతాడా?.. తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు!
- రేషన్ బియ్యం మిస్సింగ్ కేసు
- డబ్బులు కడితే పేర్ని నాని దొర అవుతాడా?
- బియ్యం కుంభకోణంపై సిట్ ఏర్పాటుకు సిఫార్సు చేస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని గోదాముల్లో రేషన్ బియ్యం మిస్సింగ్ కేసుపై మంత్రి కొల్లు రవీంద్ర సీరియస్ అయ్యారు. ఈ కేసులో పేర్ని నానికి సహకరిస్తున్నారని ఆరోపణలు ఉన్న అధికారులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. విచారణలో భాగంగా అధికారుల పాత్ర ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్ బియ్యం కుంభకోణంపై సిట్ ఏర్పాటుకు సిఫార్సు చేస్తానన్నారు. తప్పు చేసి డబ్బులు కడితే పేర్ని నాని దొర అవుతాడా? అని మంత్రి ప్రశ్నించారు. పదేపదే నీతి వ్యాఖ్యలు చెప్పే పేర్ని నాని.. ఇపుడు ఎక్కడ ఉన్నాడు? అని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు.
మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ… ‘పేదల బియ్యం కొట్టేసిన పేర్ని నానిని పంది కొక్కులా చూడాలి. నీతులు చెప్పే నాని ఇప్పుడు అడ్రస్ లేరు. దొంగ పనులు చేసి.. నిత్యం నీతులు చెప్పేవారు. తప్పు చేసి డబ్బులు కడితే దొర అవుతాడా?. పదేపదే నీతి వ్యాఖ్యలు చెప్పే నాని.. ఇపుడు ఎక్కడ ఉన్నారు?. పేర్ని నాని కుటుంబం స్కాం చేసింది వాస్తవం, అది స్వయానా నాని ఒప్పుకున్నారు. దారి మళ్లిన పీడీఎస్ రైస్ స్కాంపై వివరణ ఇచ్చుకోలేని దుస్థితిలో నాని ఉన్నారు. తప్పు చేయనపుడు దొంగలా తప్పించుకొని తిరగడం ఎందుకు?’ అని ప్రశ్నించారు.
Also Read
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
Also Read: Prakasam Earthquakes: ప్రకాశం జిల్లాలో వరుసగా మూడోరోజు భూప్రకంపనలు!
‘తప్పు చేసిన ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు. స్కాంపై సిట్ ఏర్పాటుకు సిఫార్సు చేస్తాను. విచారణలో అధికారుల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు. కక్ష సాధింపు చేయాల్సిన మాకు అవసరం లేదు. కక్ష సాధింపు చేస్తే స్కాంలో ఉన్న పేర్ని నాని కుటుంభం మొత్తాన్ని జైలుకు పంపేవాళ్లం. కానీ మేము అలా చేయలేదు’ అని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. పేర్ని నాని అధికార దుర్వినియోగానికి పాల్పడి రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారని ఆరోపణలు ఉన్నాయి. 32,00 బస్తాల రేషన్ బియ్యం తగ్గినట్టు అధికారులకు నాని లేఖ రాయగా.. అధికారుల పరిశీలనలో 3,708 బస్తాలు తగ్గినట్టు తేలింది. బియ్యం తగ్గడంపై 2 దఫాలుగా రూ.1.70 కోట్లు పేర్ని నాని చెల్లించారు. గోదాములు నాని భార్య జయసుధ పేరుతో ఉండటంతో పోలీసులు ఆమెపై కూడా కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Mega 158 : చిరు సరసన నటించేందుకు బాలయ్య హీరోయిన్ నో..
-
Vaibhav Sooryavanshi-BCCI: అసలు వైభవ్ సూర్యవంశీ మా ప్రణాళికల్లోనే లేడు.. పెద్ద బాంబ్ పేల్చిన బీసీసీఐ!
-
TVS 160cc Maxi Scooter: టీవీఎస్ 160cc మ్యాక్సీ స్కూటర్.. యమహా ఏరాక్స్, హీరో జూమ్లకు గట్టి పోటీ
-
Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
-
Sai Durgha Tej : సాయి దుర్గ తేజ్ నెక్ట్స్ సినిమా టైటిల్ ‘పార్వేట’
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!