Minister Atchannaidu: ఒక్క పింఛన్ కూడా తీయం.. ప్రతి ఒక్కరికి అందిస్తాం..
- శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం వాండ్రాడ గ్రామంలో మంద్రి అచ్చెన్నాయుడు పర్యటన..
- లబ్ధిదారుల ఇంటికి వెళ్లి రూ. 7 వేలు పింఛన్ సొమ్ము అందజేత..
- పెన్షన్ల కోసమే ఏడాదికి 36000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం..
- ఒక్క పింఛన్ కూడా తీయకుండా.. ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తామని ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Atchannaidu: ఒక్క పింఛన్ కూడా తీయకుండా.. ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తామని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం వాండ్రాడ గ్రామంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి రూ. 7 వేలు పింఛన్ సొమ్మును అందజేశారు మంత్రి.. పెరిగిన పింఛన్ రూ. 4 వేలు, మూడు నెలల బకాయిలు 3వేలు మొత్తం ఒకేసారి రూ. 7వేలు అందజేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు లబ్ధిదారులు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. పెన్షన్ల కోసమే ఏడాదికి 36,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం అని వివరించారు..
Read Also: New Criminal Laws: నేటినుంచి అమల్లోకి కొత్త చట్టాలు.. ఢిల్లీలో తొలి ఎఫ్ఐఆర్ నమోదు
Also Read
- Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే 'ఫ్లఫీ ఆమ్లెట్' చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
- Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
- Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
- Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
ప్రజల శ్రేయస్సు కోరే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.. 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలుగుదేశం పార్టీ వారికి పెన్షన్ తీసేశారు.. సానుభూతిపరులకు వేధించారని మండిపడ్డారు.. అయితే, మా ప్రభుత్వంలో అలాంటి వాటికి తావులేదు.. ఒక్క పింఛన్ కూడా తీయకుండా ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తాం అన్నారు.. మరోవైపు.. వాలంటీర్ వ్యవస్థతతో సంబంధంలేకుండా పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం.. వాలంటీర్స్ కంటే ఒక గంట ముందే పింఛను పంపిణీ శామని ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి అచ్చెన్నాయుడు. కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది.. మంగళగిరి నియోజకవర్గంలో.. ఉదయమే స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్ల పంపిణీని ప్రారంభించారు.. ఇక, ఎక్కడికక్కడ మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Ramayan Leak: రణబీర్ కపూర్ ‘రామాయణం’ లీక్? ఆ 11 సెకన్ల క్లిప్ చూసి తలబాదుకుంటున్న ఫ్యాన్స్!
-
Adani Ports: రూ.13,225 కోట్ల మెగా డీల్.. అదానీ షేర్ కొనేందుకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు! ఆ షేర్ ఏదో తెలుసా?
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!