Kakani Govardhan Reddy: జరిగింది ఫోన్ ట్యాపింగ్ కాదు.. మ్యాన్ ట్యాపింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్టీ మారాలనే నిర్ణయం కోటంరెడ్డి వ్యక్తిగతం.. వైసీపీపై బురద జల్లడం కోటంరెడ్డి మానుకోవాలన్నారు మంత్రి కాకాణి. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఇన్ని రోజులు కోర్టుకు ఎందుకు వెళ్లలేదు.. ఆడియో రికార్డు అని కోటంరెడ్డికి తెలుసన్నారు కాకాణి గోవర్ధన్రెడ్డి. ఫోన్ రికార్డింగ్ అని తెలుసు కాబట్టే ఫోన్ ట్యాపింగ్ అని డ్రామాలు చేస్తున్నారు.. ఫోన్ ట్యాపింగ్ జరగలేదు మ్యాన్ ట్యాపింగ్ జరిగింది.. కోటంరెడ్డి ఈ స్థాయికి రావడానికి కారణం జగన్ కారణం కాదా?. కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని చెప్పావు ఏమైందన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం…ముఖ్యమంత్రి .జగన్ మీద రూరల్ ఎం.ఎల్.ఏ.శ్రీధర్ రెడ్డి ఆరోపణలు చేశారు. పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. అది ఆయన వ్యక్తిగతం. ఏదో ఒక కారణం చెప్పి బయటకు వెళ్లాలనుకున్నారు. 2014 లో నెల్లూరు రూరల్ టికెట్ పై చాలా ఒత్తిళ్లు వచ్చాయి. అక్కడ జగన్ ఉన్నారు కాబట్టే టికెట్ వచ్చింది. నమ్మకం లేని చోట ఉండలేనని అంటున్నారు. ట్యాపింగ్ కాదు..రికార్డింగ్ అది శ్రీధర్ రెడ్డికి తెలుసు. ఫోన్ ట్యాపింగ్ కాదు..మ్యాన్ ట్యాపింగ్ జరిగింది..చంద్రబాబు మ్యాన్ ట్యాపింగ్ చేశారు. అందుకే టిడిపి వాళ్ళు ట్యాపింగ్..ట్యాపింగ్ అంటున్నారు.
Also Read
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- AI Job Fears: 'నా ఉద్యోగం సేఫ్నా?'.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
- Vaibhav's Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
Read Also: Pawan Kalyan: మూడో విడత సభ్యత్వ నమోదు…క్యాడర్ కు పవన్ రిక్వెస్ట్
నేను ట్యాపింగ్ పై ఆధారాలు అడిగా. అందుకే ఆడియో లీక్ చేయించారు. ట్యాపింగ్ జరగలేదు కాబట్టే శ్రీధర్ రెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు. కేసు పెట్టలేదన్నారు. నిన్ను పావుగా వాడుకుని చంద్రబాబు ఆడిస్తున్నారు. జగన్ కు వీర విధేయుడినని చెప్పావు. ఇప్పుడు ఇంకొకరికి విధేయుడిగా మారావ్ అని మండిపడ్డారు మంత్రి కాకాణి. టిడిపి వారికి ఒక అస్త్రం ఇచ్చేందుకే నువ్వు మాట్లాడావ్. ఆవేదన కాదు..ఆలోచన అవసరం. శ్రీధర్ రెడ్డి తీసుకున్న నిర్ణయం రాజకీయంగా ఆత్మహత్య లాంటిది. చంద్రబాబు చెప్పినట్లు శ్రీధర్ మాట్లాడుతున్నారు. లోకేష్ పాదయాత్ర విఫలం కావడంతో ప్రభుత్వం మీద బురద చల్లేందుకు శ్రీధర్ లాంటి వాళ్ళను ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు ఇసుక…మద్యం అక్రమాల గురించి మాట్లాడుతున్నారు.
నెల్లూరు రూరల్ లో జఠిగిన అక్రమాలపై కూడా విచారణ చేయిస్తాం అన్నారు. ఏదో ఒక ఆడియో విడుదలైతే సజ్జలను విమర్శించడం సరికాదు. రూరల్ నియోజకవర్గంలో పరిస్థితులు మారాయి. అందుకే చాలామంది శ్రీధర్ దగ్గర నుంచి బయటకు వస్తున్నారు. పార్టీ ముఖ్యమని భావించే వాళ్ళు ఎందరో ఉన్నారు. ఎన్ కౌంటర్ చేయాల్సిన అవసరం మాకు లేదు. శ్రీధర్ భుజంపై గన్ పెట్టి కాల్చాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. ట్యాపింగ్ జరగలేదు..ఇప్పటికైనా శ్రీధర్ ఆలోచించాలి. శ్రీధర్ కు జగన్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చారన్నారు.
Read Also: Pawan Kalyan: మూడో విడత సభ్యత్వ నమోదు…క్యాడర్ కు పవన్ రిక్వెస్ట్
తాజావార్తలు
-
Krrish 4 : ‘క్రిష్ 4’ ఆలస్యానికి కారణం అదే?
-
LGBT – A Legal Battle: ‘ఎల్జీబీటీ’ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
-
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్కుమార్ను ప్రమోషన్స్’కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!