PDS Ration Scam: డబ్బులు కడితే పేర్ని నాని దొర అవుతాడా?.. తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు!
- రేషన్ బియ్యం మిస్సింగ్ కేసు
- డబ్బులు కడితే పేర్ని నాని దొర అవుతాడా?
- బియ్యం కుంభకోణంపై సిట్ ఏర్పాటుకు సిఫార్సు చేస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని గోదాముల్లో రేషన్ బియ్యం మిస్సింగ్ కేసుపై మంత్రి కొల్లు రవీంద్ర సీరియస్ అయ్యారు. ఈ కేసులో పేర్ని నానికి సహకరిస్తున్నారని ఆరోపణలు ఉన్న అధికారులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. విచారణలో భాగంగా అధికారుల పాత్ర ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్ బియ్యం కుంభకోణంపై సిట్ ఏర్పాటుకు సిఫార్సు చేస్తానన్నారు. తప్పు చేసి డబ్బులు కడితే పేర్ని నాని దొర అవుతాడా? అని మంత్రి ప్రశ్నించారు. పదేపదే నీతి వ్యాఖ్యలు చెప్పే పేర్ని నాని.. ఇపుడు ఎక్కడ ఉన్నాడు? అని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు.
మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ… ‘పేదల బియ్యం కొట్టేసిన పేర్ని నానిని పంది కొక్కులా చూడాలి. నీతులు చెప్పే నాని ఇప్పుడు అడ్రస్ లేరు. దొంగ పనులు చేసి.. నిత్యం నీతులు చెప్పేవారు. తప్పు చేసి డబ్బులు కడితే దొర అవుతాడా?. పదేపదే నీతి వ్యాఖ్యలు చెప్పే నాని.. ఇపుడు ఎక్కడ ఉన్నారు?. పేర్ని నాని కుటుంబం స్కాం చేసింది వాస్తవం, అది స్వయానా నాని ఒప్పుకున్నారు. దారి మళ్లిన పీడీఎస్ రైస్ స్కాంపై వివరణ ఇచ్చుకోలేని దుస్థితిలో నాని ఉన్నారు. తప్పు చేయనపుడు దొంగలా తప్పించుకొని తిరగడం ఎందుకు?’ అని ప్రశ్నించారు.
Also Read
- Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
- Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
- North Korea: కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ? రెండు నెలలుగా కనిపించని ఉత్తర కొరియా అధినేత
- Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
Also Read: Prakasam Earthquakes: ప్రకాశం జిల్లాలో వరుసగా మూడోరోజు భూప్రకంపనలు!
‘తప్పు చేసిన ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు. స్కాంపై సిట్ ఏర్పాటుకు సిఫార్సు చేస్తాను. విచారణలో అధికారుల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు. కక్ష సాధింపు చేయాల్సిన మాకు అవసరం లేదు. కక్ష సాధింపు చేస్తే స్కాంలో ఉన్న పేర్ని నాని కుటుంభం మొత్తాన్ని జైలుకు పంపేవాళ్లం. కానీ మేము అలా చేయలేదు’ అని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. పేర్ని నాని అధికార దుర్వినియోగానికి పాల్పడి రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారని ఆరోపణలు ఉన్నాయి. 32,00 బస్తాల రేషన్ బియ్యం తగ్గినట్టు అధికారులకు నాని లేఖ రాయగా.. అధికారుల పరిశీలనలో 3,708 బస్తాలు తగ్గినట్టు తేలింది. బియ్యం తగ్గడంపై 2 దఫాలుగా రూ.1.70 కోట్లు పేర్ని నాని చెల్లించారు. గోదాములు నాని భార్య జయసుధ పేరుతో ఉండటంతో పోలీసులు ఆమెపై కూడా కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
-
Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
-
North Korea: కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ? రెండు నెలలుగా కనిపించని ఉత్తర కొరియా అధినేత
-
Medico Priyanka : కిమ్స్లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
-
Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!