Kakani Govardhan Reddy: ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయ సేకరణ మాత్రమే.. ఫలితాలకు కొలమానం కాదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా గతంలో ఎన్నడూ లేని విధంగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆడుదాం అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నాం.. క్రీడాకారులను ప్రతిభను గుర్తించి.. వారిలో ఉత్తేజాన్ని కలిగించేందుకు ఇవి దోహదం చేస్తాయి.. క్రీడలకు సంబంధించి ఇది ఒక మహా యజ్ఞం లాంటిది.. కొందరు ఆడే వాళ్ళు ఉంటారు.. కొందరు క్రీడలను చూసి ఉత్తేజాం పొందే వారు ఉంటారు అని ఆయన పేర్కొన్నారు. ఇంత చక్కటి అవకాశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కల్పించారు.. ఐదు క్రీడలను ఆడుదాం.. ఆంధ్ర.. కింద నిర్వహిస్తున్నామని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి వెల్లడించారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఈ పోటీలు ఉంటాయని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర స్థాయిలో కూడా పోటీలను నిర్వహిస్తామన్నారు. ఈనెల 15 నుంచి ఫిబ్రవరి 3 వరకూ కొనసాగుతాయి.. రాష్ట్రస్థాయి పోటీలు విజేతలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేస్తారు.. ఆడుదాం.. ఆంధ్ర.. కోసం గ్రామీణ యువత ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తోంది.. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని ఆయన పిలుపునిచ్చారు.
Read Also: IND vs SA: టీమిండియా కెప్టెన్గా కేఎస్ భరత్!
Also Read
- Supplementary exams: పది ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్.. జూన్ 5 నుంచి పరీక్షలు..
- UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
- Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి 'భట్టి' భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
- Adhir Ranjan Chowdhury: మమతా బెనర్జీ కళ్లలో భయం, ఇలా ఎప్పుడూ చూడలేదు..
ఎగ్జిట్ పోల్స్ అనేవి అభిప్రాయ సేకరణకు పనికి వస్తుందే తప్ప.. పూర్తి ఫలితాలకు కొలమానం కాదు అని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. కొంత మేర మాత్రమే అభిప్రాయం వస్తుంది.. జిల్లాల్లో తెల్ల రాయి అక్రమ రవాణా పై టిడిపి నేత సోమిరెడ్డి హడావిడి చేస్తున్నారు.. అక్రమాన్ని అడ్డుకుంటామని చెప్పారు.. మైన్ యజమానులు కలసిన తరువాత దాని గురించి మాట్లాడటం లేదు.. గనుల యజమానుల నుంచి మామూళ్లు తీసుకున్నారు అని ఆయన పేర్కొన్నారు. 14 మందికి వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు.. వీరితో ఒప్పందం కుదరడంతో ఇప్పుడు సిలికాపై పడ్డారు.. ఈ విషయం పై తిరుపతి కలెక్టర్ ను కూడా కలిశారు.. అక్కడా ఒప్పందం కుదిరిందేమో.. అందుకే ఆ విషయాన్ని కూడా మళ్లీ మాట్లాడటం లేదు.. కిరాయికి రాజకీయాలు చేస్తున్నారు.. బెదిరింపులు, బ్లాక్ మెయిల్ లు ఆయనకు అలవాటే అంటూ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి విమర్శించారు.
తాజావార్తలు
-
Supplementary exams: పది ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్.. జూన్ 5 నుంచి పరీక్షలు..
-
Pan Masala: గుట్కా ప్రియులకు షాక్.. పాన్ మసాలా ప్యాకెట్లపై కేంద్రం సంచలన నిర్ణయం!
-
UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
-
Gayapadda Simham: స్టార్ హీరోల ఫాన్స్ గెట్ రెడీ ఫర్ బ్లాస్టింగ్ స్పూఫ్స్!
-
Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి ‘భట్టి’ భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో